WTC Final 2023: మేం గెలవడానికి ప్రధాన కారణమదే: ఆసీస్ ప్రధాన కోచ్
రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final 2023) మ్యాచ్లో భారత్పై ఆసీస్ విజయం సాధించి గదను సొంతం చేసుకుంది. ఇక మూడో సీజన్ కోసం ఆస్ట్రేలియా సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆసీస్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్డోనాల్డ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC Final) ఫైనల్లో భారత్ ఓడించి టెస్టు ‘గద’ను ఆస్ట్రేలియా పట్టుకుపోయింది. ఇంగ్లాండ్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగడం వల్లే ఆసీస్కు కలిసొచ్చిందనే వాదనా ఉంది. అయితే, తాము ఉపఖండంలో పర్యటించడం వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకుని గదను సొంతం చేసుకున్నట్లు ఆసీస్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ విశ్లేషించాడు. 2019-21 సీజన్లో ఓవర్ రేట్ పెనాల్టీల కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్కు రాలేకపోయామని.. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నట్లు పేర్కొన్నాడు. ‘‘ఉపఖండంలో మా పర్యటన పాకిస్థాన్ నుంచి శ్రీలంక మీదుగా భారత్కు సాగింది. అక్కడ సాధించిన విజయాల వల్లే ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకోగలిగాం. విజయం సాధించాం’’ అని తెలిపాడు.
‘‘ఆసీస్ గడ్డపై మేం చాలా బలమైన టీమ్ అని తెలుసు. అందుకే చాలా మంది ఇక్కడే గెలవడం వల్ల మా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకుందని భావిస్తారు. కానీ మేం పాక్, శ్రీలంకతోపాటు భారత్లో టెస్టు విజయాలు నమోదు చేయడంతోనే ఫైనల్ బెర్తు ఖరారైంది. కొత్తగా వచ్చినప్పుడు సరైన ప్రణాళికతో ముందుకు సాగలేకపోయాం. కొన్నిసార్లు ఓవర్రేట్ వల్ల మొదటి డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్లలేకపోయాం. ఇప్పుడు మాత్రం ఓ పద్ధతి ప్రకారం ఆ ఓవర్ రేట్ పెనాల్టీల భారం పడకుండా ముందుకు సాగాం. చివరికి విజయం సాధించాం. ఇక నుంచి మేం యాషెస్ సిరీస్పై దృష్టిసారిస్తాం’’ అని మెక్డోనాల్డ్ పేర్కొన్నాడు.
డబ్ల్యూటీసీ రెండో సీజన్లో భారత పర్యటనకు ముందు ఆసీస్ తొలుత పాకిస్థాన్తో మూడు మ్యాచ్ల సిరీస్ ఆడింది. అందులో 1-0 ఆధిక్యంతో టెస్టు సిరీస్ను గెలిచింది. ఆ తర్వాత శ్రీలంకపై రెండు టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. ఇక భారత్లోకి అడుగు పెట్టిన ఆసీస్ నాలుగు టెస్టుల బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని 1-2తేడాతో ఓడిపోయింది. అయితే ఒక టెస్టు గెలవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక శుక్రవారం నుంచే ఇంగ్లాండ్ - ఆసీస్ జట్ల మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ మూడో సీజన్ (2023-25) సైకిల్ మొదలుకానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమానులారా.. మ్యాచ్ ముగిశాక వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై తమ సొంతమైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడుతోంది. ధోనీని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. -
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే దిల్లీ, బెంగళూరుకు ఈ విజయం కీలకమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ మ్యాచ్ జరగనుంది. -
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
బెంగళూరు ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండటానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. నాణ్యమైన ఇన్నింగ్స్లతో ఆర్సీబీ జట్టులో కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
ప్లేఆఫ్స్ కోసం తీవ్రంగా పోరాడుతున్న దిల్లీ జట్టుకు ఐపీఎల్ కమిటీ షాక్ ఇచ్చింది. ఆ జట్టు సారథిపై ఒక మ్యాచ్ వేటు వేసింది. -
డిన్నర్ డేట్లో విరాట్ అనుష్క.. ఫొటోలు వైరల్
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్గా మారాయి. -
ఫ్యాన్స్కు ‘సండే’ ఫన్.. నాలుగు టీమ్ల్లో ఎవరిది విన్?
మూడు ‘ప్లేఆఫ్స్ స్థానాల కోసం ఐదు జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. అందులో ఇవాళ నాలుగు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. -
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరిన మొదటి టీమ్గా కోల్కతా అర్హత సాధించింది. ముంబయిని చిత్తు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. -
తొలి అడుగు కోల్కతాదే
ఐపీఎల్-17లో ఎట్టకేలకు ఒక జట్టు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. సీజన్లో నిలకడగా రాణిస్తున్న కోల్కతా నైట్రైడర్స్ తొమ్మిదో విజయంతో ముందంజ వేసింది. -
ముంబయికి రోహిత్ గుడ్బై?
ముంబయి ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ వదిలేయబోతున్నాడా? ఇప్పుడు చర్చంతా ఈ ప్రశ్న చుట్టూనే సాగుతోంది. -
దిగిపోనున్న ద్రవిడ్!
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మరోసారి దరఖాస్తు చేసేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేడని తెలిసింది. -
పంత్పై ఓ మ్యాచ్ సస్పెన్షన్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న దిల్లీ క్యాపిటల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
తర్వాతి అంచెలో గెలుస్తా
డైమండ్ లీగ్ తర్వాతి అంచె పోటీల్లో విజేతగా నిలుస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. -
అమన్కు ఒలింపిక్స్ బెర్తు
పారిస్ ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్లో భారత్కు తొలి బెర్తు ఖరారైంది. -
రెండు భాగాలుగా రంజీ ట్రోఫీ
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీని 2024-25 సీజన్లో బీసీసీఐ రెండు దఫాలుగా నిర్వహించే అవకాశముంది. -
పేస్ యోధుడి ఆఖరాట
ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆటకు వీడ్కోలు పలికే సమయం దగ్గరపడింది. -
ఒలింపిక్స్ బిడ్ కోసం సిద్ధంగా ఉన్నాం
2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవడం కష్టమన్న అభిప్రాయాలను క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. -
ఫ్రెంచ్ ఓపెన్లో ఆడాలా? వద్దా?
తన కంచుకోట ఫ్రెంచ్ ఓపెన్లో ఈ ఏడాది బరిలో దిగాలా? వద్దా? అని టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ సందిగ్ధంలో పడ్డాడు. -
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
ఐపీఎల్-2024లో కోల్కతా అదరగొడుతోంది. ముంబయిపై 18 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
నాలుగో ఆర్థిక శక్తి.. 2025లో జపాన్ను దాటనున్న భారత్!
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు
-
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అభిమానులారా.. మ్యాచ్ ముగిశాక వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు