క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది.
థామస్కప్ బ్యాడ్మింటన్
చెంగ్డూ (చైనా): ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. సోమవారం గ్రూప్-సి పోరులో భారత్ 5-0తో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. తొలి సింగిల్స్లో ప్రణయ్ 21-15, 21-15తో హ్యారీ హాంగ్ను ఓడించి శుభారంభం ఇచ్చాడు. మొదటి గేమ్లో ప్రణయ్ దూకుడుగా ఆడాడు. తన శైలిలో స్మాష్లు కొడుతూ 4-1 ఆధిక్యంలో నిలిచాడు. అదే జోరు కొనసాగిస్తూ 11-6తో బ్రేక్కు వెళ్లాడు. విరామం తర్వాతా ప్రణయ్దే జోరు. చక్కని ప్లేస్మెంట్లతో పాయింట్లు రాబట్టిన భారత స్టార్ 19-11తో ఆధిక్యంలోకి వెళ్లడమే కాక అదే ఊపులో గేమ్ గెలిచాడు. రెండో గేమ్లో హాంగ్ దూకుడుగా ఆడి 6-3తో నిలిచాడు. కానీ ప్రణయ్ పుంజుకున్నాడు. వరుస పాయింట్లు సాధించి 7-6తో ఆధిక్యంలో నిలిచాడు. విరామ సమయానికి 10-11తో స్వల్పంగా వెనుకబడినా.. బ్రేక్ తర్వాత ప్రణయ్ జోరు ప్రదర్శించాడు. క్రాస్కోర్టు షాట్లతో విజృంభించి 17-12తో నిలవడమే కాక అదే జోరుతో గేమ్తో పాటు మ్యాచ్ కైవసం చేసుకున్నాడు.
సాత్విక్ జోడీ కష్టంగా..: డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి 21-17, 19-21, 21-15తో బెన్ లేన్-సీన్ వాండీ జోడీపై కష్టపడి గెలిచింది. మొదటి నుంచే బెన్-సీన్ జంట నుంచి భారత ద్వయానికి గట్టిపోటీ ఎదురైంది. అయినా తొలి గేమ్లో గెలిచి ఆధిక్యంలో నిలిచిన భారత జంటకు రెండో గేమ్లో ప్రత్యర్థి జంట నుంచి మరింత ప్రతిఘటన ఎదురైంది. దీంతో విరామ సమయానికి సాత్విక్ ద్వయం 8-11తో వెనుకబడింది. ఆ తర్వాత పోరాడి 18-19తో ప్రత్యర్థికి సమీపంగా వచ్చినా.. గేమ్ దక్కించుకోలేకపోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్లో భారత జోడీకి పోటీ తప్పలేదు. ఒక దశలో స్కోరు 4-4తో సమమైంది. బ్రేక్ సమయానికి 11-8తో ఆధిక్యంలో నిలిచిన సాత్విక్ ద్వయం.. విరామం తర్వాత చెలరేగింది. ప్రత్యర్థి ద్వయం నుంచి పోటీ ఎదురైనా నిలిచి 19-14తో ఆధిక్యంలోకి వెళ్లడమే కాక.. అదే దూకుడుతో గేమ్తో పాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది. రెండో సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ 21-16, 21-11తో నదీమ్ దాల్వీపై, డబుల్స్లో అర్జున్-ధ్రువ్ కపిల ద్వయం 21-17, 21-19తో రోరీ ఈస్టన్-అలెక్స్ గ్రీన్ జంటపై గెలవడంతో భారత్ 4-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. చివరి సింగిల్స్లో కిరణ్ జార్జ్ 21-18, 21-12తో చొలాన్ కయాన్పై నెగ్గి భారత్కు 5-0తో ఘన విజయాన్ని అందించాడు. బుధవారం చివరి గ్రూప్ పోరులో పద్నాలుగుసార్లు ఛాంపియన్ ఇండోనేషియాతో భారత్ తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నై, బెంగళూరు మధ్యలో వరుణ్!
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో కీలకంగా మారిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సజావుగా సాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్లేఆఫ్స్పై సన్రైజర్స్ గురి
బాదుడు మంత్రంతో.. దూకుడు ఆయుధంతో ఐపీఎల్-17వ సీజన్లో అసామాన్య ప్రదర్శనతో దూసుకెళ్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. -
రాజస్థాన్ మళ్లీ..
ప్చ్.. రాజస్థాన్! ప్లేఆఫ్స్లో స్థానం ఖరారైనా.. కీలక సమరాలకు ముందు పేలవ ఫామ్ ఆ జట్టును కలవరపెడుతోంది. -
నా జీవితంలో పల్లాలే ఎక్కువ
జీవితంలో ఎత్తుల కంటే పల్లాలే ఎక్కువ చూశానని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. -
నీరజ్దే పసిడి
మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడ్డ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణంతో మెరిశాడు. -
భారత్ను పాక్ ఓడించడం కష్టమే
టీ20 ప్రపంచకప్లో భారత్ను పాకిస్థాన్ ఓడించడం కష్టమేనని ఆ జట్టు మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ అభిప్రాయపడ్డాడు. -
సాత్విక్ ద్వయం శుభారంభం
థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్- చిరాగ్ జోడీ శుభారంభం చేసింది. -
‘లక్ష్య’ నందినికి స్వర్ణం
ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ అగసర నందిని సత్తాచాటింది. -
లామిచానె జైలుశిక్ష రద్దు
నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానెకు భారీ ఊరట. -
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు వినిపించడంపై సీఎస్కే జట్టు స్పందించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే