Janasena: ఇంటింటి సమాచారం తేవాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారు?: నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై సీఎం జగన్ ఏనాడైనా మాట్లాడారా? అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
మంగళగిరి: రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై సీఎం జగన్ ఏనాడైనా మాట్లాడారా? అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఉపాధి అవకాశాలు లేక యువత ఇబ్బందిపడుతుంటే వైకాపా ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాదెండ్ల మాట్లాడారు.
‘‘వాలంటీర్ వ్యవస్థను వైకాపా వ్యవస్థగా చెబుతున్నారు. దీని గురించి పవన్ మాట్లాడిన విషయాలపై కేసు నమోదు చేశారు. వారి కోసం ఏటా రూ.1,560 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దానిలో రూ.617 కోట్లు డేటా సేకరణ కోసం కేటాయించారు. ఇంటింటి సమాచారం తేవాలని వారికి ఎవరు చెప్పారు?ఈ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా?అలా సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారు? వీటికి సమాధానం చెప్పకుండా మంత్రులు, పోలీసులు ఎదురుదాడికి దిగుతున్నారు. వాలంటీర్లపై జనసేన పార్టీకి ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది