Cricket News : గిల్కు విశ్రాంతి.. సూర్య ఫినిషర్గా రావాలన్న గంభీర్!
ఇంటర్నెట్ డెస్క్: ఆసీస్తో వన్డే సిరీస్ను నెగ్గడంతో చివరి మ్యాచ్కు గిల్కు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ఇండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. మరోవైపు వరుసగా రెండు మ్యాచుల్లోనూ అర్ధశతకాలు సాధించిన సూర్యకుమార్ను వరల్డ్ కప్లో ఫినిషర్గా వాడుకోవాలని గౌతమ్ గంభీర్ సూచించాడు. మరోవైపు కివీస్తో జరిగిన మ్యాచ్లో సోధిని రనౌట్ చేసినప్పటికీ.. బంగ్లా కెప్టెన్ వెనక్కి పిలిచిన సంఘటనపై సీనియర్ ఆటగాడు తమీమ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..
ఆ ఇద్దరికి రెస్ట్..
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో వరుసగా హాఫ్ సెంచరీ, సెంచరీ బాదిన శుభ్మన్ గిల్కు మూడో మ్యాచ్కు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ఇండియా మేనేజ్మెంట్ భావించింది. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు కాస్త విరామం ఇస్తే శారీరకంగా, మానసికంగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో బెంచ్కే పరిమితం చేయనుంది. దీంతో రాజ్కోట్ వేదికగా జరగనున్న మూడో మ్యాచ్కు అందుబాటులో ఉండడు. గిల్తోపాటు పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కూ రెస్ట్ ఇచ్చింది. వీరిద్దరూ నేరుగా గువాహటి చేరుకుని వరల్డ్ కప్ సన్నద్ధతలో పాల్గొంటారు.
ఆరు లేదా ఏడో స్థానంలో సూర్య ఆడాలి: గంభీర్
వరల్డ్ కప్లో సూర్య కీలక పాత్ర పోషిస్తాడని.. అయితే అతడిని ఫినిషర్గా వినియోగించుకోవాలని భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్కు రావడం వల్ల టీమ్కు చాలా ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డాడు. ‘‘సూర్య తుది జట్టులో ఉంటే తప్పకుండా లోయర్ ఆర్డర్లోనే పంపించాలి. అలాగే ఫైనల్ XI టీమ్లో ఎక్కువగా మార్పులు చేయకుండా ఉండాలి. 2011 ప్రపంచకప్లో తుది జట్టులో మార్పులు చాలా తక్కువగా చేశాం. ఆరంభంలో యూసఫ్ పఠాన్ ఐదారు మ్యాచ్లు ఆడితే.. సురేశ్ రైనా మిగతా వాటిల్లో ఆడాడు. అందుకే, సూర్యను తుది జట్టులోకి తీసుకుని ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్కు పంపాలి. అయితే, ఇక్కడ ఐదో స్థానంలో ఎవరు ఆడతారు? అనే ప్రశ్న వస్తుంది. దానికి రవీంద్ర జడేజా ఉన్నాడు. ఆరో స్థానంలో హార్దిక్ను ఆడించొచ్చు. సూర్యను మాత్రం ఫినిషర్గా చివరి 15 - 20 ఓవర్లలో క్రీజ్లోకి పంపిస్తే ఫలితం అద్భుతంగా ఉండొచ్చు’’ అని గంభీర్ తెలిపాడు.
సోధిని వెనక్కి పిలవడం సరైందిగా అనిపించలేదు: తమీమ్
న్యూజిలాండ్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో వన్డే సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనపై సీనియర్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కివీస్ బ్యాటర్ సోధి నాన్స్ట్రైకర్ రనౌట్ అయినా సరే కెప్టెన్ లిటన్ దాస్ వెనక్కి పిలవడం సరైన చర్య కాదని వ్యాఖ్యానించాడు. ‘‘సోధి అలా రనౌట్ కావడం ఎక్కడా తప్పుగా అనిపించలేదు. ఇప్పుడు అదొక రూల్. ఇలా ఎవరినైనా ఔట్ చేయొచ్చు. లేదా మన బ్యాటర్ పెవిలియన్కు చేరొచ్చు. ఇక్కడా ఎలాంటి హెచ్చరిక అవసరం లేదు. ఇది కూడా బౌల్డ్ అవుట్వంటిదే. అయితే, మా కెప్టెన్ మాత్రం ఇలా వికెట్ తీయకూడదని భావించి ఉంటాడు. అందుకే వెనక్కి పిలిచాడు. కానీ, అలా చేయడం సరైందిగా అనిపించడంలేదు’’ అని తమీమ్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
ఐపీఎల్ 2024 సీజన్ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?