పిట్స్బర్గ్లో వైభవంగా షిరిడీ సాయినాథుని పల్లకి ఉత్సవం
అమెరికాలో పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్లో సచ్చిదానంద సద్గురు షిరిడి సాయిథుని పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. షిరిడి సాయి గానగ మందిర్ ఆధ్వర్యంలో జులై 16న నిర్వహించిన .......
పిట్స్బర్గ్: అమెరికాలో పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్లో సచ్చిదానంద సద్గురు షిరిడి సాయిథుని పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. షిరిడి సాయి గానగ మందిర్ ఆధ్వర్యంలో జులై 16న నిర్వహించిన ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. షిరిడి సాయి గానగ మందిర్ వ్యవస్థాపకులు వెంకట్ దిరిశాల (బాబా వెంకట్) ఆధ్వర్యంలో చెక్క వెంకట సత్యనారాయణ మూర్తి (మూర్తి), లక్ష్మి దంపతులు, శశి చలిమిడి, హరిత బండ్లమూడి, మాల్యాద్రి కొరిపి, సతీష్ చెల్లబోయిన, తిరుమల రెడ్డి అల్ల, రవి, దివ్య, స్రవంతి దురిశేటి, శ్రీకాంత్ ముద్దసాని, సాహు జగ్నయసెన్, ప్రణవన్ త్యాగరాజన్ తదితరులు అహర్నిశలు కృషిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 150 మంది భక్తులు తరలివచ్చి సాయినాథుడి పట్ల తమ భక్తిని చాటుకున్నారు.
చిన్మయ మిషన్ (పిట్స్బర్గ్) ఆలయ ప్రధాన అర్చకులు ధర్మతేజ ఈ పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవం క్రతువులో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, గురు ప్రార్థన, బాబా అభిషేకం (శ్రీ రుద్రప్రశ్నః), బాబా మూల మంత్రం, సంపుటీకరణ సాయి విశేష అర్చన, మహా నైవేధ్య, బాబా హారతి, మంత్ర పుష్పంతో శాస్త్రోక్తంగా ఈ పల్లకి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్రవంతి దురిశేటి, శిరీష వీరంరెడ్డి, దీత్య దీపక్, ఉదయ మేఘరాజ్, రమాదేవి పప్పు, సుజాత మామిడి ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. షిరిడి సాయి గానగ మందిరం తరపున ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అమెరికాలో పుట్టి పెరిగిన ఈ తరం పిల్లలకు షిరిడి సాయినాథుని ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించిన వెంకట్ దిరిశాల, నళిని దంపతులకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.
సాయి పల్లకి ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తమవంతు సహకారం అందించిన డా.శ్రీకాంత్, చెక్క వెంకట సత్యనారాయణ మూర్తి (మూర్తి),మాల్యాద్రి కొరిపి, కార్తిక్, వెంకట్, హరిత బండ్లమూడి, రమేష్ వేముల, శివ జూలూరు, శివ, రవి కిరణ్ తుమ్మల, రమణ (ఫోటోగ్రాఫర్), శిరీష గుంటక (ఫోటోగ్రాఫర్), అలాగే భక్తులకు ప్రసాదం సమకూర్చిన వారితో పాటు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు వెంకట్ దిరిశాల దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
షిరిడి సాయి గానగ మందిర్ ఇటు అమెరికాలోను, అటు భారతదేశంలోనూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒంగోలు జిల్లా ముండ్లమూరు మండలంలోని వేములబండ గ్రామంలో షిరిడి సాయి గానగ మందిరం తరపున వృద్ధాశ్రమం, అనాధ ఆశ్రమాలు స్థాపించి ఆశ్రయంతో పాటు పిల్లలకు విద్యను అందిస్తోంది. ఎవరైనా అనాధ పిల్లలను గానీ, వృద్ధులను గానీ చేర్పించాలన్నా.. సంస్థ చేస్తోన్న సామాజిక కార్యక్రమాలకు మీ వంతు ఆర్థిక సాయం అందించాలనుకున్నా www.ssgmus.org వెబ్సైట్లో చూడవచ్చని నిర్వాహకులు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డాలస్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డాలస్ నగరంలో ఘనంగా నిర్వహించారు. -
వాషింగ్టన్ డీసీలో ఘనంగా తానా (నరేన్ వర్గం) విజయోత్సవ సభ
తానా ఎన్నికల్లో డా.నరేన్ కొడాలి వర్గం నుంచి గెలిచిన అభ్యర్థులంతా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం శనివారం (మార్చి 23న) సాయంత్రం వాషింగ్టన్ డీసీలో విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. -
సింగపూర్లో స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఘనంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు
మార్చి 18న స్వరలయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సింగపూర్లో నివసించే తెలుగు గాయకులు ఉత్సాహంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుపుకొన్నారు. -
NATS: డల్లాస్లో వైభవంగా నాట్స్ తెలుగు వేడుకలు
నాట్స్ తెలుగు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు డల్లాస్లోని పది వేల మందికిపైగా తెలుగువారు హాజరయ్యారు. -
లండన్లో సీబీఈ అవార్డు అందుకున్న తెలుగు బిడ్డ డా.కన్నెగంటి చంద్ర
నిజామాబాద్ జిల్లాలో జన్మించి లండన్లో స్థిరపడిన భారతీయ వైద్యుడు కన్నెగంటి చంద్ర ప్రతిష్ఠాత్మక ‘కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (సీబీఈ)’ పురస్కారాన్ని అందుకొన్నారు. -
Indra Nooyi: అమెరికాలో వరుస ఘటనలు.. భారత విద్యార్థులకు ఇంద్రానూయీ సూచనలు
అమెరికా (USA)లో ఉన్న భారత విద్యార్థులకు పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ(Indra Nooyi) పలు సూచనలు చేశారు. -
కూటమిని గెలిపిద్దాం.. రాష్ట్రాన్ని కాపాడుకుందాం: ఎన్ఆర్ఐల తీర్మానం
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు ఆదివారం సమావేశమయ్యారు. -
Indian origin Family: అనుమానాస్పద స్థితిలో కెనడాలో భారత సంతతి కుటుంబం మృతి
కెనడా(Canada)లో భారత సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
జనసేన ఆవిర్భావ వేడుకల వేళ.. డల్లాస్లో జనసేన, తెదేపా, భాజపా ఆత్మీయ సమావేశం
డల్లాస్లో జనసేన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన నేతలతో పాటు తెదేపా, భాజపా క్యాడర్కు చెందిన పలువురు హాజరయ్యారు. -
సింగపూర్లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
సింగపూర్లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. -
న్యూజెర్సీలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
శివుడికి ప్రీతిపాత్రమైన మహా శివరాత్రి పర్వదినాన ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ అగ్రరాజ్యంలో ఎన్నారైలు ముక్తకంఠంతో నినదించారు. -
న్యూజెర్సీలో ఓఎఫ్ భాజపా ఆధ్వర్యంలో ‘ఛాయ్పే చర్చ’
న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో ‘ఛాయ్ పే చర్చ’ నిర్వహించారు. -
బే ఏరియాలో ‘తెదేపా-జనసేన-భాజపా’కు చెందిన ఎన్ఆర్ఐల ఆత్మీయ సమావేశం
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడిన ఎన్ఆర్ఐలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
అమెరికాలో మే 24-26 మధ్య టీటీఏ మహాసభలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) అగ్రరాజ్యంలో భారీగా మహాసభలు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు టీటీఏ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. -
సౌదీ అరేబియాలో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి సమావేశం
సౌదీ అరేబియాలోని జుబైల్లో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి భేటీ అయ్యింది. రాబోయే ఎన్నికలకు వ్యూహరచన చేసేందుకు ‘ఎన్నికల సన్నాహక ఆత్మీయ సమావేశం’ పేరిట ఈ భేటీ నిర్వహించారు. -
డెట్రాయిట్లో అట్టహాసంగా మహిళా దినోత్సవం
గ్లోబల్ తెలంగాణ సంఘం డెట్రాయిట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. -
తానా బోర్డు ఛైర్మన్గా డా.నాగేంద్ర శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ప్రతిష్ఠాత్మక బోర్డు ఛైర్మన్ పదవికి డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
డెట్రాయిట్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ మహిళల దినోత్సవం(మార్చి 8) పురస్కరించుకుని ఫార్మింగ్టన్ మేనర్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన లేడీస్ నైట్ అట్టహాసంగా జరిగింది. -
TDP - Janasena: షికాగోలో ఘనంగా తెదేపా - జనసేన ఆత్మీయ సమావేశం
తెదేపా, జనసేన నాయకులు షికాగోలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
TANA Foundation: తానా ఫౌండేషన్ ఛైర్మన్గా శశికాంత్ వల్లేపల్లి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఫౌండేషన్ చైర్మన్గా శశికాంత్ వల్లేపల్లి ఎన్నికయ్యారు. -
Sporty Divas: ఇండో-గల్ఫ్ త్రోబాల్ ఛాంపియన్షిప్ విజేతగా అమెరికా జట్టు
బహ్రెయిన్లో నిర్వహించిన ‘ఇండో-గల్ఫ్ ఇంటర్నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్’లో అమెరికాకు చెందిన మహిళల జట్టు ‘స్పోర్టీ దివాస్’ విజేతగా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం