YS Sharmila: జగన్.. మీరు ఏం చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడు: షర్మిల
నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్ ప్రత్యేక హోదాను విస్మరించారని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
అనంతపురం: నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్ ప్రత్యేక హోదాను విస్మరించారని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు. అనంతపురంలో నిర్వహించిన ‘కాంగ్రెస్ న్యాయ సాధన సభ’కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. ఒక్కమాట కూడా నిలబెట్టుకోని జగన్ వైఎస్ రాజశేఖర్ వారసుడు ఎలా అవుతారు?అని ప్రశ్నించారు.
‘‘ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. హోదా కోసం గతంలో జగనన్న దీక్షలు చేశారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే హోదా ఎందుకు రాదని ప్రశ్నించారు. ప్రజలు జగన్ను నమ్మి గెలిపించారు. మరి సీఎం అయ్యాక ఆయన ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేశారా? అధికారంలోకి వచ్చాక వైకాపా ఎంపీలు రాజీనామా చేశారా? అధికారంలోకి రాగానే 23 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తానని చెప్పి ఇప్పుడు ఎన్నికల వేళ హడావుడిగా 6వేల పోస్టులతో దగా డీఎస్సీ వేశారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా? కాంగ్రెస్ తరఫున పోరాటం చేసిన నన్ను.. ఒక మహిళనని చూడకుండా దారుణంగా ప్రవర్తించి అడ్డుకున్నారు. జగన్ తన పాలనలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి.. ప్రభుత్వం ద్వారానే నాసిరకం మద్యం అమ్ముతున్నారు.
గతంలో పార్టీని నడిపిస్తే.. దూషిస్తున్నారు
గతంలో 3 వేల కి.మీ పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టాను. అలాంటిది.. చెల్లినని చూడకుండా నాపై, నా భర్తపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. డబ్బులు పెట్టి సోషల్మీడియాలో దూషిస్తున్నారు. జగన్.. మీరు ఏం చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. నేను వైఎస్ రాజశేఖర్ బిడ్డని. రాష్ట్ర ప్రజలకు మేలు చేయడం కోసమే ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఇందిరమ్మ అభయం కింద ఇంటింటికి మహిళల పేరు మీద రూ.5 వేల ఆర్థిక సాయం అందజేస్తాం’’ అని షర్మిల తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది