ఫైనల్లో శ్రీజ-స్నేహిత్‌

జాతీయ క్రీడల టేబుల్‌ టెన్నిస్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆకుల శ్రీజ, ఫిదేల్‌ స్నేహిత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో శ్రీజ-స్నేహిత్‌ 3-2తో ఆకాశ్‌ పాల్‌-ప్రాప్తి సేన్‌పై విజయం సాధించారు.

Published : 24 Sep 2022 03:15 IST

సూరత్‌: జాతీయ క్రీడల టేబుల్‌ టెన్నిస్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆకుల శ్రీజ, ఫిదేల్‌ స్నేహిత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో శ్రీజ-స్నేహిత్‌ 3-2తో ఆకాశ్‌ పాల్‌-ప్రాప్తి సేన్‌పై విజయం సాధించారు. తుది పోరులో మనుష్‌ షా-కృతిక రాయ్‌ (గుజరాత్‌)తో శ్రీజ ద్వయం తలపడనుంది. మహిళల సింగిల్స్‌లో శ్రీజ సెమీఫైనల్‌ చేరింది. క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ శ్రీజ 4-0తో అహిక ముఖర్జీని చిత్తు చేసింది. టాప్‌సీడ్‌ మనిక బత్రా 4-2తో సిన్హా రాయ్‌ను ఓడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని