PV Sindhu: పీవీ సింధును సత్కరించిన ‘సింగపూర్‌ తెలుగు సమాజం’

సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ విజేతగా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధును ‘సింగపూర్‌ తెలుగు సమాజం’ ప్రత్యేకంగా అభినందనలు తెలిపి సత్కరించింది

Updated : 18 Jul 2022 12:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ విజేతగా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధును ‘సింగపూర్‌ తెలుగు సమాజం’ ప్రత్యేకంగా అభినందనలు తెలిపి సత్కరించింది. సింగపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింధుతో పాటు ఆమె తండ్రి వెంకట రమణను ఆ సంఘం ప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా సింగపూర్‌ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ పీవీ సింధు తన ఆటతీరుతో భారతదేశంతో పాటు తెలుగువారందరూ గర్వించేలా చేసిందని.. భవిష్యత్‌లో మరిన్ని కీర్తి శిఖరాలు అధిరోహించాలన్నారు. కామెన్వెల్త్‌, వరల్డ్‌ ఛాంపియన్‌ షిష్‌లోనూ ఆమె విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

తనను సత్కరించిన సింగపూర్‌ తెలుగు సమాజానికి పీవీ సింధు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను తెలుసుకుని.. సింగపూర్‌లో నివసించే తెలుగువారికి చేస్తున్న సేవలను ఆమె కొనియాడారు. సింగపూర్‌ తెలుగు సమాజం జులై 31న నిర్వహించనున్న బ్యాడ్మింటన్‌ టోర్నీలో పాల్గొననున్న  క్రీడాకారులకు సింధు శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 13న సింగపూర్‌లో తెలుగు వనితలకు మాత్రమే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘నారీ’ కార్యక్రమంలో మహిళంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని