Akhilesh Yadav: కాంగ్రెస్ కులగణన హామీపై అఖిలేశ్ విమర్శలు
Akhilesh Yadav on congress party: కాంగ్రెస్ పార్టీపై అఖిలేశ్ యాదవ్ మరోసారి విమర్శలు గుప్పించారు. కులగణన హామీ తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పారు.
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి సీట్ల కేటాయించకపోవడం పట్ల అసంతృప్తిగా ఉన్న సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav).. కాంగ్రెస్ పార్టీపై (Congress) మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ దేశవ్యాప్త కులగణన హామీ పట్ల తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరి ఆశ్చర్యానికి గురి చేసిందని, గత్యంతరం లేకనే ఆ పార్టీ కులగణన హామీ ఇచ్చిందని దుయ్యబట్టారు.
‘‘కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త కులగణన హామీ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. వెనుకబడిన వర్గాల ఓట్లు లేకుండా ఎన్నికల్లో గెలవలేమన్న సత్యం ఆ పార్టీకి బోధపడింది. వారు అన్వేషిస్తున్న ఓటర్లు.. తమ వెంట లేరని ఆ పార్టీకి అర్థమైంది. కానీ ఇదే పార్టీ గతంలో కులగణనకు సంబంధించిన గణాంకాలను బయటపెట్టలేదు’’ అంటూ అఖిలేశ్ దుయ్యబట్టారు. గతంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన గణాంకాలను బయటపెట్టకపోవడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనను కమల్నాథ్ ‘వకిలేశ్’ అని సంబోధించడంపై మట్లాడుతూ.. ‘‘వకిలేశ్ అనే వ్యక్తి లేడు. అఖిలేశ్ మాత్రమే ఉన్నాడు. నేనూ అలాంటి సమాధానం ఇవ్వగలను కానీ ఇవ్వాలనుకోవడం లేదు. ఆయన పేరులో కమల్ (భాజపా గుర్తునుద్దేశించి) ఉంది కాబట్టి ఆయన్ను ఇంకోలా పిలవం కదా’’ అని అఖిలేశ్ అన్నారు.
‘దుబాయ్ నుంచి మహువా ఐడీని వాడారు..’: దూబే మరో సంచలన ఆరోపణ
త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ కేటాయించకపోవడంపై అఖిలేశ్ మండిపడుతున్నారు. దీంతో కాంగ్రెస్పై విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. ఇండియా కూటమి అనేది కేవలం లోక్సభ ఎన్నికల్లో భాజపాను ఓడించడం కోసమేనని కాంగ్రెస్ పేర్కొనడంపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ఇదే రకమైన అయోమయాన్ని కొనసాగిస్తే మాత్రం వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి భాజపాను ఓడించలేదన్నారు. మధ్యప్రదేశ్లో తమకు సీట్లు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేకపోతే ముందే ఆ విషయం చెప్పి ఉండాల్సిందన్నారు. తమకు సొంత బలం ఉన్న సీట్లలో పోటీ చేయనున్నట్టు స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు