Qatar TDP: కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు.
ఖతార్: తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. పార్టీ నేతలతో పాటు తెదేపా శ్రేణులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పవిత్ర రంజాన్ మాసం కావడంతో పెద్దఎత్తున ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో మొదలైన ఈ కార్యక్రమంలో దివంగత నేత ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, పుష్ఫాంజలి ఘటించి నివాళులర్పించారు. ఎన్టీఆర్ తొలి రాజకీయ ఉపన్యాసం ‘తెలుగు జనతాకు వందనం.. తెలుగు యువతకు అభినందనం .. తెలుగు మమతకు అభివాదం .. తెలుగు జాతికి సుభాభినందనం’’ డైలాగ్తో ఆయన్ను స్క్రీన్పై చూడగానే ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా తన్మయత్వం చెందారు. ఆయన 1982లో ఇచ్చిన పిలుపునకు యావత్ తెలుగుజాతి ఏకతాటిపైకి కదిలివచ్చి, పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఈసందర్భంగా గుర్తుకు తీసుకొచ్చింది. దీనికి జూమ్ వేదికగా హాజరైన పలువురు నేతలు సభనుద్దేశించి ప్రసంగించారు.
మాచర్ల కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. ఖతార్ తెలుగుదేశం నాయకులు, శ్రేణులు ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. ఈ పోరాటంలో ప్రవాసాంధ్రులంతా భాగస్వామ్యం కావాలని, కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడం అందరూ కర్తవ్యంగా భావించాలని విజ్ఞప్తి చేశారు. తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రసంగిస్తూ.. ఖతార్ తెలుగుదేశం ప్రతీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోందన్నారు. నిస్వార్థంగా పార్టీపై అభిమానం, తెలుగు నేలపై ప్రేమతో ప్రవాసీయులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. ఖతార్ తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన ఖతార్ పర్యటన, సమావేశంలో పార్టీ శ్రేణులు చూపించిన ప్రేమాభిమానాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఖతార్లో తెదేపా 42వ ఆవిర్భావ దినోత్సవం పండగ వాతావరణాన్ని తలపించిందని, పార్టీ జెండాలు, తోరణాలు, ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ ఫ్లెక్సీలతో సభావేదిక అలంకరణ కనులపండువగా ఉందని తేజస్వీ పొడపాటి అన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమని, అప్రమత్తంగా లేకపోతే రాక్షసుడు రాష్ట్రాన్ని, యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తాడని హెచ్చరించారు.
ఖతార్ తెదేపా నేతలు, శ్రేణులు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించారని బబ్బూరి వెంగళరావు (బీవీఆర్), ఖతార్ తెదేపా అధ్యక్షులు గొట్టిపాటి రమణయ్య అన్నారు. ఏపీలో అరాచకం, దుర్మార్గం, కక్షసాధింపు తప్ప.. అసలు పాలనే లేదనడానికి బీవీఆర్ అనుభవమే నిదర్శనమని చెప్పుకొచ్చారు. పార్టీ గెలుపునకు సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఖతార్ తెదేపా ఉపాధ్యక్షులు మద్దిపాటి నరేష్ మాట్లాడుతూ.. అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెదేపా ముఖ్య ఉద్దేశాన్ని శ్రోతలకు వివరించారు. పార్టీ గెలుపునకు కృషి చేయాలని మీ గ్రామాల్లో స్నేహితులు, తెలిసినవారందరి సాయంతో ఆంధ్రులు ఎక్కడ నివసిస్తున్నా మే 13న జరిగే ఎన్నికల పోలింగ్లో పాల్గొని కూటమి అభ్యర్థులకు ఓటు వేసేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన తెదేపాపై తమకున్న అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరని షేక్ మహమ్మద్ యాసిన్, మహమ్మద్ బాషా అన్నారు. ఉర్దూ యూనివర్సిటీని స్థాపించటంతోపాటు ఉర్దూను సెకండ్ లాంగ్వేజ్ చేసిన ఘనత తెదేపాదేనని గుర్తు చేసుకున్నారు. రంజాన్ తోఫాలు, మక్కా పర్యటనకు ఆర్థిక సహాయం, ఉన్నతవిద్యకు పెద్దపీట వేసిన తెదేపాతోనే ముస్లిం సోదరులు ప్రయాణిస్తారని, ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, భాజపాను బూచిగా చూపి తమను తెదేపాకు దూరం చేయలేరన్నారు. తమ ప్రాణం ఉన్నంతవరకు తెదేపాతోనే నడుస్తామని, కూటమి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. ముస్లిం సోదరులంతా ఆ దిశగా నడవాలని పిలుపునిచ్చారు.
ఖతార్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పొనుగుమాటి రవి, ప్రోగ్రామ్స్ ఆర్గనైజర్ దాసరి రమేష్, జీసీసీ కౌన్సిల్ సభ్యుడు మల్లిరెడ్డి సత్యనారాయణ, సీనియర్ నేత శాంతయ్య యలమంచిలి, బోండ్లపాటి రజినీ, మాగులూరి రవీంద్ర, కోశాధికారి విక్రమ్ సుఖవాసి, అనిల్ మలసాని, సింగరాజు సంతోష్, ఎం.ఎన్.ఎం.నాయుడు, కళ్యాణ్, రావుల సాయిమోహన్ తదితరులు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల బలోపేతం కోసం, వారికి రాజ్యాధికారాన్ని చేరువ చేసేందుకు పెట్టిన పార్టీ తెదేపా అన్నారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి ఆ పార్టీకి రెండు కళ్లు అని, 1983లోనే కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో పేదలకు ఆసరా ఇచ్చిన ఘనత తమ పార్టీకే చెందుతుందన్నారు. ఆంధ్ర రాష్ట్ర భావి పౌరుల భవిష్యత్తు కోసం, పుట్టిన నేల కోసం, తెలుగుతల్లి రుణం తీర్చుకొనే సమయం ఆసన్నమైందని, ప్రతిఒక్కరూ తమ నియోజకవర్గాల్లో కూటమి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రోజుకు కనీసం మూడు, నాలుగు గంటల సమయాన్ని కూటమి గెలుపు కోసం వెచ్చించాలని, మే 13న అందరూ ఓటు వేసేలా ప్రోత్సహించాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావాలన్నా, రాష్ట్రానికి తలమానికం అమరావతి కల కార్యరూపం దాల్చాలన్నా, రాష్ట్రాభివృద్ధి తిరిగి గాడిన పడాలన్నా, పక్క రాష్ట్రాలతో పోటీ పడాలన్నా, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలన్నా కూటమి గెలుపుతో ‘చంద్రబాబు అనే నేను..’ అనే మాట తెలుగు నేలపై మరోసారి ప్రతిధ్వనించాలన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలే తెలుగు ప్రజల ఆశలకు చివరి అవకాశమని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా COTA ఉగాది ఉత్సవాలు..
COTA ఆధ్వర్యంలో యూకేలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?