NRI News: ఏపీని ఆదుకునే ఎన్నారైలపై ఇంత అక్కసా?: జయరాం కోమటి
రాష్ట్రానికి మేలు చేసేలా కృషిచేస్తున్న ఎన్నారైలపై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడటం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు.
అమెరికా: ‘ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా.. పొగడరా నీతల్లి భూమి భారతిని’ అన్న గురజాడ వారి స్ఫూర్తితో ప్రవాసాంధ్రులు.. విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తమ వంతు కర్తవ్యంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమకు వీలైనంత మేరకు నిధులు సమకూరుస్తూ.. పాఠశాలల్ని దత్తత తీసుకుంటున్నారు. పల్లెల్లో వైద్య, ఆరోగ్య సేవలను మెరుగుపరచడంలో కృషిచేస్తున్నారు. అంతేకాదు పన్నులు సైతం కడుతున్నారు. విద్యనందించడంతో పాటు పరిశ్రమల స్థాపన ద్వారా రాష్ట్రంలోని అనేకమంది నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నారు. కరోనా కల్లోల సమయంలోనూ ప్రభుత్వంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి రోగులను ఆదుకున్నారు. కష్టకాలంలో ఆపన్న హస్తం అందించే ఎన్నారైలపై వైకాపా నాయకులు తీవ్ర విమర్శలు చేయడం, బెదిరింపులకు పాల్పడటం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. అధికార పార్టీ నేతల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నారైలను బెదిరిస్తూ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం వైకాపా అభ్యర్థి వరికూటి అశోక్ బాబు చేసిన వ్యాఖ్యలను జయరాం కోమటి ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏపీకి అన్ని విధాలా సాయం చేస్తున్న ఎన్నారైలను తీవ్రంగా అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. రాష్ట్రానికి ఎన్నారైల నుంచి అనేక విధాలుగా మేలు జరుగుతోందని, ఉద్యోగ కల్పన, ప్రజలకు ఆరోగ్య భద్రత, మురికివాడల అభివృద్ది, గ్రామీణ ప్రాంతాల దత్తత, విద్య, వైద్యం వంటి అనేక రంగాల్లో ఎన్నారైలు కృషి చేస్తోన్న విషయాన్ని వివరించారు. అన్నింటికీమించి, రాష్ట్రానికి ఆదాయం పెంచేలా పన్నులు చెల్లిస్తున్నారని, పరిశ్రమలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు వైకాపా నేతలు మానుకోవాలని హితవు పలికారు.
‘‘అసలు ఏం జరిగింది? ప్రవాస భారతీయులు గత ఎన్నికల సమయంలో ఏం చేశారో నాకు తెలియదు. ఇప్పుడు ఎన్నికలకు వచ్చి, గ్రామాల్లో గొడవలు చేస్తే మాత్రం, వారు ఏ దేశాల నుంచి వచ్చారో తిరిగి అక్క డకు వెళ్లడానికి వీల్లేకుండా చేస్తాం’’ అని వరికూటి అశోక్ బాబు హెచ్చరించారు. నియోజకవర్గం పరిధిలోని అమృతలూరు మండలం కూచిపూడిలో అశోక్ మీడియాతో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఒక వైపు ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమల్లో ఉండగా, బరిలో నిలిచిన వైకాపా అభ్యర్థి ప్రవాస భారతీయులను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు చేయడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని జయరాం కోమటి తెలిపారు. ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్న అశోక్ బాబుపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, వేమూరు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా COTA ఉగాది ఉత్సవాలు..
COTA ఆధ్వర్యంలో యూకేలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!