T20 WC 2024: కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది.
ఈనాడు క్రీడావిభాగం
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. ఇక టీ20 కప్పులో కోహ్లి, రోహిత్ను చూడటం కష్టమేనని అనుకున్నారంతా! హార్దిక్ పాండ్య సారథ్యంలో భారత్ బరిలో దిగడం లాంఛనమేనన్న అంచనాకు వచ్చారంతా! రెండేళ్లు తిరక్కుండానే అంతా తలకిందులైంది. అప్పుడు వద్దనుకున్న కోహ్లి, రోహిత్ ఇప్పుడు తప్పనిసరిగా మారిపోయారు. ఏడాది కాలంగా భారత టీ20 బృందానికి కెప్టెన్గా కొనసాగిన పాండ్య చివరికి జట్టులో చోటే కష్టమన్న పరిస్థితి నుంచి త్రుటిలో బయటపడ్డాడు! ఏదేమైనా బీసీసీఐ సెలక్టర్లు అనుభవానికే ఓటేశారు. మరి.. సుదీర్ఘ కాలంగా ఐసీసీ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న భారత్కు ఈ జట్టు కప్పు అందిస్తుందా..?
2022 టీ20 ప్రపంచకప్లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం లభించింది. రోహిత్, కోహ్లి, హార్దిక్, సూర్యకుమార్, రిషబ్ పంత్, అర్ష్దీప్, అక్షర్ పటేల్, చాహల్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం జట్టుకు ఎంపికైనవారిలో ఇద్దరు ముగ్గురు మినహా అంతా ఫామ్లో ఉండటం సానుకూలాంశం. నిరుటి వన్డే ప్రపంచకప్లో రోహిత్, కోహ్లి.. కుర్రాళ్లతో పోటీపడి పరుగులు సాధించడంతో టీ20 ప్రపంచకప్లో వారిద్దరికి చోటు కల్పించాలన్న డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం వీరిద్దరూ ఫామ్లో ఉండటం జట్టు బలాన్ని పెంచేదే. ఐపీఎల్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన రోహిత్ 158.29 స్ట్రెక్రేట్తో 315 పరుగులు చేయగా.. కోహ్లి పరుగుల పోటీలో అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 10 మ్యాచ్ల్లో 147.49 స్ట్రైక్రేట్తో 500 పరుగులు చేశాడు. వెస్టిండీస్, అమెరికాలోని మందకొడి పిచ్లపై వీరిద్దరి ఆట కీలకంగా మారడం ఖాయం.
రింకూకు అదే నష్టం చేసిందా?
ఇక 2022 డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. మంచానికే పరిమితమైన పంత్ పొట్టి కప్పుకు ఎంపికవడం సంచలనమే. సుమారు 15 నెలలు ఆటకు దూరమైనా.. ఐపీఎల్లో తన ఫామ్, ఫిట్నెస్ను నిరూపించుకుని మళ్లీ భారత జట్టులో చోటు సంపాదించడం స్ఫూర్తినిచ్చేదే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆటను మలుపు తిప్పగల సత్తా అతడి సొంతం. ఈసారి ఐపీఎల్లో అతడు 11 మ్యాచ్ల్లో 158.56 స్ట్రైక్రేట్తో 398 పరుగులు సాధించాడు. సంజు శాంసన్ సైతం సెలెక్టర్లు తనను ఎంపిక చేయాల్సిన పరిస్థితిని కల్పించాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు సారథ్యం వహిస్తున్నా.. పొట్టి లీగ్లో నిలకడగా రాణిస్తున్నా భారత జట్టుకొచ్చేసరికి ఏవేవో కారణాలతో సంజుకు సెలెక్టర్లు మొండిచెయ్యి చూపిస్తూ వచ్చారు. తనకు ఎన్ని పరీక్షలు పెట్టినా మౌనంగానే పోరాటం చేసిన సంజు చివరికి విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో 161.08 స్ట్రైక్రేట్తో 385 పరుగులు రాబట్టిన సంజు మరింత గర్వంగా జట్టులోకి వచ్చాడు. నాలుగు నెలల క్రితం వరకు మారుమోగిన రింకూకు 15 మందిలో స్థానం దక్కలేదు. చెన్నై తరఫున భారీ సిక్సర్లతో అలరిస్తూ.. చివరి ఓవర్లలో దూకుడు ప్రదర్శిస్తున్న శివమ్ దూబె.. రింకూకు ఖో ఇచ్చాడు. నిజానికి ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన రింకూ ఆశలకు తెరవేసిందనే చెప్పాలి. కోల్కతా నైట్రైడర్స్లో టాప్ఆర్డర్ ఫామ్లో ఉండటంతో పాటు.. ఇంపాక్ట్ నిబంధన కారణంగా మరో స్పెషలిస్ట్ బ్యాటర్కు అతడి కంటే ముందే ఆడే అవకాశం రావడంతో.. ఈసారి లీగ్లో రింకూ (9 మ్యాచ్ల్లో 123)కు ఎక్కువగా ఆడే అవకాశమే రాలేదు. మరోవైపు టాప్ఆర్డర్లో ఆడిన దూబె చక్కటి ఇన్నింగ్స్తో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దూబె 9 మ్యాచ్ల్లో 172.41 స్ట్రైక్రేట్తో 350 పరుగులు చేశాడు.
హార్దిక్ పాండ్య, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో పెద్దగా నిరూపించుకోలేదు. ఇక ఈసారి ప్రపంచకప్లో అత్యంత కీలకపాత్ర స్పిన్నర్లదే. ఒకప్పుడు విజయవంతమైన జోడీగా పేరుతెచ్చుకున్న మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ మళ్లీ జట్టుకట్టనున్నారు. రవి బిష్ణోయ్ రెండో లెగ్ స్పిన్నర్ రేసులో నిలిచినా ఫామ్లో ఉన్న చాహల్కు అవకాశం దక్కింది. వీరంతా ఐపీఎల్లో వికెట్ల వేటలో ముందుండటం జట్టుకు ఉత్సాహాన్నిచ్చేదే. ఈ సీజన్లో ఫామ్లో లేని పేసర్లు సిరాజ్, అర్ష్దీప్ నుంచి బుమ్రాకు ఏమేరకు సహకారం లభిస్తుందో పొట్టి కప్పులోనే చూడాలి! ఏదేమైనా కేఎల్ రాహుల్, రింకూ సింగ్లను తప్పించడం మినహాయిస్తే తప్ప.. ప్రస్తుత జట్టుపై ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు లేవు. సీనియర్లు, కుర్రాళ్లతో సమతూకంగా కనిపిస్తున్న ఈ జట్టు భారత ప్రపంచకప్ నిరీక్షణకు ముగింపు పలుకుతుందేమో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఆడటం చూడాలి.. ఇదంతా బీసీసీఐ చేతుల్లోనే..!: అంబటి రాయుడు
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ భవితవ్యంపై ఎవరికి తగ్గట్టుగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటివరకు దానిగురించి ధోనీ మాత్రం స్పందించలేదు. -
ఐపీఎల్ ప్లేఆఫ్స్ జట్లు.. ఈ కామన్ పాయింట్ గమనించారా?
PlayOffs Teams Names: ఐపీఎల్ 17వ సీజన్లో నాకౌట్ మ్యాచ్ల సందడి మొదలు కానుంది. దీనికి అర్హత సాధించిన నాలుగు జట్ల పేర్లు గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. -
వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేకుండా.. ఐపీఎల్ టాప్-2 జట్లా?
ఈ సారి ఐపీఎల్ టాప్లో ఉన్న కేకేఆర్, ఎస్ఆర్హెచ్కు ఓ ప్రత్యేకత ఉంది. రెండు జట్ల నుంచి టీమ్ ఇండియాలో స్థానం దక్కించుకొన్న ఒక్క ఆటగాడు కూడా లేడు. -
కొత్త ప్రధాన కోచ్ పదవి రేసులో ఫ్లెమింగ్.. జయవర్థెనె? అతడికే ఎక్కువ ఛాన్స్!
భారత ప్రధాన కోచ్ పదవి రేసులో కొత్త పేర్లు చర్చకొస్తున్నాయి. అయితే, ఇప్పటికే బీసీసీఐ వర్గాలు చెన్నై కోచ్తో సంప్రదింపులు జరిపాయనే కథనాలూ వస్తున్నాయి. -
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
ఐపీఎల్ 2024 చివరి దశకు వర్షం ముప్పు ఎదురవుతోంది. లీగ్ స్టేజ్లో కోల్కతా - రాజస్థాన్ మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే. మరి ప్లేఆఫ్స్కు ఇదే పరిస్థితి ఎదురైతే? అప్పుడు విజేతగా ఎవరిని ప్రకటిస్తారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. -
అప్పుడు సెలక్టర్ కాళ్లు పట్టుకోలేదని.. జట్టులోకి ఎంపిక చేయలేదు: గంభీర్
ఐపీఎల్ 17వ సీజన్ తొలి క్వాలిఫయర్లో కోల్కతా - హైదరాబాద్ జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కేకేఆర్ మెంటార్ గంభీర్ తన కెరీర్లో జరిగిన ఆసక్తికర విశేషాలను వెల్లడించాడు. -
తొలి అడుగు ఎవరిదో
రెండు జట్లూ పరుగుల వరద పారించాయి. రెండు జట్లలోనూ పవర్ హిట్టర్లున్నారు. హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అగ్రస్థానంలో ఉన్న కోల్కతా (20 పాయింట్లు), రెండో స్థానంలో నిలిచిన సన్రైజర్స్ (17 పాయింట్లు) మధ్య మంగళవారమే క్వాలిఫయర్-1. -
ఇది కోహ్లి రాసిన కథ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుతుందని ఓ నెల ముందు ఎంతమంది ఊహించివుంటారు..? బహుశా ఒక్కరూ ఉండరేమో! ఆ జట్టు ప్రదర్శన అలాంటిది మరి! ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు ఓటములతో పట్టికలో అట్టడుగున ఉన్న ఆర్సీబీ.. -
మన అమ్మాయి బంగారం
జపాన్లో ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్.. మహిళల టీ20 400 మీటర్ల రేసు ఆరంభమైంది. నాలుగో లేన్లో పరుగు మొదలుపెట్టిన తెలంగాణ అమ్మాయి జీవాంజి దీప్తి ఆరంభంలో వెనుకబడింది. -
దీప్తి.. విజయ స్ఫూర్తి
తల్లిదండ్రులు కూలి పని చేస్తేనే ఇళ్లు గడిచే నేపథ్యం ఆమెది. ఒకవైపు పేదరికం.. మరోవైపు మానసిక లోపం! చాలా ఇబ్బందులు పడింది.. అవమానాలు ఎదుర్కొంది.. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. -
జ్యోతి బృందానికి పసిడి
ఆసియా అథ్లెటిక్స్ రిలే ఛాంపియన్షిప్లో భారత 4×400 మీటర్ల మిక్స్డ్ జట్టు అదరగొట్టింది. ‘లక్ష్య’ అథ్లెట్ జ్యోతికశ్రీ దండి, మహ్మద్ అజ్మల్, అమోజ్ జాకబ్, శుభ వెంకటేశన్లతో కూడిన బృందం 3 నిమిషాల 14.12 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం ఎగరేసుకుపోయింది. -
మహి సరదాగా అలా
ఓటమి బాధను మర్చిపోవడానికి ఒక్కో ఆటగాడు ఒక్కో రకంగా ప్రయత్నిస్తుంటాడు. వేర్వేరు వ్యాపకాల్లో పడిపోతుంటారు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోని తనదైన శైల్లో ద్విచక్రవాహనంపై చక్కర్లు కొట్టాడు. -
సింధుకు పరీక్ష
పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు మరో సవాల్కు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక క్రీడల్లో పతకం సాధించాలని భావిస్తున్న సింధు మలేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. -
ఆసియా ఆర్చరీకి గణేశ్
దక్షిణ కొరియాలోని సువాన్లో జరిగే 2024 ఆర్చరీ ఆసియా కప్ పోటీలకు తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన తిరుమూరు గణేష్ మణిరత్నం ఎంపికయ్యాడు. -
ఐపీఎల్ దగ్గరి దారి కాకూడదు
భారత జట్టుకు ఆడాలనే కుర్రాళ్లకు ఐపీఎల్ దగ్గరి దారి కాకూడదని టీమ్ఇండియా మాజీ ఓపెనర్, కేకేఆర్ మార్గనిర్దేశకుడు గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ‘‘భారత్ తరపున ఎంతమంది యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటున్నారు? -
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు ఆటగాడు యశ్ దయాల్ ఉత్తమ ప్రదర్శనతో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. గతేడాది ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు ఇచ్చి తీవ్ర విమర్శలపాలైన అతడు.. ఈ సారి వేలంపాటలోనూ ఆర్సీబీ తీసుకున్నందుకు విపరీతమైన ట్రోలింగ్కు గురయ్యాడు. -
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల మండిపడ్డాడు. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిపై ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్స్పోర్ట్స్ స్పందించింది. -
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
తొడ కండర గాయంతో బాధపడుతున్న ధోనీ (MS Dhoni) దానికి శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం త్వరలో లండన్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని సీఎస్కే వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
తొలి క్వాలిఫయర్.. అభిషేక్కు ఆ జోడీ నుంచే ముప్పు: భారత మాజీ క్రికెటర్
-
సిట్ నివేదికపై ఈసీ ఆదేశాలు వస్తే ఏం చేద్దాం?.. సీఎస్తో డీజీపీ భేటీ
-
రీకాల్, కోక్రియేట్ ఫీచర్లతో ఏఐ తరం కోసం మైక్రోసాఫ్ట్ కోపైలట్+ పీసీలు
-
మళ్లీ మరచిపోయిన బైడెన్.. ఈసారి ‘వైస్ ప్రెసిడెంట్’
-
దేశ ప్రజలే నా వారసులు - విపక్షాలపై మండిపడ్డ మోదీ
-
ధోనీ ఆడటం చూడాలి.. ఇదంతా బీసీసీఐ చేతుల్లోనే..!: అంబటి రాయుడు