TANA: ‘తానా’ నామినేషన్ల ఘట్టం పూర్తి.. ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి!
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘తానా’ ఎన్నికల (TANA Elections) నామినేషన్ల ఘట్టం నేటితో పూర్తయింది. అన్ని పదవులకూ రెండు వర్గాలు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘తానా’ ఎన్నికల (TANA Elections) నామినేషన్ల ఘట్టం నేటితో పూర్తయింది. అన్ని పదవులకూ రెండు వర్గాలు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవికి మిచిగాన్లో నివసించే శ్రీనివాస గోగినేని, వర్జీనియాలో ఉండే నరేన్ కొడాలి లాంటి ఉద్ధండులు పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నికలపై ఆసక్తి మరింత పెరిగింది. 4 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, 29 ఎగ్జిక్యూటివ్ కమిటీ కమిటీ, 7 తానా ఫౌండేషన్ ట్రస్టీ.. ఇలా మొత్తం 40 పదవులకు బలీయమైన ఈ రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. రెండు వర్గాలూ అమెరికాలోని 50 రాష్ట్రాల్లోని తానా సభ్యులను జల్లెడపట్టి మరీ ఎంపిక చేసి ఎన్నికల బరిలో నిలిపినట్లు తెలుస్తోంది. అధ్యక్ష అభ్యర్థుల ప్యానెళ్లకు అనుభవం కలిగిన మహిళలు, యువతతో కూడిన టీమ్స్ సమకూరడంతో ఎన్నికల సరళి, ఫలితాలపై గతంలో ఎన్నడూ లేనివిధంగా చర్చలు సాగుతున్నాయి.
అధ్యక్ష పదవికి పోటీపడుతున్న శ్రీనివాస గోగినేని సీనియర్ తానా నాయకుడి ఉన్నారు. గతంలో తానా ఫౌండేషన్ ఛైర్మన్గా అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన గుర్తింపు ఆయనకుంది. 2015లో డెట్రాయిట్ తానా కాన్ఫరెన్స్కు సెక్రటరీగానూ గోగినేని పనిచేశారు. దీనికారణంగా ఎంతోమందితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలను కలిగి ఉన్నారు. సంస్కరణలాభిలాషిగా గుర్తింపు పొందిన ఆయన.. గతంలో రెండుసార్లు తానా ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అయితే ఈసారి బలమైన వర్గం దన్ను, పూర్తి ప్యానెల్తో ముందుకు రావడంతో ఎన్నికలపై ఆసక్తి పెరిగింది. శ్రీనివాస గోగినేని ప్యానెల్ టీంకు తదుపరి అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, మాజీ అధ్యక్షుడు జయ్ తాళ్లూరితో పాటు పలువురి పెద్దలు మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు నరేన్ కొడాలి కూడా అధ్యక్షుడిగా బరిలో ఉన్నారు. ఆయన కూడా తానాలో సీనియర్ నాయకుడు. గతంలో బోర్డు ఛైర్మన్గానూ విజయంతంగా పనిచేశారు. అంతేకాకుండా 2019 వాషింగ్టన్ డీసీ కాన్ఫరెన్స్కు ఆయన ఛైర్మన్గా సేవలందించారు. వృత్తిరీత్యా ప్రొఫెసర్ కావడంతో గత ఎన్నికల్లో పూర్తి ప్యానెల్తో గట్టి పోటీ ఇచ్చిన కారణంగా వచ్చిన గుర్తింపుతో ఎంతోమందితో నరేన్కు ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నాయి. గత ఎన్నికలు పూర్తయినప్పటి నుంచే తిరిగి బరిలో ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లలో ఆయన నిమగ్నమై ఉన్నారు. నరేన్ ప్యానెల్ టీంకు తానా ప్రస్తుత అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, మాజీ అధ్యక్షులు గంగాధర్ నాదెళ్ల, సతీష్ వేమనతో పాటు మరికొంతమంది మద్దతు ఉన్నట్లు సమాచారం.
గతకొంతకాలంగా వివిధ కారణాలతో తానాలోని కార్యవర్గాలు, నాయకుల మధ్య పరిమితికి మించి వర్గ వైషమ్యాలు పెరిగాయి. దీంతో ఇబ్బందికర వాతావరణం ఉండటంతో ఎన్నికలు ఏకగ్రీవంగా లేదా సామరస్యంగా జరపాలని పలువురు కోరుతున్నారు. దీనికోసం తానా మాజీ అధ్యక్షులు జయరాం కోమటి ఇప్పటికే పలు దఫాలుగా ఇరు వర్గాలతో రాజీకి యత్నించినా చేసినా సఫలం కాలేదు. అయినప్పటికీ ఎన్నికలు నివారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబును కలిసిన తానా బృందం
ఏపీ సీఎం చంద్రబాబును తానా ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
తెదేపా నేత గౌరు వెంకటరెడ్డిని సత్కరించిన ప్రవాసాంధ్రులు
అమెరికా పర్యటనలో ఉన్న తెదేపా సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డిని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. -
తిరుమల కృష్ణ దేశికాచారికి గండపెండేర సత్కారం
ప్రముఖ కవి, రచయిత, మొట్టమొదటి తెలుగు ఫాంట్ వేమనను అందించిన టొరంటో వాస్తవ్యులు తిరుమల కృష్ణ దేశికాచారికి తెలుగువాహిని సంస్థ గండ పెండేరంతో సత్కరించింది. -
స్వర్ణోత్సవ వేడుకలకు రండి.. స్పీకర్, ఏపీ మంత్రులకు కృష్ణ లాం ఆహ్వానం
జీడబ్ల్యుటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను సెప్టెంబర్ 27, 28 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. -
ఖతర్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఖతర్లో పెద్దఎత్తున నిర్వహించారు. -
సింగపూర్లో వైభవంగా బోనాల పండుగ
సింగపూర్లో బోనాల జాతర ఘనంగా జరిగింది. -
అమెరికాలోని విద్యార్థులకు తెలుగు నేర్పడానికి ‘తానా-పాఠశాల’
అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాషను నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘తానా-పాఠశాల’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భానుప్రకాశ్ మాగులూరి తెలిపారు. -
ఏపీ అమెరికన్ అసోసియేషన్(AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభమైంది. -
నెదర్లాండ్స్లో ఎన్డీయే కూటమి విజయోత్సవాలు
నెదర్లాండ్స్లో ప్రవాసాంధ్రులు ఏపీలో ఎన్డీయే కూటమి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై కోమటి జయరాం సంతాపం
అమెరికాలోని బే ఏరియాలో నివాసముంటున్న ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై తెదేపా ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం, పలువురు ఎన్ఆర్ఐలు సంతాపం వ్యక్తం చేశారు. -
బ్రిస్బేన్లో తెదేపా విజయోత్సవ సంబరాలు!
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో క్వీన్స్ ల్యాండ్ తెదేపా ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. -
అమెరికాలో నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్
USA: అమెరికాలో నకిలీ కంపెనీలు సృష్టించి బలవంతంగా కొంతమందితో పని చేయించుకుంటున్న తెలుగువారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘సింగపూర్ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం