కశ్మీర్లో కొనసాగుతున్న జోడో యాత్ర
పంజాబ్ నుంచి జమ్మూకశ్మీర్లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర వడివడిగా సాగుతోంది. శుక్రవారం ఉదయం చిరుజల్లులు పడుతున్నప్పటికీ కథువా జిల్లా హట్లీ మోడ్ నుంచి రాహుల్ యాత్ర ప్రారంభించారు.
పాల్గొన్న సంజయ్ రౌత్
తొలిసారి రెయిన్కోట్ ధరించిన రాహుల్
కథువా: పంజాబ్ నుంచి జమ్మూకశ్మీర్లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర వడివడిగా సాగుతోంది. శుక్రవారం ఉదయం చిరుజల్లులు పడుతున్నప్పటికీ కథువా జిల్లా హట్లీ మోడ్ నుంచి రాహుల్ యాత్ర ప్రారంభించారు. శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్, పరమ్వీర్చక్ర అవార్డు గ్రహీత విశ్రాంత కెప్టెన్ బానా సింగ్లతో పాటు కాంగ్రెస్ నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు రాహుల్తో కలిసి నడిచారు. ఇప్పటి వరకూ తెల్ల టీషర్టుతోనే పర్యటించిన రాహుల్ శుక్రవారం తొలిసారి రెయిన్కోటు ధరించారు. పలుచోట్ల వర్షం కురుస్తున్నప్పటికీ ఆయన ముందుకు సాగారు. ఓ చోట కొంతమంది భాజపా, పప్పు అని ప్లకార్డులు పట్టుకుని నిలబడగా.. వారిని చూసి రాహుల్ నవ్వుకుంటూ అభివాదం చేశారు. ఇదే సమయంలో మోదీకి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడానికి సిద్ధమైన ఓ కార్యకర్తను వలంటీర్లు నిలువరించారు. దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, అసలైన సమస్యలపై గొంతెత్తున్న నాయకుడిగా రాహుల్ను చూస్తున్నట్లు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
రాహుల్ పాదయాత్రకు సీఆర్పీఎఫ్, పోలీసు సిబ్బందితో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. జోడోయాత్రకు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశామని విలేకర్లతో మాట్లాడుతూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పష్టంచేశారు. ఆ విషయంలో ఎలాంటి సమస్యా రాదని తెలిపారు. యాత్రను కశ్మీర్ మారుమూల ప్రాంతాల మీదుగా తీసుకెళ్లాలని స్థానిక నాయకత్వం భావిస్తోంది. ఈ విజ్ఞప్తికి ఇప్పటి వరకూ అనుమతి రాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. ఇది సాధ్యం కాకపోతే జాతీయ రహదారిపైనే యాత్ర వెళ్లేలా మరో ప్రణాళిక రూపొందించామన్నారు. అధికారులు దేనికి అనుమతిస్తే దానిని అనుసరిస్తామని స్పష్టం చేశారు. భద్రతా కారణాల రీత్యా రూట్మ్యాప్ను ప్రకటించబోమని వెల్లడించారు. చడ్వాల్లో నిలిచిన యాత్ర తిరిగి ఆదివారం ఉదయం హీరానగర్ నుంచి ప్రారంభంకానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం