సీఎం అమరీందర్‌సింగ్‌తో సిద్ధూ భేటీ

పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌తో ఆ రాష్ట్ర మాజీమంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ (మాజీ క్రికెటర్‌) బుధవారం భేటీ అయ్యారు. కీలక శాఖను సీఎం తొలగించారన్న కినుకతో గతంలో రాష్ట్ర కేబినెట్‌ నుంచి వైదొలగిన సిద్ధూ తాజా సమావేశంలో మళ్లీ మంత్రివర్గంలో చేరికపై చర్చలు జరిపారు.

Updated : 18 Mar 2021 05:39 IST

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌తో ఆ రాష్ట్ర మాజీమంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ (మాజీ క్రికెటర్‌) బుధవారం భేటీ అయ్యారు. కీలక శాఖను సీఎం తొలగించారన్న కినుకతో గతంలో రాష్ట్ర కేబినెట్‌ నుంచి వైదొలగిన సిద్ధూ తాజా సమావేశంలో మళ్లీ మంత్రివర్గంలో చేరికపై చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి వ్యవసాయక్షేత్రంలో నలభై నిమిషాలపాటు జరిగిన ఈ తేనీటి సమావేశం తాలూకు చిత్రాలను సీఎం మీడియా సలహాదారు ట్విటరు ద్వారా పంచుకున్నారు. అమృతసర్‌ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధూ ముఖ్యమంత్రితో జరిపిన చర్చలపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని