సర్కార్పై విపక్షాల అభాండాలు
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి యుద్ధప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటూ నిరుద్యోగుల్లో భరోసా కల్పించేందుకు యత్నిస్తుండగా... విపక్ష పార్టీలు అభాండాలు వేస్తూ, చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నాయని మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు.
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం
సిట్ పేరు చెబితేనే సంజయ్కు వణుకు: జగదీశ్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి యుద్ధప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటూ నిరుద్యోగుల్లో భరోసా కల్పించేందుకు యత్నిస్తుండగా... విపక్ష పార్టీలు అభాండాలు వేస్తూ, చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నాయని మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. భాజపా నేతలు పదవుల కోసం దొంగ దీక్షలు చేస్తున్నారని, వారు ఎన్ని ఎత్తులు వేసినా శాశ్వత నిరుద్యోగులుగా మిగిలిపోవడడం ఖాయమన్నారు. భారాస శాసనసభాపక్ష కార్యాలయంలో శనివారం ఆయన ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. భాజపాకు ఉద్యోగాలు, ఉద్యోగులపై మాట్లాడే నైతికహక్కు లేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ప్రధానిగా పీఠమెక్కిన మోదీ ఈ దేశ యువతను దారుణంగా మోసం చేశారన్నారు. భాజపా నేతలు తమ రాజకీయ క్రీడలో నిరుద్యోగులను బలిపీఠమెక్కించాలని కుట్ర చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. సంజయ్కు దమ్ముంటే తొలుత దేశంలో ఉద్యోగాలు భర్తీ చేయాలని దిల్లీకి వెళ్లి ధర్నాలు చేయాలని సూచించారు. కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి ఆయనకు లేదన్నారు. సంజయ్ వద్ద ఆధారాలు లేనందునే సిట్ అంటే వణికిపోతూ విచారణను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. ఒకసారి సిట్ నోటీసులు ఇస్తే సంజయ్ తప్పించుకున్నారని, శనివారం మళ్లీ నోటీసులు ఇవ్వగా... హాజరు కావడానికి వెనుకాడుతున్నారన్నారు. సున్నిత అంశాన్ని రాజకీయం చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో విపక్ష పార్టీలు చెలగాటమాడుతుంటే ఎవ్వరూ సహించబోరని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ సుప్తచేతనావస్థకు చేరిందని, రాహుల్ గాంధీని లోక్సభ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించినా ఆ పార్టీ నాయకులు సరైన రీతితో స్పందించకపోవడం దాని దుస్థితిని చాటుతోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు