TANA: డిసెంబర్‌ 2 నుంచి ‘తానా’ చైతన్య స్రవంతి కార్యక్రమం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ‘చైతన్య స్రవంతి’ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్‌ 2 నుంచి జనవరి 7 వరకు నిర్వహించనున్నారు.

Updated : 13 Nov 2022 01:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ‘చైతన్య స్రవంతి’ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్‌ 2 నుంచి జనవరి 7 వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ‘తానా’ ఒక ప్రతికా ప్రకటన విడుదల చేసింది. ‘అంకిత సేవా భావం - అద్భుత కళాధామం’ నినాదంతో వివిధ సామాజిక సేవ, సాంస్కృతిక కార్యక్రమాలకు ‘తానా’ శ్రీకారం చుట్టింది. ‘చైతన్య స్రవంతి’లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా క్యాన్సర్‌ అవగాహన శిబిరాలు, 30కి పైగా కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. 2500 మంది రైతులకు రక్షణ పరికరాలు, 500 మందికి పైగా రైతులకు వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేయనున్నారు. విద్యార్థుల కోసం 10కి పైగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సైకిళ్లు, క్రీడా పరికరాలతో పాటు మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని విద్యార్థులకు అందించాలని నిర్ణయించారు. దివ్యాంగుల కోసం మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. ప్రముఖ కవులు, రచయితలు, సాహితీ దిగ్గజాల ప్రసంగాలతో విభిన్న అంశాలపై చర్చా వేదికలు ఏర్పాటు చేయనున్నారు. ‘తానా’ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, ‘తానా ఫౌండేషన్’ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారు. ‘తానా’ చైతన్య స్రవంతి కో-ఆర్డినేటర్ సునిల్ పంత్ర సమన్వయం చేస్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని