Jasprit Bumrah: తండ్రైన బుమ్రా.. ఇన్స్టాలో ఫొటో షేర్ చేసిన క్రికెటర్
టీమ్ఇండియా క్రికెటర్ బుమ్రా (Jasprit Bumrah) శుభవార్త పంచుకున్నాడు. ఆయన సతీమణి సంజనా గణేశన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తండ్రయ్యాడు. ఆయన భార్య సంజనా గణేశన్ సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఆనందకర విషయాన్ని బుమ్రా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఓ ఫొటో షేర్ చేశాడు.
‘‘మా చిన్న కుటుంబం పెరిగింది. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. ఈ రోజు ఉదయం మా చిన్నారి అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించాం. ఇప్పుడు మా ఆనందానికి అవధుల్లేవు. తల్లిదండ్రులుగా మా జీవితాల్లో ప్రారంభమైన ఈ కొత్త అధ్యాయాన్ని ప్రతిక్షణం ఆస్వాదించేందుకు ఎదురుచూస్తున్నాం’’ అని బుమ్రా (Jasprit Bumrah) ఇన్స్టాలో రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా బుమ్రా దంపతులు చిన్నారి చేతిని పట్టుకున్న ఫొటోను పంచుకున్నాడు.
‘కోహ్లీ అంటేనే ఇష్టం’.. పాక్లో విరాట్ ఫ్యాన్గర్ల్ వీడియో వైరల్
దీంతో బుమ్రా దంపతులకు తోటి క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. క్రికెటర్లు సూర్య కుమార్ యాదవ్, దినేశ్ కార్తిక్, రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే, యువరాజ్ సతీమణి హజెల్ కీచ్ తదితరులు బుమ్రా (Jasprit Bumrah)కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కారణంగానే ఆసియా కప్లో నేడు నేపాల్తో జరిగే మ్యాచ్కు బుమ్రా అందుబాటులో ఉండటం లేదన్న విషయం తెలిసిందే.
టీవీ పర్సనాలిటీ అయిన సంజనా గణేశన్ను బుమ్రా 2021 మార్చిలో వివాహం చేసుకున్నాడు. వెన్ను గాయంతో సుదీర్ఘకాలం క్రికెట్కు దూరంగా ఉన్న బుమ్రా.. ఇటీవల టీమ్ఇండియాలోకి పునరామనం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
-
సినీ నటుడు వెంకటేశ్ కూతురి ప్రచారం
-
హైదరాబాద్లో అభ్యర్థులకు ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయింపు
-
నీ పేరు పెట్టావ్.. ఒట్టు తీసి గట్టున పెట్టావ్
-
సన్ పిక్చర్స్కు ఇళయరాజా నోటీసు
-
ఏమైనా ఇచ్చేస్తాం.. ఎంతైనా కొనేస్తాం!.. ఓట్ల కొనుగోలుకు బరితెగించిన వైకాపా