Boora Narsaiah Goud: జేపీ నడ్డాను కలిసిన బూర నర్సయ్యగౌడ్‌.. భాజపాలో చేరేందుకు సిద్ధం

తెరాస నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌  భాజపాలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. 

Published : 15 Oct 2022 01:48 IST

హైదరాబాద్‌: తెరాస నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌  భాజపాలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. 2013లో తెరాసలో చేరిన బూర నర్సయ్యగౌడ్‌ 2014 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో పోటీ చేసిన ఆయన కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి(కాంగ్రెస్‌) చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెరాస తరఫున ఎమ్మెల్యే టికెట్‌ ఆశించారు. కానీ తెరాస అధిష్ఠానం కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భాజపాలో చేరేందుకు బూర నర్సయ్యగౌడ్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని