అర్హులకు ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యం..: ప్రొఫెసర్ లింబాద్రి
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, తెలంగాణ ఉన్నతవిద్య సెక్రటరీ కరుణకు ప్రవాస తెలంగాణ వాసులు విందు ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, తెలంగాణ ఉన్నత విద్య కార్యదర్శి వాకాటి కరుణకు ప్రవాస తెలంగాణ వాసులు తేనీటి విందు ఇచ్చారు. బ్రిటన్ తెలంగాణ వాసుల ప్రత్యేక ఆహ్వానం మేరకు వీరిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నత విద్యలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతోన్న సవాళ్లు, ఈ విభాగంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ‘‘ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014లోని నిబంధనల ప్రకారం 1988 ఏపీ ఉన్నత విద్యా మండలి(APSCHE) స్వీకరణ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఏర్పాటయ్యింది. ఉన్నత విద్యా సంస్థలను నియంత్రించడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థల సంఖ్యను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉన్నత విద్యకు పెరుగుతోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని అనేక కొత్త కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వృత్తిపరమైన సంస్థల్ని నెలకొల్పారు’’ అని లింబాద్రి వివరించారు.
‘‘డిగ్రీ కళాశాలల్లో డేటా సైన్సెస్లో మూడేళ్ల బీఎస్సీ, బిజినెస్ అనలిటిక్స్లో బీకామ్ లాంటి కొత్త కోర్సులను ప్రారంభించి గ్రామీణ యువతకు ఉద్యోగ కల్పనలో దోహదపడుతుంది. విద్యార్థుల ఉపాధిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది. విద్యార్థుల్లో పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించడం, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన రిటైల్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్, ఇ-కామర్స్కు సంబంధించిన కోర్సులను రూపకల్పన చేస్తున్నాం.చదువుతున్న సమయంలోనే విద్యార్థులకు స్టైఫండ్ అందేలా రుపకల్పన చేస్తున్నాం. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం వివిధ స్కాలర్షిప్లు, ఆర్థిక సహాయ పథకాలను అందిస్తోంది. అర్హులైన విద్యార్థులకు ఉన్నత విద్యను పొందేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’అని లింబాద్రి తెలిపారు.
‘‘విద్యా ప్రమాణాలను నిర్వహించడం, ఎప్పటికప్పుడు వాటిని మెరుగుపరిచేందుకు అక్రిడిటేషన్, మూల్యాంకన పద్ధతుల్ని వినియోగిస్తున్నాం. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తాజా పరిశీలన ప్రకారం.. తెలంగాణలోని ఆరు రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా నమోదైంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజినీరింగ్, మెడిసిన్ మినహా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరిన మహిళల సంఖ్య పురుషులతో పోలిస్తే 14,000 పైగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న స్కాలర్షిప్లు, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ వంటి సౌకర్యాలు... ఉన్నత విద్యను అభ్యసించే మహిళల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం. ఉన్నత విద్యలో ఏడేళ్ల క్రితం ఎక్కువగా ఉన్న లింగ వ్యత్యాసాన్ని తగ్గించగలిగాం’’ అని వెల్లడించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యా వ్యవస్థలో రాష్ట్రాల సూచనలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(NEP) తీసుకురావడంతో దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఓ ప్రశ్నకు బదులుగా లింబాద్రి చెప్పారు. ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం నడుస్తున్న తీరు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి గురించి విద్యాశాఖ కార్యదర్శి కరుణ వివరించారు. సీఎం కేసీఆర్ నిర్దిష్ట ప్రణాళిక , లోతైన పరిజ్ఞానం వల్ల కార్యక్రమాల రూపకల్పన జరుగుతోందన్నారు. తెలంగాణలో ఉన్న 27,000 పాఠశాల్లో తొలిదశలో 7,000 స్కూళ్లను అన్ని రకాల మౌలిక సదుపాయాలతో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్న విధానాన్ని వివరించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ లింబాద్రి, కరుణను బావర్చి రెస్టారెంట్ యజమానులు కిశోరె మున్నాగాల , తెలంగాణ జాగృతి యూరప్ అధ్యక్షులు దన్నంనేని సంపత్ కృష్ణ , ఉస్మానియా పూర్వవిద్యార్థులు (యూకే- యూరప్) ఫౌండర్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ ప్రెసిడెంట్ శ్రవణ్ గౌడ్ , పింగళి శ్రీనివాస్ రెడ్డి , ప్రముఖ న్యాయవాది కమల్ ఓరుగంటి, సురేష్ గోపతి తదితరులు ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విజ్ఞాన వికాసంపై తానా ప్రపంచ సాహిత్యవేదిక సదస్సు
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై సదస్సు విజ్ఞానదాయకంగా జరిగింది. -
ఘనంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్సైట్ ఆవిష్కరణ
ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ తన వెబ్సైట్ను www.qef.org ఆవిష్కరించింది. నాణ్యమైన సాంకేతిక ప్రయాణంలో దీన్నొక మైలురాయిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు పేర్కొన్నారు. -
ఏపీని ఆదుకునే ఎన్నారైలపై ఇంత అక్కసా?: జయరాం కోమటి
రాష్ట్రానికి మేలు చేసేలా కృషిచేస్తున్న ఎన్నారైలపై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడటం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. -
ఎన్ఆర్ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు
ఎన్ఆర్ఐ తెదేపా కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తెదేపా 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
డార్ట్ఫోర్డ్లో ఉల్లాసంగా హోలీ వేడుకలు
బ్రిటన్లోని డార్ట్ఫోర్డ్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. కెంట్లోనే అతిపెద్ద ఈవెంట్గా చేపట్టిన ఈ వేడుకలకు 3వేల మందికి పైగా హాజరయ్యారు. -
డాలస్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డాలస్ నగరంలో ఘనంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లకు అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో