సెప్టెంబర్ 24న తానా అంతర్జాతీయ కవయిత్రుల సమ్మేళనం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24న కవయిత్రుల సమ్మేళనం నిర్వహించనున్నారు. ‘నారీ- సాహిత్య భేరి’ పేరిట అంతర్జాతీయ కవయిత్రుల సమ్మేళనం జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24న కవయిత్రుల సమ్మేళనం నిర్వహించనున్నారు. ‘నారీ- సాహిత్య భేరి’ పేరిట నిర్వహించే అంతర్జాతీయ కవయిత్రుల సమ్మేళనానికి నారీ- సాహిత్య భేరి పేరిట నిర్వహించే అంతర్జాతీయ కవయిత్రుల సమ్మేళనానికి గుంటూరు ఖతార్లో నివసిస్తున్న ప్రముఖ రచయిత్రి డా.వేంకట మాధవీ లలిత జినుగును ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. తానా నిర్వహించే ఈ మహత్తర కార్యక్రమంలో కవిత్వం వినిపించేందుకు తనకు విశిష్టమైన స్థానాన్ని కల్పించినందుకు గాను ఆమె తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
(డా. వేంకట మాధవీ లలిత)
దాదాపు 14గంటల పాటు నిర్విరామంగా కొనసాగనున్న ఈ సాహిత్య సమ్మేళనంలో భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాలకు చెందిన ప్రముఖ తెలుగు కవయిత్రులు, రచయిత్రులు పాల్గొననున్నారు. వీరితో పాటు ప్రముఖ మహిళలు సైతం హాజరుకానున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలం వేదికగా జరిగే ఈ కార్యక్రమం 10కి పైగా మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. యూప్ టీవీ ద్వారా యూరోపియన్ దేశాలు, అమెరికా వంటి దేశాల్లో, ఈటీవీ భారత్, మన టీవీ, తెలుగు వన్, తానా అధికారిక యూట్యూబ్, ఫేస్బుక్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇలాంటి ప్రత్యేక కార్యక్రమానికి తమను ఎంపిక చేసినందుకు మాధవీ లలిత హర్షం వ్యక్తం చేశారు. డా. వేంకట మాధవీ లలిత జినుగు ప్రజారోగ్యంలో పీహెచ్డీ చేశారు. తాత, తండ్రుల పరంపరగా వచ్చిన సంగీత సాహిత్య అభిరుచితో ఆమె ఛందోబద్ధమైన కవిత్వం, వచన కవిత్వం మాత్రమే కాకుండా కర్ణాటక సంగీతం (గాత్రం, వీణ) తదితర ప్రావీణ్యాలతో అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలుగు భాషపై ప్రత్యేక మక్కువ చాటుతూ, భావి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. గుంటూరుకు చెందిన డా.మాధవి గుంటూరు, హైదరాబాద్లో అధ్యాపకురాలిగా విధులు నిర్వహించి, ప్రస్తుతం ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ అథారిటీ- ఖతార్లో పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు.
అలాగే, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి వి.పద్మావతిని ఈ సమ్మేళనానికి ప్రత్యేక అతిథిగా తానా ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో తన కవిత్వం వినిపించేలా తనకు విశిష్టమైన స్థానాన్ని కల్పించినందుకు గాను ఆమె తానా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. యటపాక మండలంలో ప్రభుత్వ కార్యదర్శిగా సేవలందిస్తోన్న పద్మావతి అనేక వచన కవితలు, పాటలు రచించారు. రచయిత్రిగా, గాయనిగా ప్రసిద్ధిగాంచారు. సామాజిక సేవలోనూ ముఖ్య భూమిక పోషిస్తూ అనేకమంది కవులను ప్రోత్సహిస్తున్నారు. పద్మావతికి తానా ద్వారా ఇంత మంచి గుర్తింపు రావడం పట్ల అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలువురు పెద్దలు, కవి పండితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా COTA ఉగాది ఉత్సవాలు..
COTA ఆధ్వర్యంలో యూకేలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది.