బ్లూమింగ్టన్-నార్మల్లో వీనుల విందుగా అష్టోత్తర శత నామ సంకీర్తనార్చన
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని బ్లూమింగ్టన్ నార్మల్లో స్థానిక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో (హిందు టెంపుల్ ఒఫ్ బ్లూమింగ్టన్ నార్మల్) "అష్టోత్తర శత నామ సంకీర్తనార్చన" సంగీత కార్యక్రమం వీనుల విందుగా జరిగింది.
బ్లూమింగ్టన్: అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని బ్లూమింగ్టన్ నార్మల్లో స్థానిక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో (హిందు టెంపుల్ ఒఫ్ బ్లూమింగ్టన్ నార్మల్) "అష్టోత్తర శత నామ సంకీర్తనార్చన" సంగీత కార్యక్రమం వీనుల విందుగా జరిగింది. “కళ్యాణి స్కూల్ అఫ్ మ్యూజిక్” ఆధ్వర్యంలో దేవాలయ యాజమాన్య సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంగీత విద్యార్థులు అనర్గళంగా 108 సంకీర్తనలు ఆలపించి ఆహుతుల్ని పరవశింపజేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ సంగీత ఝరి రాత్రి 8గంటల వరకు ఖండాంతరాలు దాటి ఓ ప్రవాహంలా సాగింది. 'కళ్యాణి స్కూల్ ఆఫ్ మ్యూజిక్' గురువు కల్యాణి అమరవాది ఆధ్వర్యంలో విద్యార్థులు స్వామికి సంకీర్తనార్చన చేస్తూ, ఆలయానికి విరాళాల్ని సేకరించేలా ప్రత్యేకించి చక్కటి ప్రణాళికతో సప్తస్వరాలకు అనుగుణంగా వివిధ గ్రూపులుగా ఏర్పడ్డారు.
భారత్తో పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి జూమ్ లింక్ ద్వారా కీర్తనలు ఆలపించగా.. బ్లూమింగ్టన్ నార్మల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయ విద్యార్థులు ప్రత్యక్షంగా ఆలయానికి విచ్చేసి సంకీర్తనార్చనలో పాల్గొన్నారు. ప్రారంభ కీర్తనగా "మేదిని జీవుల కావ మేలుకోవయ్యా!" అంటూ ఆ దేవదేవుణ్ని స్మరించగా.. ఈ సంగీత ప్రవాహం ఆరు భాషలు, 72 రాగాలలో స్వరపరిచి 30మందికి పైగా వాగ్గేయకారులు (త్యాగరాజు, శ్యామాశాస్త్రి , పురందర దాసు, తాళ్ళపాక అన్నమాచార్యులు, భక్త రామదాసు మొదలైనవారు) రచించిన కీర్తనలు, వివిధ తాళాలలో 27మంది విద్యార్థులు (నాలుగేళ్ల నుంచి మొదలుకుని 30 ఏళ్ల వయసు కలిగిన కళాకారులు) ఎంతో మధురంగా తన్మయత్వంతో ఆలపించారు. చివరగా "రామచంద్రాయ జనక రాజజా మనోహరయా" అనే మంగళ హారతి కీర్తనతో ముగించారు. విశేషంగా ప్రతి సంకీర్తన ఆలాపన తర్వాత ఒక తామర పుష్పంతో మహిళలు స్వామివారికి పుష్పమాల అల్లారు. 108 తామరపూల మాలలను కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామికి అర్చకులు అలకరించారు.
అనంతరం కల్యాణి అమరవాది "మగువల రాజుకు మంగళం " అనే మంగళ హారతి కీర్తనతో "అష్టోత్తర శత నామ సంకీర్తనార్చన" కార్యక్రమం 'షోడషోత్తర శత నామ సంకీర్తనార్చన '(116) కార్యక్రమంగా అందరినీ మంత్రముగ్దుల్ని చేసింది. ఆలయ కమిటీ అధ్యక్షులు, స్థానిక పిల్లల వైద్య నిపుణులు సంజయ్ సక్సేనా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న సంగీత కళాకారులందరికీ ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సంకీర్తనార్చనను యూట్యుబ్ ఛానల్లో ప్రపంచం నలుమూలల నుంచి నిరంతరం ప్రత్యక్షంగా వీక్షించేలా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి స్థానికులు నగదు రూపంలో, ఇతర భక్తులు ఆన్లైన్ ద్వారా విరాళాలు అందజేశారు. ఈ విరాళాలను భక్తుల కోరిక మేరకు, ఆలయంలోని ఉత్సవ, మూలమూర్తుల ఆభరణాల నిమిత్తం వినియోగించనున్నట్టు ఆలయ కమిటీ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబును కలిసిన తానా బృందం
ఏపీ సీఎం చంద్రబాబును తానా ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
తెదేపా నేత గౌరు వెంకటరెడ్డిని సత్కరించిన ప్రవాసాంధ్రులు
అమెరికా పర్యటనలో ఉన్న తెదేపా సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డిని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. -
తిరుమల కృష్ణ దేశికాచారికి గండపెండేర సత్కారం
ప్రముఖ కవి, రచయిత, మొట్టమొదటి తెలుగు ఫాంట్ వేమనను అందించిన టొరంటో వాస్తవ్యులు తిరుమల కృష్ణ దేశికాచారికి తెలుగువాహిని సంస్థ గండ పెండేరంతో సత్కరించింది. -
స్వర్ణోత్సవ వేడుకలకు రండి.. స్పీకర్, ఏపీ మంత్రులకు కృష్ణ లాం ఆహ్వానం
జీడబ్ల్యుటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను సెప్టెంబర్ 27, 28 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. -
ఖతర్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఖతర్లో పెద్దఎత్తున నిర్వహించారు. -
సింగపూర్లో వైభవంగా బోనాల పండుగ
సింగపూర్లో బోనాల జాతర ఘనంగా జరిగింది. -
అమెరికాలోని విద్యార్థులకు తెలుగు నేర్పడానికి ‘తానా-పాఠశాల’
అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాషను నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘తానా-పాఠశాల’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భానుప్రకాశ్ మాగులూరి తెలిపారు. -
ఏపీ అమెరికన్ అసోసియేషన్(AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభమైంది. -
నెదర్లాండ్స్లో ఎన్డీయే కూటమి విజయోత్సవాలు
నెదర్లాండ్స్లో ప్రవాసాంధ్రులు ఏపీలో ఎన్డీయే కూటమి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై కోమటి జయరాం సంతాపం
అమెరికాలోని బే ఏరియాలో నివాసముంటున్న ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై తెదేపా ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం, పలువురు ఎన్ఆర్ఐలు సంతాపం వ్యక్తం చేశారు. -
బ్రిస్బేన్లో తెదేపా విజయోత్సవ సంబరాలు!
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో క్వీన్స్ ల్యాండ్ తెదేపా ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. -
అమెరికాలో నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్
USA: అమెరికాలో నకిలీ కంపెనీలు సృష్టించి బలవంతంగా కొంతమందితో పని చేయించుకుంటున్న తెలుగువారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘సింగపూర్ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు