హ్యూస్టన్‌లో ఉత్సాహంగా ‘ఓఎంసీ క్లాస్‌ ఆఫ్‌ 82’ సమ్మేళనం

అమెరికాలోని హ్యూస్టన్‌లో ‘ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌ (ఓఎంసీ) బ్యాచ్‌ ఆఫ్‌ 77 క్లాస్‌ ఆఫ్‌ 82’ పేరుతో 40 సంవత్సరాల వార్షికోత్సవ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది.

Updated : 12 May 2023 08:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలోని హ్యూస్టన్‌లో ‘ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌ (ఓఎంసీ) బ్యాచ్‌ ఆఫ్‌ 77 క్లాస్‌ ఆఫ్‌ 82’ పేరుతో 40 సంవత్సరాల వార్షికోత్సవ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. డాక్టర్ ఉమా మోహన్‌ ఆధ్వర్యంలో మే 4 నుంచి మే 6 వరకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  మే 4 గురువారం రాత్రి డా. ఉమా మోహన్ నివాసంలో డిన్నర్‌తో ఈ సమ్మేళనం ప్రారంభమైంది. మే 5 శుక్రవారం సాయంత్రం గాయని శారద ఆకునూరితో కలిసి డా.సతీష్ జోషి, డా.శ్రీధర్, డా.భరత్, డా.వేణు, డా.విక్టర్, డా.రవికుమార్ పాడిన పాటలతో సంగీత విభావరి ఆహూతులను ఎంతగానో ఆకట్టుకుంది.  ఈ సమ్మేళనానికి అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 70 మంది హాజరయ్యారు. భారత్‌తోపాటు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మే 6 శనివారం ఉదయం నుంచే సందడి ప్రారంభమైంది. బస్‌లో నాసాకి వెళ్లిన అనంతరం ఇండియన్‌ రెస్టారెంట్‌లో అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆటపాటలు, డ్యాన్సులు, స్కిట్‌ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. సమ్మేళనం సందర్భగా ప్రత్యేక పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రముఖ పల్మనాలజిస్ట్‌ డా.కల్పలత ముఖ్యఅతిథిగా హాజరై మొదటి పుస్తకాన్ని విడుదల చేశారు. 

అనంతరం డా.ఉమ మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన డా. విజయానంద్, డా. భరత్ , డా. వాణి, డా. వేణు, డా. ఆశా, డా. అరుణ , డా. పాయ్,డా. సుభదలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత బాలీవుడ్‌ డ్యాన్సులతో కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. డా.ఉమ సారథ్యంలో వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమం మిత్రులకు మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని పలువురు అభిప్రాయపడ్డారు. త్వరలోనే మరో చోట సమ్మేళనాన్ని మళ్లీ నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని