Suryakumar yadav: సచిన్ వీడియో.. సూర్యకుమార్ సరదా కామెంట్
ఇన్స్టాగ్రామ్లో సచిన్ పోస్ట్ చేసిన వీడియోకు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) సరదా కామెంట్ చేశాడు.
దిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్(Sachin Tendulkar) పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. తన కెరీర్ను నిర్మించడంలో తన శ్రీమతి ఎంతటి కీలక పాత్ర పోషించిందో తెలుపుతూ సచిన్ ఎన్నో వేదికలపై ఆమెను కొనియాడాడు. వైద్యవిద్యలో గోల్డ్ మెడల్ సాధించిన అంజలి(Anjali Tendulkar) తన కోసం, పిల్లల కోసం ఆమె భవిష్యత్తును సైతం వదులుకుందంటూ ఆమెపై తన ఆరాధనా భావాన్ని వ్యక్తం చేశాడు.‘‘నేను ఏదైనా పర్యటనల కోసం వెళ్లాల్సి వస్తే అర్జున్, సారాను ఎవరు చూసుకుంటారనే దిగులు ఉండేది. కానీ, నా భార్య తన కెరీర్ను కుటుంబం కోసం త్యాగం చేసింది. తను లేకపోతే నేను కచ్చితంగా ఈ స్థాయిని అందుకునేవాడిని కాదు’’ అంటూ సచిన్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపాడు. ఇదిలా ఉంటే గురువారం ఈ జంట సరదాగా పోస్ట్ చేసిన ఓ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్(Suryakumar Yadav) ఈ వీడియోపై ఓ సరదా కామెంట్ చేశాడు.
‘‘ఎప్పుడు ఎవరిని కలవాల్సి వస్తుందో తెలుసుకోలేం’’ అని రాసి ఉన్న ప్లేట్ను సచిన్ చూపుతుండగా అందుకు అంజలి ఓ చిరునవ్వును విసురుతుంది. ఈ వీడియోకు రెండు మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. క్రికెటర్లు యువరాజ్సింగ్, సురేశ్ రైనాలు ఈ పోస్ట్కు లవ్ గుర్తును కామెంట్ చేశారు. మిస్టర్ 360 ఈ వీడియోపై స్పందిస్తూ.. ‘‘నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి వచ్చిన స్పందన అద్భుతంగా ఉంది’’ అంటూ ఎమోజీని జతచేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
-
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!