ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు.
సీపీఎస్ ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశాల ఉద్యమాన్ని అణచివేశారు
జగన్ పాలనలో పీఆర్సీ, హెచ్ఆర్ఏ సైతం రివర్సే
‘ఈనాడు’తో అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు
ఈనాడు, అమరావతి: జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) రద్దు చేసి, పాత పెన్షన్ అమలు చేయాలని, జీతాలు పెంచాలని అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, సమగ్రశిక్ష అభియాన్ ఉద్యోగుల ఉద్యమాలను దౌర్జన్యంగా అణచి వేశారని, కొంతమంది ఉద్యోగులపై నేరస్తుల మాదిరిగా బైండోవర్ కేసులు పెట్టారని వెల్లడించారు. ఒక పక్క అణచివేతలు, కేసులతో భయపెడుతూ.. మరోపక్క బకాయిలు చెల్లించకుండా ఉద్యోగులు, పెన్షనర్లను హింసించారని పేర్కొన్నారు. ఎన్నికలు రావడంతో ఓట్ల కోసం ఏప్రిల్ నెల జీతం, పెన్షన్లు ఒకటో తేదీనే వేశారని, ఉద్యోగులను మభ్యపెట్టేందుకు ఇది కొత్త ఎత్తుగడ అని విమర్శించారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు.
జీతాలు, పెన్షన్లలోనూ రివర్సే..
‘జగన్ పాలనలో ప్రతినెలా ఒకటో తేదీన జీతం, పెన్షన్ రాక ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. 15వ తేదీ వరకు ఎదురుచూస్తూ జీతాలు, పెన్షన్లు వస్తే చాలు అనే దుస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. న్యాయబద్ధంగా రావాల్సిన వాటి కోసమే ఎదురుచూడాల్సిన పరిస్థితిని కల్పించింది. భారత దేశ చరిత్రలో మొదటిసారి మధ్యంతర భృతి(ఐఆర్) కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చారు. ఐఆర్ 27% ఇస్తే.. ఫిట్మెంట్ 23% ఇచ్చారు. దీంతో ఉద్యోగుల జీతాలు తగ్గాయి. ఇక్కడా రివర్స్ పాటించారు.
- 2021 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబరు వరకు 21 నెలలు పీఆర్సీ బకాయిలు చెల్లించలేదు. 2018 జులై నుంచి 2024 మార్చి 31 వరకు రావాల్సిన డీఏ బకాయిలు ఇవ్వలేదు. ఒక్కో ఉద్యోగికి 192 నెలల బకాయిలు రావాలి. రాష్ట్రంలో 10వేల బేసిక్ పెన్షన్ ఉన్న వారికి రూ.70వేలు, బేసిక్ 20వేలు ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లకు రూ. 1.40 లక్షల చొప్పున బకాయిలు ఉన్నాయి.
- పీఆర్సీలో 70ఏళ్లకు ఇచ్చే అదనపు పెన్షన్ తెదేపా హయాంలో 10 శాతం ఉంటే దీన్ని 7శాతానికి తగ్గించారు. 75-80 ఏళ్ల మధ్య 15 శాతం ఉండే అదనపు పెన్షన్ను 12శాతానికి తగ్గించారు. 2022 జనవరి నుంచి 27 నెలల్లో 81% పెన్షన్ను విశ్రాంత ఉద్యోగులు నష్టపోయారు. ఇది రివర్స్ పెన్షన్ కాకపోతే మరేమిటి?
- హెచ్ఆర్ఏ తగ్గించేశారు. సచివాలయ ఉద్యోగులకు 30% ఉండే హెచ్ఆర్ఏను 24 శాతానికి, జిల్లా కేంద్రాల్లో 20% నుంచి 16 శాతానికి తగ్గించారు.
మెడికల్ బిల్లులు ఇవ్వలేదు..
మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు నాలుగున్నరేళ్లపాటు చెల్లించలేదు. ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో సరైన వైద్య సేవలు అందని దుస్థితి ఏర్పడింది. డబ్బులు పెట్టి చికిత్సలు పొందితే ఆ బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఉన్నా ఉపయోగం లేకుండాపోయింది.
- జిల్లాపరిషత్తు పరిధిలోని ఉపాధ్యాయులు కొందరు కొవిడ్తో చనిపోతే వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు అమలు చేయలేదు.
- పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు మూడేళ్లుగా ఆర్జిత సెలవుల డబ్బులు ఇవ్వడం లేదు.
పీఆర్సీ నివేదికనే దాచేశారు..
పీఆర్సీ కమిషన్ ఇచ్చిన నివేదికనే ఈ ప్రభుత్వం బయటపెట్టలేదు. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ వేసి, నివేదిక ఇచ్చారు. దాని ప్రకారమే పీఆర్సీ అమలు చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు పీఆర్సీ నివేదిక కోసం సచివాలయంలో ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
- 12వ పీఆర్సీ కమిషన్ వేశారు. ఈ కమిషన్ ఇంతవరకు పని ప్రారంభించలేదు. పీఆర్సీ అమలు ఆలస్యమవుతున్నా ఐఆర్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈ కమిషన్ నివేదిక ఎప్పటికి ఇస్తుందో తెలియని దుస్థితి.
- ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తామనే అంశాన్ని వైకాపా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎక్కడా పెట్టలేదు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఉద్యోగులు, పెన్షనర్లకు మళ్లీ అవే కష్టాలు వస్తాయి.
- పెన్షనర్ల కోసం జిల్లాకో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వైకాపా మ్యానిఫెస్టోలో చెప్పారే తప్ప ఎక్కడా క్షేత్రస్థాయిలో వీటిని ఏర్పాటు చేయలేదు. చివరికి మ్యానిఫెస్టోలోనూ అబద్ధాలు చెప్పారు.
గ్యారంటీ లేని పెన్షన్..
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేయకపోగా.. కొత్తగా గ్యారంటీ పెన్షన్ పథకం(జీపీఎస్) తెచ్చారు. ఈ చట్టంలోని క్లాజ్-6(5)లో షేర్ మార్కెట్లో వచ్చిన ఒడిదొడుకులపై పెన్షన్ ఇస్తామనే నిబంధన పెట్టారు. ఇది సీపీఎస్ కంటే అన్యాయమైంది. సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించే వాటాను 14%కు పెంచాలని చెప్పినా దీన్ని అమలు చేయడం లేదు. కేవలం 10%మాత్రమే ఇస్తోంది. 4% మిగిల్చుకుంటూ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
-
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ