కాలిఫోర్నియాలో శంకర ఐ ఫౌండేషన్ ‘ఫండ్ రైజింగ్ డిన్నర్’కు విశేష స్పందన
శంకర ఐ ఫౌండేషన్(Sankara Eye Foundation)కు నిధుల సేకరణలో భాగంగా వార్షిక ఫండ్ రైజింగ్ డిన్నర్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించిన ఈ డిన్నర్కు దాదాపు 300 మంది ఎన్నారైలు హాజరయ్యారు.
బే ఏరియా: శంకర ఐ ఫౌండేషన్(Sankara Eye Foundation)కు నిధుల సేకరణలో భాగంగా వార్షిక ఫండ్ రైజింగ్ డిన్నర్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించిన ఈ డిన్నర్కు దాదాపు 300 మంది ఎన్నారైలు హాజరయ్యారు. తొలుత శంకర ఐ ఫౌండేషన్ బోర్డు సభ్యులు వెంకట్ మద్దిపాటి అతిథులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శంకర ఐ ఫౌండేషన్ ఇండియా వ్యవస్థాపకులు, పద్మశ్రీ డాక్టర్ రమణి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్నారులకు కంటి చూపును ప్రసాదించడం ద్వారా వారి భవిష్యత్తు బాగుంటుందన్నారు. అలాగే, మధ్య వయసులో ఉన్న వారికి చూపును అందిస్తే వారు తమ కుటుంబాన్ని పోషించుకోగలుగుతారని.. వృద్ధులకు చూపు అందించడం ద్వారా ఎవరిపైనా ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోగలుగుతారని తెలిపారు. దీనివల్ల ఆయా కుటుంబాలు బాగుపడతాయని.. ఉత్పాదకత పెరిగి దేశం పురోగమిస్తుందన్నారు.
అనంతరం శంకర ఐ ఫౌండేషన్ ఛైర్మెన్ మురళీ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ నిర్వహిస్తోన్న ఆస్పత్రుల ద్వారా దాదాపు 25లక్షల మందికి పైగా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి చూపును ప్రసాదించిందన్నారు. భారత్ నుంచి వచ్చిన భరత్, కౌశిక్, సుందర్ ఆసుపత్రుల పనితీరు, నిర్వహణ గురించి ఈ కార్యక్రమంలో వివరించారు. కాలిఫోర్నియాలో నిర్వహించిన ఫండ్ రైజింగ్ డిన్నర్ ద్వారా దాదాపు 6లక్షల డాలర్లు సేకరించినట్టు శంకర ఐ ఫౌండేషన్ బోర్డు మెంబర్ వెంకట్ మద్దిపాటి వెల్లడించారు. ఈ నిధులను భారత్లో కంటి ఆసుపత్రి నిర్మాణానికి, ఉచిత కంటి ఆపరేషన్ల కోసం వినియోగిస్తామని తెలిపారు. 2030 నాటికి ఏటా పది లక్షల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించడమే తమ లక్ష్యమన్నారు. అలాగే, గుంటూరు, వారణాసి, కాన్పూర్లలో ఆస్పత్రుల విస్తరణ కోసం మరింత మంది దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లో ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ సుదీర్ చెముడుగుంట తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు ఆసుపత్రి సేవలు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ప్రస్తుతం ఉన్న 300 పడకల ఆసుపత్రి ద్వారా దాదాపు 30వేల కంటి ఆపరేషన్లు చేస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్రంలో మరింత మందికి సేవలందించేందుకు గుంటూరు ఆసుపత్రిని 600 పడకలకు విస్తరించి ఏటా 60వేల మందికి వైద్యం అందించడమే లక్ష్యంగా కృషిచేస్తున్నట్టు తెలిపారు. ఈ డిన్నర్ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శంకర ఐ ఫౌండేషన్కు విరాళాలు ఇచ్చి మద్దతుగా నిలుస్తున్న వారిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. వెంకట్ డోకిపర్తి, అంజు దేశాయ్, రామదాసు పులి, సుధీర్ వేముల, సత్య తోట, రాజ్ తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సింగపూర్లో ఎన్నారైలతో ఘనంగా డా.రామ్మాధవ్ పుస్తక పరిచయ కార్యక్రమం
'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్లో ప్రవాస భారతీయులతో డా.రామ్మాధవ్ రచించిన నూతన గ్రంథం ‘ది ఇండియన్ రియాలిటీ: మారుతున్న కథనాలు, షిఫ్టింగ్ పర్సెప్షన్’ పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. -
ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో కువైట్లో ఎన్నికల ప్రచారం
ఎన్నారై తెదేపా కువైట్ ఆధ్వర్యంలో తెదేపా-జనసేన-భాజపా కూటమికి మద్దతుగా విస్త్రృత ప్రచారం నిర్వహించారు. -
లండన్లో వైభవంగా ‘తాల్’ ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
‘సామెతలు.. తెలుగు భాషకు సింగారం..’
సామెతలు మన తెలుగు భాషకు సింగారం అని, వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిదీ అని తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు అన్నారు. తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 67వ సమావేశం ‘తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు’ అనే కార్యక్రమం ఆసాంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగింది. -
యూకేలో ఘనంగా ఉగాది సంబరాలు.. TAS నూతన కార్యవర్గం ఎన్నిక
యూకేలోని స్కాట్లాండ్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
ఘనంగా ‘కెంటకీ తెలుగు సంఘం’ ఉగాది వేడుకలు
కెంటకీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ఘనంగా COTA ఉగాది ఉత్సవాలు..
COTA ఆధ్వర్యంలో యూకేలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్