Lokesh-Yuvagalam: లోకేశ్‌ పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆయన కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

Updated : 31 Aug 2023 13:39 IST

ఏలూరు: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రలో ఆయన కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో కొయ్యలగూడెంలో ప్రారంభమైన పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబసభ్యులు పాల్గొని లోకేశ్‌ వెంట నడిచారు. లోకేశ్‌ తల్లి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. మరోవైపు కొయ్యలగూడెం వద్ద పార్టీ కార్యకర్తలు లోకేశ్‌కు యాపిల్‌ గజమాలతో ఘన స్వాగతం పలికారు.

ప్రజల గొంతుకగా ‘యువగళం’: చంద్రబాబు అభినందనలు

‘యువగళం’ పాదయాత్ర 200 రోజులు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ పాదయాత్రలు నిర్వహించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ యాత్రల్లో తెదేపా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తెదేపా కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేస్తానని హామీతో పైలాన్‌ను లోకేశ్‌ ఆవిష్కరించారు. లోకేశ్‌ పాదయాత్రతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాక్షస పాలనను పారదోలి రామరాజ్యం తీసుకొచ్చేందుకు చంద్రబాబు ఆధ్వర్యంలో తామంతా కష్టపడి పనిచేస్తామని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు