NRI: ఠాగూర్ మల్లినేని ఆధ్వర్యంలో పెనమలూరులో తానా స్రవంతి కార్యక్రమం సక్సెస్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ తరఫున తానా మీడియా కో ఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని ఆధ్వర్యంలో పెనమలూరులో నిర్వహించిన తానా స్రవంతి కార్యక్రమం విజయవంతమైంది.
విజయవాడ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ తరఫున తానా మీడియా కో ఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని ఆధ్వర్యంలో పెనమలూరులో నిర్వహించిన తానా స్రవంతి కార్యక్రమం విజయవంతమైంది. జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు తానా ప్రతినిధులతో పాటు ఏరియా ప్రముఖులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేయూత కార్యక్రమం కింద పేద విద్యార్థులకు రూ.లక్ష విలువైన స్కాలర్ షిప్లు అందజేశారు. రైతు కోసం కార్యక్రమం కింద పేద రైతులకు పవర్ స్ప్రేయర్లు, రక్షణ పరికరాలు అందించారు. ఆదరణ కార్యక్రమం కింద మహిళలకు కుట్టుమిషన్లు, వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.
ఎన్నారై శ్రీనివాస నాదెళ్ల .. పెనమలూరు జెడ్పీ పాఠశాల పేద విద్యార్థికి రూ.10వేల ఆర్థికం సాయం చేశారు.తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ...కార్పొరేట్ స్కూల్ కంటే మిన్నగా హైస్కూల్ విద్యార్థులు పరిశుభ్రతకు పెద్ద పీట వేయడం సంతోషంగా ఉందన్నారు. తాను కూడా ఇలాంటి పాఠశాలలోనే చదువుకుని నేడు అమెరికాలో ఉన్నతోద్యోగం చేస్తున్నానని వివరించారు. ఈ ప్రాంతానికి చెందిన ఠాగూర్ మల్లినేని కూడా ఇక్కడే చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారని, మీరు కూడా కష్టపడి చదివితే అభివృద్ధి చెందుతారని విద్యార్థులకు సూచించారు. పాఠశాల, పెనమలూరు అభివృద్ధికి తానా తరఫున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ మాట్లాడుతూ... వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జెడ్పీ హైస్కూల్కు కావాల్సిన ఫర్నిచర్, ఇతర అవసరాలను తీర్చేందుకు తానా ఫౌండేషన్ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఠాగూర్ మల్లినేని మాట్లాడుతూ.. పెనమలూరు ప్రాంత అభివృద్ధికి, జెడ్పీ హైస్కూల్కు కావాల్సిన సౌకార్యాల కల్పనకు తనవంతు కృషి చేస్తానన్నారు. గ్రామస్థులు, విద్యార్థుల కోసం ఉచిత వైద్యశిబిరాలు, పేద విద్యార్థులు బాగా చదువుకునేందుకు వీలుగా స్కాలర్షిప్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లు తానా తరఫున అందజేసినట్టు చెప్పారు. తానా సెక్రెటరీ సతీష్ వేమూరి, తానా చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్ సునీల్ పాంత్రాతోపాటు, నాగా పంచుమర్తి, శ్రీనివాస్ ఓరుగంటి, జోగేశ్వరరావు పెద్దిబోయిన, శ్రీనివాస్ నాదెళ్ళ, పవన్ దొడ్డపనేని, అనిల్ వీరపనేని, గ్రామ సర్పంచ్ లింగాల భాస్కర్, పలువురు తానా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్య విద్యార్థిని సాయి వర్దిని కిలారు బృందం , పెనమలూరుకు చెందిన సుధీర్ పాలడుగు, వర ప్రసాద్ మరీదు, నరేంద్ర బాబు మోర్ల, ప్రవీణ్ కిలారు, కోడూరు మహేష్ , కృష్ణ దావులూరి, సురేష్ కిలారు, సాంబశివరావు వీరంకి, తిరుమల గండరపు, గోపినాథ్ అర్చన, జావుల్లా రెహమాన్ షేక్ వాలంటీర్లుగా సేవలందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!