Yuvagalam: ప్రజల గొంతుకగా ‘యువగళం’: చంద్రబాబు అభినందనలు

యువత గళం నుంచి ప్రజల గొంతుకగా యువగళం ఎదిగిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర 200వ రోజుకు చేరిన సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు.

Updated : 31 Aug 2023 09:58 IST

అమరావతి: యువత గళం నుంచి ప్రజల గొంతుకగా యువగళం ఎదిగిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర 200వ రోజుకు చేరిన సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. నారా లోకేశ్‌, యువగళం బృందానికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన మంచి పనిని కొనసాగించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. జనవరి 27న మొదలైన ఈ యాత్ర ఇప్పటివరకు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,710 కి.మీ. పూర్తిచేసుకుంది.

యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా గురువారం అన్ని నియోజకవర్గాల్లో మూడు కి.మీ. మేర సంఘీభావ పాదయాత్రలు నిర్వహించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో తెదేపా శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. నవులూరు గ్రామం నుంచి యర్రబాలెం వరకు సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మొదలుపెట్టిన పాదయాత్రలో పెద్ద సంఖ్యలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. తెదేపా మేనిఫేస్టోలో పొందుపరిచిన హామీల ప్లకార్డులను ప్రదర్శిస్తూ పాదయాత్ర చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని