మాదిగలకు కాంగ్రెస్‌ రెండు పార్లమెంట్‌ సీట్లు కేటాయించాలి

పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మాదిగలకు రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్‌లో అమీర్‌పేట లీలానగర్‌లోని తన నివాసంలో గురువారం నిరసన దీక్ష చేపట్టారు.

Published : 19 Apr 2024 04:39 IST

మోత్కుపల్లి నిరసన దీక్ష

అమీర్‌పేట, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మాదిగలకు రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్‌లో అమీర్‌పేట లీలానగర్‌లోని తన నివాసంలో గురువారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. 80 లక్షల మంది ఉన్న మాదిగలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రస్తుత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ మాదిగలను భూస్థాపితం చేయాలని చూస్తున్నట్లుందని ఆరోపించారు. ఈ విషయమై సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తే అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టికెట్‌ రాకుండా కుట్ర జరిగిందని ఆరోపించారు.   మోత్కుపల్లి నిరసన దీక్ష గురించి తెలుసుకున్న వివిధ జిల్లాలకు చెందిన దళిత సంఘాల నేతలు హాజరై సంఘీభావం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని