ప్రవాసాంధ్రులు కళ్లు తెరవకపోతే అక్కడ మీ ఆస్తులకు రక్షణ కరవే.. మన్నవ
ఏపీలో ప్రస్తుతం ఉన్న పాలక పక్షం గద్దె దిగితేనే ప్రవాసాంధ్రుల ఆస్తులకు రక్షణ ఉంటుందని ముప్పాళ్ల నాగేశ్వరరావు, మన్నవ సుబ్బారావు అన్నారు. ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సమావేశం వాషింగ్టన్ డీసీలో భాను ప్రకాష్ మాగులూరి అధ్యక్షతన జరిగింది.
వాషింగ్టన్ డీసీ: ఏపీలో ప్రస్తుతం ఉన్న పాలక పక్షం గద్దె దిగితేనే ప్రవాసాంధ్రుల ఆస్తులకు రక్షణ ఉంటుందని మన్నవ సుబ్బారావు అన్నారు. ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సమావేశం వాషింగ్టన్ డీసీలో భాను ప్రకాష్ మాగులూరి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, మైనేని రాంప్రసాద్, తానా వైస్ ప్రెసిడెంట్ నరేన్ కొడాలి, కొమ్మి సుబ్బయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ప్రగతి కుంటు పడింది. రాజధాని లేని రాష్ట్రంగా, అభివృద్ధి ఆనవాళ్లు లేని దిశగా సాగుతోంది. దానికి అనుగుణంగా ప్రవాసాంధ్రులు తమ వంతు సహాయ సహకారాలు మాతృభూమికి అందించాలి. గత నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలో పలు రంగాలు కుదేలయ్యాయి. సంక్షేమ పథకాల పేరిట జరుగుతున్న పాలన పూర్తిగా అసమంజసం. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి’’ అన్నారు. అనంతరం మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. సమర్థ నాయకత్వ లేమి, అవివేక, కక్షపూరిత నిర్ణయాలతో రాష్ట్రం పూర్తిగా అప్పులపాలైంది. నాలుగేళ్లలో రూ.11.30 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ భారం ప్రజలపై పడింది. ప్రవాసాంధ్రులు కళ్లు తెరవకపోతే అక్కడ మీ ఆస్తులకు, ఆప్తులకు కూడా రక్షణ ఉండదు. ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరం కలవడం సంతోషంగా ఉంది’’ అన్నారు. కొత్తగా ఎన్నికైన తానా నూతన ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నరేన్ కొడాలిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఏ దేశమేగినా ఏ రంగంలో అడుగుపెట్టినా తెలుగువారు, భారతీయులంతా కష్టపడేతత్వంతో ముందుకెళ్తున్నారని తానా నూతన వైస్ ప్రెసిడెంట్ నరేన్ కొడాలి అన్నారు. కొత్త ప్రమాణాలతో తన కార్యాచరణ ఇక ముందు సాగుతుందని తెలిపారు. అనంతరం భాను మాగులూరి మాట్లాడుతూ.. మాతృభాష, మాతృభూమిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. అందుకోసం ప్రవాసాంధ్రులంతా తమవంతు పాత్రను, కర్తవ్యాన్ని నిర్వహించాలన్నారు. శక్తి మేరకు విద్యా రంగంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు చేయూతనందించాలని, తెలుగు వారందరూ ప్రపంచ వేదికపై తమ మేధో శక్తితో సత్తా చాటుతూ, వివిధ రంగాల్లో నూతన ఒరవడి సృష్టిస్తూ, ప్రగతి బాటలో దూసుకెళ్ళడం అందరికీ గర్వకారణమన్నారు. మైనేని రాంప్రసాద్ మాట్లాడుతూ.. ‘రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. అమరావతి రాజధానిని అభివృద్ధి చేసి ఉంటే దేశంలోనే ముందు వరుసలో ఉండేది’ అన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముపాళ్ల నాగేశ్వరరావు, మన్నవ సుబ్బారావు, నరేన్ కొడాలిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుధీర్ కొమ్మి, రామ్ చౌదరి ఉప్పుటూరి, కిషోర్ కంచర్ల, ఆకాశ్ వలేటి, రవి ఐతా, యండమూరి నాగేశ్వరరావు, పాకాలపాటి కృష్ణయ్య, బండ మల్లారెడ్డి, రమేష్ అవిరినేని, సీతారామారావు, ప్రసాద్ పారుపల్లితో పాటు పలువురు ప్రవాసాంధ్రులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా COTA ఉగాది ఉత్సవాలు..
COTA ఆధ్వర్యంలో యూకేలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది.
తాజా వార్తలు (Latest News)
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్