చికాగోలో ‘నాట్స్ తెలుగమ్మాయి’కి విశేష స్పందన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న తెలుగమ్మాయి కార్యక్రమానికి చికాగోలో విశేష స్పందన లభించింది.
చికాగో: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న తెలుగమ్మాయి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా చికాగోలో నిర్వహించిన తెలుగమ్మాయి కార్యక్రమంలో వందలాది మంది తెలుగు మహిళలు పాల్గొని సందడి చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు గొప్పతనాన్ని ప్రదర్శించే వేదికగా అమెరికాలో నాట్స్ తెలుగు అమ్మాయి కార్యక్రమాన్ని రూపొందించారు. చికాగోలో తెలుగమ్మాయిలు తమ తెలుగుదనాన్ని ప్రదర్శించేందుకు పోటీ పడ్డారు. 350మందికి పైగా ఈ కార్యక్రమంలో సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని తెలుగుదనాన్ని చాటారు. ‘తెలుగమ్మాయి ముద్దుగుమ్మలు’ విభాగంలో విజేతగా హాసిని పోకల, తొలి రన్నరప్గా భామిని శనక్కాయల, 2వ రన్నరప్గా అక్షర ఆరికట్ల నిలిచారు. ‘కావ్య నాయకి’ విభాగంలో విజేతగా గీతిక మండల, తొలి రన్నరప్గా అనూష కడము, రెండో రన్నరప్గా పావని నల్లం నిలిచారు.
చికాగో చాప్టర్ సహ సమన్వయకర్త బిందు వీధులమూడి, నేషనల్ కోఆర్డినేటర్ లక్ష్మి బొజ్జా, చాప్టర్ మహిళా నాయకురాలు రోజా శీలంశెట్టి, చికాగో చాప్టర్ సమన్వయకర్త హరీష్ జమ్ముల, వీర తక్కెళ్లపాటి, భారతి పుట్ట, నరేంద్ర కడియాల, కార్తీక్ మోదుకూరి,వేణు కృష్ణారెడ్డిల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. చికాగోలాండ్కు చెందిన నాట్స్ ఈసీ నాయకులు మదన్ పాములపాటి, కృష్ణ నిమ్మగడ్డ, ఆర్.కె.బాలినేని తెలుగమ్మాయి కార్యక్రమం విజయవంతానికి అవసరమైన దిశా నిర్దేశాన్ని అందించారు. చికాగో ప్రాంతానికి చెందిన మూర్తి కొప్పాక, శ్రీను అరసాడ, శ్రీనివాస్ బొప్పన, రవి శ్రీకాకుళం ఈ కార్యక్రమానికి తమ పూర్తి సహకారం అందజేశారు. మే 26,27,28 తేదీల్లో న్యూజెర్సీలో జరగనున్న అమెరికా తెలుగు సంబరాలకు తెలుగువారంతా తరలిరావాలని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య (బాపు)నూతి , నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని సాదరంగా ఆహ్వానించారు. ప్రముఖ మహిళా నాయకురాలు చాందిని దువ్వూరి, హవిలా మద్దెల, టీఏసీజీసీ గత ప్రెసిడెంట్ ప్రవీణ్ వేములపల్లి, మిసెస్ ఎన్.ఆర్.ఐ గ్లోబల్ 2022 గౌరీ శ్రీ, మిసెస్ ఇండియా ఇల్లినాయిస్- శ్వేతా చిన్నారి తెలుగమ్మాయి కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. మాధురి పాటిబండ్ల తన యాంకరింగ్తో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఛాప్టర్ వాలంటీర్లు రాజేష్ వీధులమూడి, చెన్నయ్య కంబాల, అంజయ్య వేలూరు, నరేష్ యాద, బిందు బాలినేని, కళ్యాణి మందడపు, నవీన్ జరుగుల, సుజిత్ , శ్రీనివాస్ పిల్ల తదితరులు ఈ కార్యక్రమానికి తమ సహకారం అందించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తెలుగమ్మాయి కార్యక్రమానికి ప్రత్యేకంగా విందు భోజనం ఏర్పాటు చేసిన బౌల్ ఓ బిర్యానీ, బావర్చికి నాట్స్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విజ్ఞాన వికాసంపై తానా ప్రపంచ సాహిత్యవేదిక సదస్సు
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై సదస్సు విజ్ఞానదాయకంగా జరిగింది. -
ఘనంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్సైట్ ఆవిష్కరణ
ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ తన వెబ్సైట్ను www.qef.org ఆవిష్కరించింది. నాణ్యమైన సాంకేతిక ప్రయాణంలో దీన్నొక మైలురాయిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు పేర్కొన్నారు. -
ఏపీని ఆదుకునే ఎన్నారైలపై ఇంత అక్కసా?: జయరాం కోమటి
రాష్ట్రానికి మేలు చేసేలా కృషిచేస్తున్న ఎన్నారైలపై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడటం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. -
ఎన్ఆర్ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు
ఎన్ఆర్ఐ తెదేపా కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తెదేపా 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!