IPL 2024: ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది.
ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్నప్పటికీ కప్పు గెలవని జట్లు మూడు. అవే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్గా మారిన దిల్లీ డేర్డెవిల్స్, పంజాబ్ కింగ్స్గా రూపాంతరం చెందిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఐతే ఆర్సీబీ మినహా మిగతా రెండు జట్ల వైఫల్యం గురించి పెద్దగా చర్చ ఉండదు. సామాజిక మాధ్యమాల్లో వాటిని అభిమానులు అంతగా పట్టించుకోరు. కానీ బెంగళూరు వైఫల్యం గురించి ఎడతెగని చర్చ జరుగుతుంటుంది. ఆ జట్టు ఓడిన ప్రతిసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురుస్తుంది. మీమ్స్ మోత మోగుతుంది. ఈ సీజన్లోనూ ఆర్సీబీ పేలవ ప్రదర్శన చేస్తుండటం ఆ జట్టు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. భారీ అంచనాలున్న ఆటగాళ్లు కూడా బెంగళూరు జట్టులోకి వస్తే విఫలం కావడం.. ఇక్కడ్నుంచి వేరే జట్లకు వెళ్లిన ఆటగాళ్లు అదరగొట్టడం చూసి ఇదేం శాపం అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
కప్పు కొట్టలేదన్న మాటే కానీ.. ఆదరణ విషయంలో ఆర్సీబీకి తిరుగులేదు. ఐదేసి సార్లు టైటిల్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లకు దీటుగా ఆ జట్టుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రతిసారీ ఆర్సీబీ మీద భారీ అంచనాలు నెలకొంటాయి. ఈసాలా కప్ నమదే అంటూ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ తీరా చూస్తే ఏదో ఒక దశలో నిష్క్రమించి టైటిల్కు దూరం కావడం మామూలే. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్ చేరినా కప్పు గెలవలేకపోయిన ఆర్సీబీ.. 2016 తర్వాత మూడు సీజన్ల పాటు గ్రూప్ దశ కూడా దాటలేదు. ఆ తర్వాత మూడు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరినా ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. గత సీజన్లో మళ్లీ గ్రూప్ దశకే పరిమితం అయింది. ఈసారి కూడా కథ మారేలా లేదు. తొలి 8 మ్యాచ్ల్లో 7 ఓడి దాదాపుగా ప్లేఆఫ్స్కు దూరమైన స్థితికి చేరుకుంది. తర్వాత రెండు విజయాలు సాధించినా లీగ్ దశ దాటే అవకాశాలు స్వల్పమే. ఎన్నో అంచనాలు పెట్టుకున్న స్టార్ ఆటగాళ్లు ఈసారి ఆ జట్టు కొంప ముంచేశారు.
ఏదో చేస్తారనుకుంటే..
గ్లెన్ మ్యాక్స్వెల్ ఆస్ట్రేలియా తరఫున గత ఏడాది అద్భుతంగా రాణించాడు. వన్డే ప్రపంచకప్లోనే కాక వేరే మ్యాచ్ల్లోనూ మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. కానీ ఆర్సీబీ తరఫున మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్ల్లో 5.33 సగటు, 94 స్ట్రైక్ రేట్తో 32 పరుగులు మాత్రమే చేశాడు. ఆర్సీబీ తరఫున మ్యాక్సీ ఎప్పుడూ నిలకడగా రాణించింది లేదు. ఒకప్పుడు పంజాబ్ తరఫున కొన్ని సీజన్లలో అతను నిలకడగా రాణించాడు. కానీ ఆర్సీబీకి వచ్చాక అతను అంచనాలను అందుకోలేకపోయాడు. అంతర్జాతీయ క్రికెట్లో, వేరే లీగ్స్లో రాణిస్తూ ఐపీఎల్లో మాత్రం అతను నిరాశపరుస్తున్నాడు. ఇక ఈ సీజన్లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన విల్ జాక్స్ సైతం నిరాశపరుస్తున్నాడు. అతను ఐపీఎల్కు రావడానికి ముందు బంగ్లాదేశ్ ప్రిమియర్ లీగ్లో రెచ్చిపోయి ఆడాడు. ఓ సెంచరీ కూడా చేశాడు. బౌలింగ్లోనూ రాణించాడు. వేరే లీగ్స్లో కూడా అదరగొట్టాడు. వరుసగా ఓటములు చవిచూస్తున్న ఆర్సీబీ రాత మార్చేది అతడే అన్న చర్చ జరిగింది. కానీ లేటుగా లీగ్లోకి అడుగుపెట్టిన అతను.. అవకాశాలను అతను అందిపుచ్చుకోలేకపోయాడు. తొలి 4 మ్యాచ్ల్లో 76 పరుగులే చేసి 2 వికెట్లే పడగొట్టాడు. ఆర్సీబీకి ప్లేఆఫ్స్ దారులు దాదాపుగా మూసుకుపోయాక గుజరాత్ మీద మెరుపు సెంచరీ సాధించాడు. దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండేలా కనిపించడం లేదు. మరోవైపు ముంబయి నుంచి ఆర్సీబీ ట్రేడ్ చేసుకున్న ఆస్ట్రేలియా అగ్రశ్రేణి ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా ఈసారి తేలిపోయాడు. ముంబయి తరఫున ఓ మోస్తరు ప్రదర్శన చేసిన అతను.. ఆర్సీబీ తరఫున మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. 8 మ్యాచ్ల్లో 111 పరుగులే చేసి, 6 వికెట్లే తీశాడు. గ్రీన్ కోసం ఆర్సీబీ రూ.17.5 కోట్లు వెచ్చించడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్లో మంచి రికార్డున్న రీస్ టాప్లీ సైతం ఆర్సీబీ తరఫున విఫలమవుతున్నాడు. రెండు సీజన్లలో కలిపి 5 మ్యాచ్లాడిన టాప్లీ 5 వికెట్లు మాత్రమే తీశాడు.
ఇక్కడి నుంచి వెళ్తే సూపర్ హిట్
ఆర్సీబీ తరఫున విఫలమైన ఆటగాళ్లు వేరే జట్లకు వెళ్లి అదరగొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఐపీఎల్ తొలి సీజన్లో రాజస్థాన్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి చాలా సీజన్ల పాటు ఆ జట్టుకే ఆడిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ షేన్ వాట్సన్.. బెంగళూరు జట్టులోకి వచ్చాక తనదైన ముద్ర వేయలేకపోయాడు. ఆ జట్టు తరఫున 24 మ్యాచ్లు ఆడి 13.5 సగటుతో 250 పరుగులే చేశాడు. ఆర్సీబీ తరఫున అతను ఒక్క అర్ధశతకం కూడా సాధించలేదు. బౌలింగ్లో పర్వాలేదు 25 వికెట్లు తీశాడు. ఇదే ఆటగాడు తర్వాత చెన్నైకి మారి చివరి మూడు సీజన్లలో అదరగొట్టాడు. 43 మ్యాచ్ల్లో 30కి పైగా సగటుతో 1252 పరుగులు సాధించాడు. అందులో రెండు శతకాలు కూడా ఉన్నాయి. చెన్నై అతణ్ని ఓపెనర్గా ఆడించింది. బౌలింగ్లో పెద్దగా ఉపయోగించుకోలేదు. 2018 ఐపీఎల్ ఫైనల్లో సెంచరీతో జట్టుకు కప్పు అందించిన ఘనత వాట్సన్ సొంతం. ఇక ఇదే జట్టులో గత రెండు సీజన్ల నుంచి అదరగొడుతున్న శివమ్ దూబె కూడా ఒకప్పుడు ఆర్సీబీ ఆటగాడే. ఆ జట్టుకు 15 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించిన దూబె 169 పరుగులే చేసి, 4 వికెట్లే తీశాడు. కానీ చెన్నై తరఫున గత సీజన్లో 418 పరుగులు చేసిన అతను.. ఈ సీజన్లో 6 మ్యాచ్ల్లోనే 242 పరుగులు సాధించాడు. స్పిన్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ సైతం ఆర్సీబీలో ఉండగా పెద్దగా రాణించింది లేదు. కానీ ఇప్పుడు సన్రైజర్స్ తరఫున కొన్ని మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. స్పిన్నర్గానూ పర్వాలేదనిపిస్తున్నాడు. ఇంకా క్వింటన్ డికాక్, బ్రెండన్ మెక్కలమ్.. ఇలా చాలామంది ఆటగాళ్లు వేరే జట్ల తరఫున సత్తా చాటి బెంగళూరు తరఫున మాత్రం విఫలమైన వాళ్లే.
- ఈనాడు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీనియర్లుగా జట్టులో మీ బాధ్యత అదే కదా..: హర్భజన్
జట్టును కలిసికట్టుగా నడిపించడంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యతోపాటు సీనియర్లూ విఫలం కావడం వల్లే ముంబయి ప్లేఆఫ్స్కు చేరుకోలేదని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ వ్యాఖ్యానించాడు. -
తొలి క్వాలిఫయర్.. అభిషేక్కు ఆ జోడీ నుంచే ముప్పు: భారత మాజీ క్రికెటర్
నాకౌట్ దశలో తొలి మ్యాచ్ కోల్కతాతో తలపడేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. -
ధోనీ ఆడటం చూడాలి.. ఇదంతా బీసీసీఐ చేతుల్లోనే..!: అంబటి రాయుడు
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ భవితవ్యంపై ఎవరికి తగ్గట్టుగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటివరకు దానిగురించి ధోనీ మాత్రం స్పందించలేదు. -
ఐపీఎల్ ప్లేఆఫ్స్ జట్లు.. ఈ కామన్ పాయింట్ గమనించారా?
PlayOffs Teams Names: ఐపీఎల్ 17వ సీజన్లో నాకౌట్ మ్యాచ్ల సందడి మొదలు కానుంది. దీనికి అర్హత సాధించిన నాలుగు జట్ల పేర్లు గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. -
వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేకుండా.. ఐపీఎల్ టాప్-2 జట్లా?
ఈ సారి ఐపీఎల్ టాప్లో ఉన్న కేకేఆర్, ఎస్ఆర్హెచ్కు ఓ ప్రత్యేకత ఉంది. రెండు జట్ల నుంచి టీమ్ ఇండియాలో స్థానం దక్కించుకొన్న ఒక్క ఆటగాడు కూడా లేడు. -
కొత్త ప్రధాన కోచ్ పదవి రేసులో ఫ్లెమింగ్.. జయవర్థెనె? అతడికే ఎక్కువ ఛాన్స్!
భారత ప్రధాన కోచ్ పదవి రేసులో కొత్త పేర్లు చర్చకొస్తున్నాయి. అయితే, ఇప్పటికే బీసీసీఐ వర్గాలు చెన్నై కోచ్తో సంప్రదింపులు జరిపాయనే కథనాలూ వస్తున్నాయి. -
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
ఐపీఎల్ 2024 చివరి దశకు వర్షం ముప్పు ఎదురవుతోంది. లీగ్ స్టేజ్లో కోల్కతా - రాజస్థాన్ మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే. మరి ప్లేఆఫ్స్కు ఇదే పరిస్థితి ఎదురైతే? అప్పుడు విజేతగా ఎవరిని ప్రకటిస్తారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. -
అప్పుడు సెలక్టర్ కాళ్లు పట్టుకోలేదని.. జట్టులోకి ఎంపిక చేయలేదు: గంభీర్
ఐపీఎల్ 17వ సీజన్ తొలి క్వాలిఫయర్లో కోల్కతా - హైదరాబాద్ జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కేకేఆర్ మెంటార్ గంభీర్ తన కెరీర్లో జరిగిన ఆసక్తికర విశేషాలను వెల్లడించాడు. -
తొలి అడుగు ఎవరిదో
రెండు జట్లూ పరుగుల వరద పారించాయి. రెండు జట్లలోనూ పవర్ హిట్టర్లున్నారు. హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అగ్రస్థానంలో ఉన్న కోల్కతా (20 పాయింట్లు), రెండో స్థానంలో నిలిచిన సన్రైజర్స్ (17 పాయింట్లు) మధ్య మంగళవారమే క్వాలిఫయర్-1. -
ఇది కోహ్లి రాసిన కథ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుతుందని ఓ నెల ముందు ఎంతమంది ఊహించివుంటారు..? బహుశా ఒక్కరూ ఉండరేమో! ఆ జట్టు ప్రదర్శన అలాంటిది మరి! ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు ఓటములతో పట్టికలో అట్టడుగున ఉన్న ఆర్సీబీ.. -
మన అమ్మాయి బంగారం
జపాన్లో ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్.. మహిళల టీ20 400 మీటర్ల రేసు ఆరంభమైంది. నాలుగో లేన్లో పరుగు మొదలుపెట్టిన తెలంగాణ అమ్మాయి జీవాంజి దీప్తి ఆరంభంలో వెనుకబడింది. -
దీప్తి.. విజయ స్ఫూర్తి
తల్లిదండ్రులు కూలి పని చేస్తేనే ఇళ్లు గడిచే నేపథ్యం ఆమెది. ఒకవైపు పేదరికం.. మరోవైపు మానసిక లోపం! చాలా ఇబ్బందులు పడింది.. అవమానాలు ఎదుర్కొంది.. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. -
జ్యోతి బృందానికి పసిడి
ఆసియా అథ్లెటిక్స్ రిలే ఛాంపియన్షిప్లో భారత 4×400 మీటర్ల మిక్స్డ్ జట్టు అదరగొట్టింది. ‘లక్ష్య’ అథ్లెట్ జ్యోతికశ్రీ దండి, మహ్మద్ అజ్మల్, అమోజ్ జాకబ్, శుభ వెంకటేశన్లతో కూడిన బృందం 3 నిమిషాల 14.12 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం ఎగరేసుకుపోయింది. -
మహి సరదాగా అలా
ఓటమి బాధను మర్చిపోవడానికి ఒక్కో ఆటగాడు ఒక్కో రకంగా ప్రయత్నిస్తుంటాడు. వేర్వేరు వ్యాపకాల్లో పడిపోతుంటారు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోని తనదైన శైల్లో ద్విచక్రవాహనంపై చక్కర్లు కొట్టాడు. -
సింధుకు పరీక్ష
పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు మరో సవాల్కు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక క్రీడల్లో పతకం సాధించాలని భావిస్తున్న సింధు మలేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. -
ఆసియా ఆర్చరీకి గణేశ్
దక్షిణ కొరియాలోని సువాన్లో జరిగే 2024 ఆర్చరీ ఆసియా కప్ పోటీలకు తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన తిరుమూరు గణేష్ మణిరత్నం ఎంపికయ్యాడు. -
ఐపీఎల్ దగ్గరి దారి కాకూడదు
భారత జట్టుకు ఆడాలనే కుర్రాళ్లకు ఐపీఎల్ దగ్గరి దారి కాకూడదని టీమ్ఇండియా మాజీ ఓపెనర్, కేకేఆర్ మార్గనిర్దేశకుడు గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ‘‘భారత్ తరపున ఎంతమంది యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటున్నారు? -
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు ఆటగాడు యశ్ దయాల్ ఉత్తమ ప్రదర్శనతో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. గతేడాది ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు ఇచ్చి తీవ్ర విమర్శలపాలైన అతడు.. ఈ సారి వేలంపాటలోనూ ఆర్సీబీ తీసుకున్నందుకు విపరీతమైన ట్రోలింగ్కు గురయ్యాడు. -
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల మండిపడ్డాడు. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిపై ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్స్పోర్ట్స్ స్పందించింది. -
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
తొడ కండర గాయంతో బాధపడుతున్న ధోనీ (MS Dhoni) దానికి శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం త్వరలో లండన్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని సీఎస్కే వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సినీనటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షోపై రాళ్ల దాడి!
-
మరో వీడియో పోస్ట్ చేసిన నటి హేమ
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం
-
బ్రిజ్ భూషణ్కు షాక్.. అభియోగాలు నమోదు
-
సందేశ్ఖాలీకి వెళ్తాను: మమతా బెనర్జీ