ICC Rankings: ఐసీసీ ర్యాంకులు.. నాలుగో స్థానంలోకి శుభ్మన్ గిల్
విండీస్తో వన్డే సిరీస్, ఐర్లాండ్తో టీ20 సిరీసుల్లో రాణించడంతో భారత ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్లో (Team India) తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా (Team India) యువ ఆటగాడు శుభ్మన్ గిల్కు ఆసియా కప్ (Asia Cup 2023) ముందు ఉత్సాహాన్ని నింపే కబురును ఐసీసీ అందించింది. వన్డే ర్యాంకింగ్స్లో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని శుభ్మన్ గిల్ (Shubman Gill) 743 పాయింట్లతో నాలుగో ర్యాంక్ సాధించాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (880) ఉన్నారు. అదే విధంగా టీ20 ర్యాంకింగ్స్లో బుమ్రా ఏడు స్థానాలను మెరుగుపర్చుకుని 84వ ర్యాంకులోకి.. రవి బిష్ణోయ్ 17 స్థానాలు ఎగబాకి 65వ స్థానానికి చేరాడు. ఐర్లాండ్తో రెండో టీ20 మ్యాచ్లో అర్ధశతకం సాధించిన రుతురాజ్ గైక్వాడ్ ఏకంగా 143 స్థానాలు దూసుకొచ్చి 87వ ర్యాంక్ను అందుకోవడం గమనార్హం. ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడకపోయినా.. టీ20 ర్యాంకింగ్స్లో మాత్రం సూర్యకుమార్ (889 పాయింట్లు) అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.
మా ఆందోళనంతా పాండ్య ఫామ్పైనే.. కేఎల్ కోసం వెంకటేశ్ ప్రసాద్ ప్రత్యేక ప్రార్థనలు!
బౌలింగ్ జాబితా ప్రకారం.. టెస్టుల్లో టీమ్ఇండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ (879 పాయింట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. టాప్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (782 పాయింట్లు) రెండు స్థానాలను మెరుగుపర్చుకుని మూడో ర్యాంక్కు చేరాడు. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ (825) రెండో ర్యాంక్లో కొనసాగుతున్నాడు. వన్డేల్లో భారత్ తరఫున మహమ్మద్ సిరాజ్ (670) ఐదో ర్యాంక్, కుల్దీప్ యాదవ్ (622) పదో స్థానంలో ఉన్నారు. టీ20 బౌలింగ్ జాబితాలో మాత్రం ఒక్క టీమ్ఇండియా బౌలర్ కూడా టాప్-10లో స్థానం సంపాదించలేకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.