Tokyo olympics: నీరజ్ చోప్రా.. నీది అద్వితీయమైన విజయం
టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించి తన గెలుపుతో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.ఇది గొప్ప విజయం. ఇన్నాళ్ల భారతీయులు వేచి చూస్తున్న స్వర్ణ పతక నిరీక్షణకు తెరపడింది. - ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు
ట్విటర్లో వెల్లువెత్తున్న ప్రముఖల ప్రశంసలు
ఇంటర్నెట్డెస్క్: టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని దేశానికి అందించిన నీరజ్ చోప్రాకు ప్రముఖులు ప్రశంసలు తెలియజేస్తున్నారు. స్వత్రంత్ర భారత దేశంలో అథ్లెటిక్స్ విభాగంలో తొలి వ్యక్తిగత స్వర్ణం సాధించిన నీరజ్కు అభినందనలు చెబుతున్నారు. 2008లో షూటింగ్లో అభినవ్ బింద్రా తర్వాత పసిడి పతకం సాధించిన వీరుడిగానూ నీరజ్ కొత్త చరిత్ర సృష్టించాడు.
* నీరజ్ చోప్రా.. ఇది అద్వితీయమైన గెలుపు. స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించావు. తొలిసారి ఒలింపిక్స్లో పాల్గొని భారత్కు పసిడి పతకం తీసుకొచ్చిన నీ ప్రతిభ.. ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకం. భారతదేశం.. నీ విజయానికి సంతోషిస్తోంది. హృదయపూర్వక అభినందనలు - రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్
* టోక్యో ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించారు. ఈరోజు నీరజ్ చోప్రా స్వర్ణం గెలవడం చిరకాలం గుర్తుంటుంది. చాలా చక్కగా రాణించాడు. ఒక ప్యాషన్తో తనదైన శైలిలో ఆడిన నీరజ్కు నా అభినందనలు - ప్రధాని నరేంద్ర మోదీ
* టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించి తన గెలుపుతో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.ఇది గొప్ప విజయం. ఇన్నాళ్లు భారతీయులు వేచి చూస్తున్న స్వర్ణ పతక నిరీక్షణకు తెరపడింది. - ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు
* స్వర్ణం సాధించాలన్న దేశ ప్రజల కోరికను నువ్వు సాధించావ్ నీరజ్ చోప్రా. నీ విజయానికి నేను వంగి నమస్కరిస్తున్నా. పసిడి పతకాన్ని దేశానికి అందించినందుకు ధన్యవాదాలు. అలాగే గోల్డ్ క్లబ్కు వెల్కమ్. ఇలాంటి పతకాలు మరెన్నో తీసుకురావాలి. చాలా సంతోషంగా, గర్వంగానూ ఉంది - అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా
* జావెలిన్ త్రో.. పురుషుల విభాగంలో తొలి స్వర్ణ పతాకం సాధించిన నీరజ్ చోప్రాకు నా అభినందనలు. ఎన్నోరోజులుగా వేచి చూస్తున్న కల నిజమైన రోజు. నువ్వు చరిత్ర సృష్టించావు. ఈరోజు నీ విజయంతో కోట్లాది భారతీయుల్లో స్ఫూర్తి నింపావు - తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్
* జావెలిన్ త్రో పురుషుల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాకు కంగ్రాట్స్. భారతదేశం నిన్ను చూసి గర్విస్తుంది. - తెలంగాణ మంత్రి కేటీఆర్
* భారతదేశ చరిత్రలో చరిత్రాత్మక దినమిది.. అథ్లెటిక్స్ 100ఏళ్ల చరిత్రలో స్వర్ణ పతకం గెలుచుకున్నందుకు నా అభినందనలు - కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
* భారత్కు ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా తర్వాత స్వర్ణం అందించిన రెండో క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించడం హర్షణీయం. ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా భారత మువ్వన్నెల పతకానికి పసిడి కాంతులద్ది దేశ ప్రజలంతా గర్వించేలా చేశాడు. - బండి సంజయ్
* 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో స్వర్ణ పథకం గెలవలేకపోయామనే వెలితిని చోప్రా తీర్చాడు. జావెలిన్ త్రో ఆటలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి స్వర్ణ పథకాన్ని సాధించి అందరి మనసులను నీరజ్ గెలుచుకున్నాడు. - కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
* నీరజ్ చోప్రా.. నీ గెలుపుతో ఎనలేని సంతోషం కలిగించావు. స్వర్ణ పతకం గెలిచిన నిన్ను చూసి యావత్ భారతావని గర్విస్తోంది. - ఏపీ సీఎం జగన్
* టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించారు. భవిష్యత్తు ఆటగాళ్లకు చోప్రా స్ఫూర్తిగా నిలిచారు. నీరజ్ ప్రతిభ చూసి భారతదేశం గర్వపడుతోంది. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు, పథకాలు సాధించి దేశం మరింత గర్వించేలా చేయాలి. -చంద్రబాబు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం