Somu Veerraju: సీఎం జగన్‌ ఓ డబ్బింగ్‌ ఆర్టిస్టు: సోము వీర్రాజు

కేంద్ర నిధులతో అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర పథకాలుగా చెబుతున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఒక డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.

Updated : 27 Jun 2023 08:36 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు

చిత్తూరు (సంతపేట), న్యూస్‌టుడే: కేంద్ర నిధులతో అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర పథకాలుగా చెబుతున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఒక డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. ప్రధానిగా మోదీ పరిపాలన తొమ్మిదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చిత్తూరులో భాజపా ఆధ్వర్యంలో సోమవారం బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  సోము వీర్రాజు మాట్లాడుతూ... కేంద్రం నిధులిస్తున్నా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అమరావతిని రాజధానిగా గుర్తించి, అనేక ప్రాజెక్టుల్ని మంజూరు చేసి కేంద్రం తన చిత్తశుద్ధి చాటుకుందన్నారు. నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం అప్పులు, అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. భాజపా, తెదేపా పొత్తుపై విలేకరులు ప్రశ్నించగా.. ‘ఆ విషయమూ నేనే చెప్పాలా.. వెళ్లి చంద్రబాబునే అడగండి’ అని సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని