NRI: ఠాగూర్ మల్లినేని ఆధ్వర్యంలో పెనమలూరులో తానా స్రవంతి కార్యక్రమం సక్సెస్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ తరఫున తానా మీడియా కో ఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని ఆధ్వర్యంలో పెనమలూరులో నిర్వహించిన తానా స్రవంతి కార్యక్రమం విజయవంతమైంది.
విజయవాడ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్ తరఫున తానా మీడియా కో ఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని ఆధ్వర్యంలో పెనమలూరులో నిర్వహించిన తానా స్రవంతి కార్యక్రమం విజయవంతమైంది. జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు తానా ప్రతినిధులతో పాటు ఏరియా ప్రముఖులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేయూత కార్యక్రమం కింద పేద విద్యార్థులకు రూ.లక్ష విలువైన స్కాలర్ షిప్లు అందజేశారు. రైతు కోసం కార్యక్రమం కింద పేద రైతులకు పవర్ స్ప్రేయర్లు, రక్షణ పరికరాలు అందించారు. ఆదరణ కార్యక్రమం కింద మహిళలకు కుట్టుమిషన్లు, వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.
ఎన్నారై శ్రీనివాస నాదెళ్ల .. పెనమలూరు జెడ్పీ పాఠశాల పేద విద్యార్థికి రూ.10వేల ఆర్థికం సాయం చేశారు.తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ...కార్పొరేట్ స్కూల్ కంటే మిన్నగా హైస్కూల్ విద్యార్థులు పరిశుభ్రతకు పెద్ద పీట వేయడం సంతోషంగా ఉందన్నారు. తాను కూడా ఇలాంటి పాఠశాలలోనే చదువుకుని నేడు అమెరికాలో ఉన్నతోద్యోగం చేస్తున్నానని వివరించారు. ఈ ప్రాంతానికి చెందిన ఠాగూర్ మల్లినేని కూడా ఇక్కడే చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారని, మీరు కూడా కష్టపడి చదివితే అభివృద్ధి చెందుతారని విద్యార్థులకు సూచించారు. పాఠశాల, పెనమలూరు అభివృద్ధికి తానా తరఫున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ మాట్లాడుతూ... వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జెడ్పీ హైస్కూల్కు కావాల్సిన ఫర్నిచర్, ఇతర అవసరాలను తీర్చేందుకు తానా ఫౌండేషన్ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఠాగూర్ మల్లినేని మాట్లాడుతూ.. పెనమలూరు ప్రాంత అభివృద్ధికి, జెడ్పీ హైస్కూల్కు కావాల్సిన సౌకార్యాల కల్పనకు తనవంతు కృషి చేస్తానన్నారు. గ్రామస్థులు, విద్యార్థుల కోసం ఉచిత వైద్యశిబిరాలు, పేద విద్యార్థులు బాగా చదువుకునేందుకు వీలుగా స్కాలర్షిప్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లు తానా తరఫున అందజేసినట్టు చెప్పారు. తానా సెక్రెటరీ సతీష్ వేమూరి, తానా చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్ సునీల్ పాంత్రాతోపాటు, నాగా పంచుమర్తి, శ్రీనివాస్ ఓరుగంటి, జోగేశ్వరరావు పెద్దిబోయిన, శ్రీనివాస్ నాదెళ్ళ, పవన్ దొడ్డపనేని, అనిల్ వీరపనేని, గ్రామ సర్పంచ్ లింగాల భాస్కర్, పలువురు తానా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్య విద్యార్థిని సాయి వర్దిని కిలారు బృందం , పెనమలూరుకు చెందిన సుధీర్ పాలడుగు, వర ప్రసాద్ మరీదు, నరేంద్ర బాబు మోర్ల, ప్రవీణ్ కిలారు, కోడూరు మహేష్ , కృష్ణ దావులూరి, సురేష్ కిలారు, సాంబశివరావు వీరంకి, తిరుమల గండరపు, గోపినాథ్ అర్చన, జావుల్లా రెహమాన్ షేక్ వాలంటీర్లుగా సేవలందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబును కలిసిన తానా బృందం
ఏపీ సీఎం చంద్రబాబును తానా ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
తెదేపా నేత గౌరు వెంకటరెడ్డిని సత్కరించిన ప్రవాసాంధ్రులు
అమెరికా పర్యటనలో ఉన్న తెదేపా సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డిని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. -
తిరుమల కృష్ణ దేశికాచారికి గండపెండేర సత్కారం
ప్రముఖ కవి, రచయిత, మొట్టమొదటి తెలుగు ఫాంట్ వేమనను అందించిన టొరంటో వాస్తవ్యులు తిరుమల కృష్ణ దేశికాచారికి తెలుగువాహిని సంస్థ గండ పెండేరంతో సత్కరించింది. -
స్వర్ణోత్సవ వేడుకలకు రండి.. స్పీకర్, ఏపీ మంత్రులకు కృష్ణ లాం ఆహ్వానం
జీడబ్ల్యుటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను సెప్టెంబర్ 27, 28 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. -
ఖతర్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఖతర్లో పెద్దఎత్తున నిర్వహించారు. -
సింగపూర్లో వైభవంగా బోనాల పండుగ
సింగపూర్లో బోనాల జాతర ఘనంగా జరిగింది. -
అమెరికాలోని విద్యార్థులకు తెలుగు నేర్పడానికి ‘తానా-పాఠశాల’
అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాషను నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘తానా-పాఠశాల’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భానుప్రకాశ్ మాగులూరి తెలిపారు. -
ఏపీ అమెరికన్ అసోసియేషన్(AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభమైంది. -
నెదర్లాండ్స్లో ఎన్డీయే కూటమి విజయోత్సవాలు
నెదర్లాండ్స్లో ప్రవాసాంధ్రులు ఏపీలో ఎన్డీయే కూటమి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై కోమటి జయరాం సంతాపం
అమెరికాలోని బే ఏరియాలో నివాసముంటున్న ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై తెదేపా ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం, పలువురు ఎన్ఆర్ఐలు సంతాపం వ్యక్తం చేశారు. -
బ్రిస్బేన్లో తెదేపా విజయోత్సవ సంబరాలు!
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో క్వీన్స్ ల్యాండ్ తెదేపా ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. -
అమెరికాలో నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్
USA: అమెరికాలో నకిలీ కంపెనీలు సృష్టించి బలవంతంగా కొంతమందితో పని చేయించుకుంటున్న తెలుగువారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘సింగపూర్ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు.