Boise: బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు

అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

Published : 25 Apr 2024 23:51 IST

బోఇసీ: అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ‘బోఇసీ తెలుగు అసోసియేషన్‌’ (BTA) ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 20న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘బోఇసీ తెలుగు అసోసియేషన్‌’ ఏర్పాటు ఉద్దేశాన్ని సంఘం వ్యవస్థాపకులు హరి విన్నమాల, అధ్యక్షుడు అనిల్‌ కుకుట్ల వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు, గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు, మన పిల్లలతో పంచుకోవడమే బోఇసీ తెలుగు అసోసియేషన్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. 

గత ఏడాది నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన 16 పెద్ద ఈవెంట్స్‌  విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేసిన బీటీఏ ఉపాధ్యక్షురాలు సింధు మెట్పల్లి, కార్యదర్శి శివ నాగిరెడ్డి ఉయ్యూరు,  కోశాధికారి రామ్ యాగంటి, మీడియా కార్యదర్శి భార్గవి రాజన్, సాంస్కృతిక నిర్వాహకులు మైత్రి కర్నటీ, ఈవెంట్ నిర్వాహకులు శశాంక్ వేమూరి, హరీష్ వీరవల్లికి ధన్యవాదాలు తెలిపారు. ‘క్రోధి’ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల విజయవంతానికి కృషి చేసిన వారికి హరి విన్నమాల, సింహాచలం మెమెంటోలు అందజేశారు. 

ఈ సందర్భంగా ‘బోఇసీ తెలుగు అసోసియేషన్‌’ నూతన కార్యవర్గ పరిచయం కార్యక్రమం నిర్వహించారు. బీటీఏ నూతన అధ్యక్షురాలు సింధు మెట్పల్లి, ఉపాధ్యక్షులు శివ నాగిరెడ్డి ఉయ్యూరు, క్రియేటివ్ హెడ్ మైత్రి కర్నటీ, కార్యదర్శులు ధీరజ్ కనకనాల, ఆది మెడ్చెర్ల, కోశాధికారి ఫణి తేజ, సాంస్కృతిక నిర్వాహకులు అనంత్ నిభానుపూడిని సభికులకు పరిచయం చేశారు. వేడుకల్లో సుమారు 400 మంది తెలుగువారు పాల్గొన్నారు. పిల్లలు, పెద్దలు తెలుగు పాటలు, నృత్యాలతో సభికులను అలరించారు. అనంతరం తెలుగు వంటకాలతో ఏర్పాటు చేసిన విందు నోరూరించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని