Somu Veerraju: సీఎం జగన్ ఓ డబ్బింగ్ ఆర్టిస్టు: సోము వీర్రాజు
కేంద్ర నిధులతో అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర పథకాలుగా చెబుతున్న సీఎం జగన్మోహన్రెడ్డి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు
చిత్తూరు (సంతపేట), న్యూస్టుడే: కేంద్ర నిధులతో అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర పథకాలుగా చెబుతున్న సీఎం జగన్మోహన్రెడ్డి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. ప్రధానిగా మోదీ పరిపాలన తొమ్మిదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చిత్తూరులో భాజపా ఆధ్వర్యంలో సోమవారం బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ... కేంద్రం నిధులిస్తున్నా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అమరావతిని రాజధానిగా గుర్తించి, అనేక ప్రాజెక్టుల్ని మంజూరు చేసి కేంద్రం తన చిత్తశుద్ధి చాటుకుందన్నారు. నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం అప్పులు, అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. భాజపా, తెదేపా పొత్తుపై విలేకరులు ప్రశ్నించగా.. ‘ఆ విషయమూ నేనే చెప్పాలా.. వెళ్లి చంద్రబాబునే అడగండి’ అని సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ అంటే బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు