కుల్దీప్ ఎంపికలో పక్షపాతమా?
టీమ్ఇండియాలో ఆశ్రిత పక్షపాతానికి చోటులేదని మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. సారథి విరాట్ కోహ్లీ సైతం వ్యక్తిగత కోణంలో ఆలోచించే రకం కాదని పేర్కొన్నారు. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో కుల్దీప్కు చోటివ్వకపోవడానికి కారణం మరేదైనా ఉంటుందని వెల్లడించారు.....
కోహ్లీ అలా ఆలోచించడన్న ఎమ్మెస్కే ప్రసాద్
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియాలో ఆశ్రిత పక్షపాతానికి చోటులేదని మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. సారథి విరాట్ కోహ్లీ సైతం వ్యక్తిగత కోణంలో ఆలోచించే రకం కాదని పేర్కొన్నారు. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో కుల్దీప్కు చోటివ్వకపోవడానికి కారణం మరేదైనా ఉంటుందని వెల్లడించారు.
మణికట్టు మాంత్రికుడు, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్కు చాలాకాలంగా జట్టులో చోటు దొరకడం లేదు. వాస్తవంగా రెండేళ్లుగా అతడు అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. ఐపీఎల్లోనూ వికెట్లేమీ తీయలేదు. టీమ్ఇండియాకు ఎంపిక చేస్తున్నప్పటికీ తుది జట్టులోకి తీసుకోవడం లేదు. ఆస్ట్రేలియా సిరీసులో సీనియర్లు లేనప్పటికీ అవకాశం దొరకలేదు. చెపాక్ టెస్టులోనూ అతడిని రిజర్వు బెంచీకే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
‘వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తావులేదు. విరాట్ సైతం అలా ఆలోచిస్తాడని అనుకోను. ఎంపికకు సంబంధించి కోహ్లీ, జట్టు యాజమాన్యానికి భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు. ఆసీస్తో ఆఖరి టెస్టులో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడాడు. బౌలింగ్ చేయగల అదనపు బ్యాట్స్మన్ అవసరమని వారు ఆలోచించారేమో’ అని ఎమ్మెస్కే అన్నారు.
‘నదీమ్ విషయానికి వస్తే శ్రీలంకలో ఎడమ చేతివాటం బౌలింగ్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారని గణాంకాలు చూపిస్తున్నాయి. ఆ సిరీస్లో వారు గెలిచినప్పటికీ ఎడమచేతి వాటం స్పిన్నర్లు ఎక్కువ వికెట్లు తీశారు. అందుకే జట్టు యాజమాన్యం నదీమ్కు ప్రాధాన్యం ఇచ్చుంటుంది. వ్యక్తిగతంగా కుల్దీప్ను ఎంపిక చేసేందుకే నేను ఓటేస్తాను. నదీమ్ జట్టులోకి ఎంపికయ్యేందుకు కారణం మాత్రం బహుశా ఇదే’ అని ప్రసాద్ తెలిపారు. రెండో టెస్టులో కుల్దీప్ను ఆడించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
ఇవీ చదవండి
అడగ్గానే నటరాజన్ను ఇచ్చారు
ఇదిగో.. ఈ యెటకారాలే వద్దనేది వాన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!