న్యూజెర్సీలో ఆనందోత్సాహాలతో ‘తెలుగు కళా సమితి’ ఉగాది వేడుకలు
న్యూజెర్సీ తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఏప్రిల్ 22న స్థానిక సేరెవిల్లే వార్ మెమోరియల్ హై స్కూల్లో ఆనందోత్సాహాల మధ్య పండుగ
అమెరికా: న్యూజెర్సీ తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఏప్రిల్ 22న స్థానిక సేరెవిల్లే వార్ మెమోరియల్ హై స్కూల్లో ఆనందోత్సాహాల మధ్య కొనసాగిన ఈ వేడుకల్లో దాదాపు 1200 మంది తెలుగు ప్రజలు పాల్గొని సందడి చేశారు. తెలుగు కళా సమితి కార్యవర్గం జ్యోతి ప్రజ్వలన, ప్రార్థనా గీతాలాపనతో మధ్యాహ్నం 3.30గంటలకు మొదలైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆటపాటలతో ఉత్సాహంగా సాగింది. స్వప్నా మాదిరాజు, మధు దౌలపల్లి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ తెలుగు కళాసమితి అధ్యక్షుడు మధు రాచకుళ్ల ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా తొలిసారిగా మహిళా సదస్సు, అంతర్జాతీయ రోబోటిక్స్ ప్రదర్శన, పబ్లిక్ స్పీకింగ్ వంటి కార్యక్రమాలను నిర్వహించి తెలుగు కళాసమితిని మరింత బలోపేతం చేసినట్టు తెలిపారు. ఉగాది సంబరాల్లో దాదాపు 250 మంది చిన్నారులు, పెద్దలు సంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు.
మహిళలతో సదస్సుతో పాటు భజనలు, భక్తి నాటకాలు, పలు సినిమాల్లోని సన్నివేశాలను ప్రదర్శిస్తూ అదరగొట్టారు. అంతర్జాతీయ రోబోటిక్స్తో పాటు దాదాపు 25మంది చిన్నారులతో భగవద్గీత అంత్యాక్షరి కార్యక్రమం, పబ్లిక్ స్పీకింగ్ ఆకట్టుకున్నాయి. సందీప్ కూరపాటి, అఖిల మామండూర్, మధు దౌలపల్లి, శ్రీకర్ దర్భా, లావణ్య అందె, శ్రీజ బొడ్డు బృందం పలు సినీ గీతాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా తెలుగు కళా సమితి ఉపాధ్యక్షురాలు బిందు యలమంచిలి మహిళా సదస్సు, ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణతో పాటు అతిథులందరికీ ఉగాది పచ్చడిని స్వయంగా తయారు చేసి అందజేశారు. కార్యదర్శి రవి కృష్ణ అన్నదానం నిర్వహించి భోజన ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించారు. కోశాధికారి శ్రీనివాస్ చెరువు ఈ ఉగాది కార్యక్రమానికి సంబంధించిన టికెట్ల విక్రయం, రిజిస్ట్రేషన్ డెస్క్ నిర్వహణను సమర్థంగా నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల బాధ్యతలను స్వీకరించిన యువజన కార్యదర్శి సుధా దేవులపల్లి సంబరాల సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పన చేసి, సమర్థవంతంగా నిర్వహించారు. వెండర్స్ నిర్వహణ, అంతర్జాతీయ రోబోటిక్స్ ప్రదర్శనను కమ్యూనిటీ కార్యదర్శి వెంకట సత్య తాతా నిర్వహించారు. కొత్తగా కార్యవర్గంలో చేరిన అనిల్ వీరిశెట్టి వాలంటీర్ల విషయాలను పర్యవేక్షించారు. మెంబర్ షిప్ కార్యదర్శి జ్యోతి కామరసు యువతను సమన్వయం చేయడంతో పాటు వారికి వక్తృత్వ పోటీల నిర్వహణ బాధ్యతలను చూశారు. ఐటీ కార్యదర్శి నాగ మహేందర్ వెలిశాల మీడియా, ఈ మెయిల్ ప్రచారం, అతిథులందరికీ భోజన ఏర్పాట్ల బాధ్యతలను పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తానా ప్రతినిధులు రవి పొట్లూరి, రాజా కసుకుర్తి, విద్యా గారపాటి, శ్రీనివాస్ ఓరుగంటి, శివాని తన్నీరు తదితరుల హాజరయ్యారు. వీరితో పాటు నాట్స్ ప్రతినిధులు అరుణ గంటి, రాజ్ అల్లాడ, శ్యామ్ నాళం, టీటీఏ నుంచి మధుకర్ రెడ్డి దేవరపల్లి, సాయి గూడూరు, శ్రీనివాస్ గూడూరు ,స్వాతి & అట్లూరి దంపతులు (కళా వేదిక), ఆత్మీయ సంస్థ నుంచి ఓం ప్రకాష్ నక్కా, ఈ మధ్యనే కొత్తగా ఆవిర్భవించిన మాటా ప్రతినిధులు శ్రీనివాస్ గనగోని, కిరణ్ దుడ్డాగి, విజయ భాస్కర్ కల్లాల్, శ్రీధర్ చిల్లర, ఉషా చింతా (NATA), సుబ్బారావు సన్నిధి (వాసవి), తదితరులు వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఉగాది వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి ఆర్థిక సహకారంతో పాటు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేసిన అందరికీ తెలుగు కళాసమితి కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబును కలిసిన తానా బృందం
ఏపీ సీఎం చంద్రబాబును తానా ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
తెదేపా నేత గౌరు వెంకటరెడ్డిని సత్కరించిన ప్రవాసాంధ్రులు
అమెరికా పర్యటనలో ఉన్న తెదేపా సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డిని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. -
తిరుమల కృష్ణ దేశికాచారికి గండపెండేర సత్కారం
ప్రముఖ కవి, రచయిత, మొట్టమొదటి తెలుగు ఫాంట్ వేమనను అందించిన టొరంటో వాస్తవ్యులు తిరుమల కృష్ణ దేశికాచారికి తెలుగువాహిని సంస్థ గండ పెండేరంతో సత్కరించింది. -
స్వర్ణోత్సవ వేడుకలకు రండి.. స్పీకర్, ఏపీ మంత్రులకు కృష్ణ లాం ఆహ్వానం
జీడబ్ల్యుటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను సెప్టెంబర్ 27, 28 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. -
ఖతర్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఖతర్లో పెద్దఎత్తున నిర్వహించారు. -
సింగపూర్లో వైభవంగా బోనాల పండుగ
సింగపూర్లో బోనాల జాతర ఘనంగా జరిగింది. -
అమెరికాలోని విద్యార్థులకు తెలుగు నేర్పడానికి ‘తానా-పాఠశాల’
అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాషను నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘తానా-పాఠశాల’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భానుప్రకాశ్ మాగులూరి తెలిపారు. -
ఏపీ అమెరికన్ అసోసియేషన్(AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభమైంది. -
నెదర్లాండ్స్లో ఎన్డీయే కూటమి విజయోత్సవాలు
నెదర్లాండ్స్లో ప్రవాసాంధ్రులు ఏపీలో ఎన్డీయే కూటమి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై కోమటి జయరాం సంతాపం
అమెరికాలోని బే ఏరియాలో నివాసముంటున్న ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై తెదేపా ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం, పలువురు ఎన్ఆర్ఐలు సంతాపం వ్యక్తం చేశారు. -
బ్రిస్బేన్లో తెదేపా విజయోత్సవ సంబరాలు!
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో క్వీన్స్ ల్యాండ్ తెదేపా ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. -
అమెరికాలో నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్
USA: అమెరికాలో నకిలీ కంపెనీలు సృష్టించి బలవంతంగా కొంతమందితో పని చేయించుకుంటున్న తెలుగువారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘సింగపూర్ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..