Bandi sanjay: మునుగోడు ప్రజలకిచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలి: బండి
మునుగోడు ప్రజలకు ఉపఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు 15 రోజల్లో నెరవేర్చాల్సిందేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. మునుగోడులో ఓటమిపై సమీక్ష చేసుకుని.. అధికారమే లక్ష్యంగా అభివృద్ధికోసం పనిచేస్తామన్నారు.
హైదరాబాద్: మునుగోడు ప్రజలకు ఉపఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాల్సిందేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.‘‘మునుగోడులో ఎన్ని రకాలుగా బెదిరించినా వీరోచితంగా పోరాడిన భాజపా కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మునుగోడులో భాజపా అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి 86,480 ఓట్లు (40శాతం) వచ్చాయి. ప్రజా తీర్పును శిరసా వహిస్తున్నాం. తెరాస పార్టీ నాయకులు ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత ఎంత విర్రవీగుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. గెలిచిన తర్వాత 15 రోజుల్లో హామీలు నెరవేరుస్తామన్నారు. ఎన్నికల హామీలు సీఎం కేసీఆర్ నెరవేర్చాల్సిందే. కానీ, ఆ విషయం చెప్పకుండా అహంకారంతో మాట్లాడుతున్నారు. ఒక ఉప ఎన్నికలో గెలవగానే ఎగిరెగిరి పడుతున్నారు. ఇతర పార్టీల నేతలు భాజపాలో చేరితే, పదవులకు రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరుతున్నాం. దేశవ్యాప్తంగా ఇదే పద్ధతి అవలంభిస్తున్నాం.
ఆ 12మందితో రాజీనామా చేయించే దమ్ముందా?
ఇతర పార్టీల నుంచి గెలిచిన 12 మందిని తెరాసలో చేర్చుకున్నారు. వారితో రాజీనామా చేయించి ప్రజా తీర్పుకోరే దమ్ముందా? మునుగోడు గెలుపు కేసీఆర్దా? కేటీఆర్దా? హరీశ్రావుదా? సీపీఐదా, సీపీఎందా? కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిదా? ఎవరిదో చెప్పాలి. ఒక్క రాజగోపాల్రెడ్డిని ఎదుర్కోవడానికి 16 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పనిచేస్తే వచ్చింది 11వేల మెజార్టీ. ఒక్కో పోలింగ్ బూత్కు తెరాస ఎమ్మెల్యే పనిచేస్తే.. భాజపా తరఫున కార్యకర్త పనిచేశారు. ఒక్కో తెరాస ఎమ్మెల్యే.. భాజపా కార్యకర్తతో సమానం. ఉప ఎన్నిక వస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. మునుగోడు ఓటమితో భాజపా కార్యకర్తలు నిరుత్సాహపడొద్దు. ఓటమిపై సమీక్ష చేసుకుంటాం. అధికారమే లక్ష్యంగా అభివృద్ధి కోసం పనిచేస్తాం. మునుగోడు ఓటర్లకు ధన్యవాదాలు. మునుగోడు గెలుపు.. కొందరు పోలీసు అధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ది. ఎక్కడా కూడా తెరాస డబ్బులు పట్టుబడకుండా.. పోలీసు వాహనాలు, అంబులెన్స్లు, ఎమ్మెల్యేల కాన్వాయ్ల ద్వారా డబ్బు తరలించారు. ఉప ఎన్నిక కోసం తెరాస రూ.వెయ్యి కోట్లు పంచింది’’ అని బండి సంజయ్ ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు