ఇచ్ఛా మరణం!
కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి బాణాలకు భీష్ముడు నేల కొరిగినా, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాకే మరణించాడు. తండ్రి ఇచ్చిన ‘ఇచ్ఛా మరణ వరం’ ప్రభావంతో తాను కోరుకున్నప్పుడే కన్నుమూశాడు.
కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి బాణాలకు భీష్ముడు నేల కొరిగినా, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాకే మరణించాడు. తండ్రి ఇచ్చిన ‘ఇచ్ఛా మరణ వరం’ ప్రభావంతో తాను కోరుకున్నప్పుడే కన్నుమూశాడు. మహా భారతంలో వర్ణితమైన ఇది వాస్తవమైతే? అంటే మరణమనేది ఒక ఐచ్ఛికమై.. కోరుకున్నప్పుడే చనిపోతే? మొత్తంగా వృద్ధాప్య ప్రక్రియనే వెనక్కి తిప్పగలిగితే? ఇది అసాధ్యమేమీ కాదని జోస్ లూయిస్ కార్డీరో, డేవిడ్ వుడో అనే జనెటిక్ ఇంజినీర్లు చెబుతున్నారు. అమరత్వం వాస్తవ రూపం ధరిస్తుందని, ఇది శాస్త్రీయంగా సాధ్యమేనని తమ తాజా పుస్తకం ‘ద డెత్ ఆఫ్ డెత్’లో పేర్కొంటున్నారు. ఊహించిన దాని కన్నా ముందుగానే.. మరో 27 ఏళ్లలోనే సాకారమయ్యే అవకాశముందనీ వివరిస్తున్నారు. ఇది కేవలం ఊహేనా? శాస్త్రీయ ఆధారాలేవైనా ఉన్నాయా?
అమరత్వం! మరణం లేని జీవనం!! వినటానికిది సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా వృద్ధాప్య ప్రక్రియను వెనక్కి తిప్పటం అసాధ్యమేమీ కాదని, దీన్ని సాధించే రోజులు మరెంతో దూరంలో లేవన్నది కార్డీరో నమ్మకం. మనిషి 2045 కల్లా కేవలం ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల మూలంగానే చనిపోతాడని ఆయన అభిప్రాయపడుతున్నారు. వృద్ధాప్యమనేది శరీరానికి సంబంధించి ‘టెక్నికల్’ సమస్యని, దీన్ని పరిష్కరించటం సాధ్యమేనన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. ఇది నమ్మలేని నిజంగా అనిపించినా మనిషి జీవనకాలం క్రమంగా పెరుగుతూ వస్తున్నమాట నిజం. మనిషి ప్రపంచ సగటు జీవనకాలం 1800లో 30 ఏళ్లు కాగా.. ఇది 2000లో 67 ఏళ్లకు ఎగబాకింది. కొన్ని దేశాల్లోనైతే 75 ఏళ్లనూ మించిపోయింది. వైద్యరంగంలో సాధించిన పురోగతి, ఆహార అలవాట్లు మెరుగవటం, హానికర అలవాట్లపై పెరిగిన అవగాహన వంటివి ఆయుష్షు పెరగటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇది మున్ముందు మరింత పెరుగుతుందనటం అతిశయోక్తి కాదు. అయితే ఎంతవరకు జీవనకాలం పెరుగుతుందన్నదే ప్రశ్న. దీన్ని వీలైనంత పొడిగించాలన్నదే శాస్త్రవేత్తల ప్రయత్నం. ఈ దిశగా ఇప్పటికే అడుగులు పడ్డాయి. శరవేగంగా దూసుకెళ్తున్న శాస్త్ర, సాంకేతిక పురోగతి.. నానో టెక్నాలజీ అద్భుతాలు.. వినూత్న జన్యు సవరణ పద్ధతుల వంటివి దీన్ని సుగమం చేయనున్నాయి. ‘చెడు’ జన్యువులను తిరిగి ఆరోగ్యకరమైనవిగా మార్చటం, శరీరంలోంచి మృత కణాలను బయటకు పంపిచెయ్యటం, దెబ్బతిన్న కణాల మరమ్మతు, మూల కణాల చికిత్స, కీలక అవయవాల 3డీ ముద్రణ వంటి పరిజ్ఞానాలు అమరత్వ సాధనలో ఆశా కిరణాలుగా కనిపిస్తున్నాయి. అయితే ముందుగా వృద్ధాప్యాన్ని ‘జబ్బు’గా గుర్తించటం కీలకమని, అప్పుడే దీన్ని ‘నయం’ చేయటానికి అవసరమైన పరిశోధనల కోసం పెద్దఎత్తున నిధులు సమకూరుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
అసలు వృద్ధాప్యం ఎందుకు?
వృద్ధాప్యం ఎలా, ఎందుకు వస్తుందన్న దానిపై సార్వత్రిక ఆమోదయోగ్య సిద్ధాంతమేదీ లేదు. దీనిపై రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు- కాలం గడుస్తున్నకొద్దీ, వాడుతున్నకొద్దీ కారు పాత బడినట్టు వృద్ధాప్యం వస్తుందన్నది కొందరి అభిప్రాయం. కారుకు తుప్పు పడుతుంది, నట్లు వదులవుతాయి. ప్రాణుల్లోనూ కణస్థాయిలో ఇలాగే జరుగుతుందని, వృద్ధాప్యమనేది పురాతన సహజ సిద్ధ ప్రక్రియని భావిస్తుంటారు. పరిణామక్రమంలో వృద్ధ జీవులు మరణించి, కొత్త జీవుల ఎదుగుదలకు అవకాశం కల్పించాయని.. ఇలా జాతుల మనుగడను ముందుకు తీసుకెళ్లటానికి మార్గం సుగమమైందని నమ్ముతుంటారు. కార్డీరో దీన్ని కొట్టిపారేస్తారు. కొన్ని కణాలు, ప్రాణులకు వృద్ధాప్యం ఎందుకు రావటం లేదు? అవి ఎలా తప్పించుకోగలుగుతున్నాయి? అనేది తెలుసుకొని, వాటిని ‘కాపీ’ చేయగలిగితే మరణాన్ని జయించటం అసాధ్యమేమీ కాదన్నది ఆయన వాదన.
శాస్త్ర పురోగతి వేగం
ప్రతి 18 నెలలకు కంప్యూటింగ్ శక్తి రెట్టింపు అవుతుందని మూర్స్ సిద్ధాంతం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో కంప్యూటర్ టెక్నాలజీ, క్రిస్ప్ఆర్-కాస్ 9 వంటి రంగాల్లో శరవేగంగా సాగుతున్న పురోగతీ మరణాన్ని జయించే ప్రయత్నాలను మరింత వేగం చేస్తున్నాయి. అనుకున్న దాని కన్నా ఇంకాస్త ముందుగానే దీన్ని సాధించే ఆశలకు జీవం పోస్తున్నాయి.
క్యాన్సర్కు సాధ్యమైంది మనకెందుకు కాదు
మన శరీరంలోని చాలా కణాలు చనిపోతాయి. కానీ అండాలు, శుక్రకణాలను పుట్టించే బీజకణాల వంటి వాటికి వృద్ధాప్యం రాదు. ఇతర శరీర కణాలకు (సోమాటిక్ సెల్స్) వృద్ధాప్యం వస్తుంది. అయితే ఇవి జన్యుపరంగా మారిపోయి, క్యాన్సర్గా మారితే వాటికి ‘అమరత్వం’ వచ్చేస్తుంది. మరణించకుండా వృద్ధి చెందుతుంటాయి. ఈ విద్యను క్యాన్సర్ నేర్చుకున్నప్పుడు మనకెందుకు సాధ్యం కాదన్నది శాస్త్రవేత్తల భావన. చాలామందికి తెలియకపోవచ్చు గానీ క్యాన్సర్ కణాలు మరణించవనే సంగతిని 1951లోనే గుర్తించారు. అప్పట్లో హెనిరియెటా ల్యాక్స్ అనే ఆమె గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో మరణించారు. ఆమెకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు కణితిని తొలగించి, భద్రపరిచారు. దీనిలోని కణాలు ఇప్పటికీ ‘జీవించి’ ఉండటం గమనార్హం.
జంతువులపై పరిశోధనలు
జంతువుల్లో జీవనకాలాన్ని పొడిగించటానికి గత దశాబ్దం నుంచీ జరుగుతున్న అధ్యయనాలూ కొత్త ఆశలను రేపుతున్నాయి. కొన్ని ఎలుకల్లో ఆయుష్షును రెట్టింపు చేయగలిగారు. కొన్ని ఈగల్లో జీవనకాలం నాలుగు రెట్లు పెంచగలిగితే, కొన్ని వానపాముల్లో 10 రెట్లు పెంచగలిగారు. మెతుసెలా రకం వానపాములైతే మనుషుల వెయ్యేళ్ల జీవనకాలంతో సమానమైన ఆయుష్షుకు చేరుకున్నాయి కూడా. మనుషుల్లో ఇలాంటి ప్రయత్నమేదీ జరగలేదు. కానీ కొన్ని కణాలను మాత్రం పునరుత్తేజితం చేయగలిగారు. జపాన్ శాస్త్రవేత్త షిన్యా యమనక 2012 నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఆయన బృందం చర్మకణాలను పునరుత్తేజితం చేయొచ్చని నిరూపించింది. ఇప్పుడాయన కళ్ల మీద దృష్టి సారించారు. ఇవి మిగతా అవయవాల కన్నా చిన్నవి. శరీరంలోని భాగాలతో పెద్దగా అనుసంధానమై ఉండవు. ఎలుకల్లో, కోతుల్లో కళ్లను పునరుత్తేజితం చేయటంలో పురోగతి సాధించారు. ఇప్పుడు మనుషుల మీద పరీక్షలు ఆరంభించారు.
ప్రకృతే ఆదర్శం
‘మనమంతా మరణిస్తాం. మరణం అనివార్యం.’ ఇది మానవ జాతి మొదటి నుంచీ నమ్ముతున్న భావన. దీన్ని మార్చుకోవాల్సిన అవసరముందన్నదీ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఎందుకంటే జీవితానికే కాదు, అమరత్వానికీ ప్రకృతే మనకు ఆదర్శం. బ్యాక్టీరియా, కొన్నిరకాల హైడ్రా, కొన్నిరకాల జెల్లీఫిష్ల వంటి ప్రాణులు మరణించకుండా ఎల్లకాలం జీవిస్తూనే ఉంటాయి. వీటికి వృద్ధాప్యం రాదు. ఇతర జీవులు వాటిపై దాడి చేయకపోతే, ప్రమాదాల బారినపడకపోతే అలా జీవించే ఉంటాయి. మన భూమి మీద అత్యంత పురాతన ప్రాణి బ్యాక్టీరియానే. అంటే ఒకరకంగా భూమి మీద జీవం ‘బిల్టిన్’గా వృద్ధాప్య ప్రక్రియ లేకుండానే పుట్టిందన్నమాట. మరణం లేని జెల్లీఫిష్గా పిలుచుకునే ‘టురిటాప్సిస్ డోహ్ర్నీ’ దీనికి మంచి ఉదాహరణ. దీని జన్యుక్రమాన్ని శాస్త్రవేత్తలు గత సంవత్సరం క్రోడీకరించారు. చిటికెన వేలు గోరు కన్నా చిన్నగా ఉండే దీనికి జీవనకాలాన్ని వెనక్కి తిప్పుకోగల సామర్థ్యం ఉండటం విశేషం. శారీరకంగా దెబ్బతిన్నప్పుడు, లేదా తిండి దొరక్కపోవటం వంటి స్థితి ఎదురైనప్పుడు ఇది తనలోకి తానుగా కుంచించుకుపోతుంది. కాళ్లలాంటి టెంటకిల్స్ను లోపలికి శోషించుకుంటుంది. నీటిలో ఈదే శక్తినీ కోల్పోతుంది. అప్పుడది చిన్న తిత్తి మాదిరిగా ఏర్పడి, సముద్రం అడుగున స్థిరపడుతుంది. కేవలం 36 గంటల్లోనే తిరిగి కొత్త శరీరాన్ని ఏర్పరచుకుంటుంది. ఇలాంటి ప్రాణులు వృద్ధాప్యాన్ని ఎలా జయిస్తున్నాయనే దానిపై శాస్త్రవేత్తలు నిశితంగా అధ్యయనం చేస్తున్నారు. త్వరలోనే వీటి రహస్యాన్ని ఛేదించగలమనీ ఆశిస్తున్నారు. అమరత్వ ఛాయలు మన శరీరంలోనూ కనిపిస్తాయి. కొన్ని కణాలు కాలం చెల్లినా మరణించకపోవటమే దీనికి నిదర్శనం.
చికిత్సల దన్ను
క్రోమోజోమ్ల చివర్లో తోకల వంటి భాగాలు (టెలోమేర్స్) ఉంటాయి. వయసు మీద పడుతున్నకొద్దీ ఇవి దెబ్బతింటూ వస్తాయి, పొట్టిగా అవుతుంటాయి. వీటిని తిరిగి పొడవుగా చేయగలిగితే వృద్ధాప్యాన్ని వెనక్కి మళ్లించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. చాలా ప్రమాదకరం, అక్రమమే అయినా రెండేళ్ల క్రితం నుంచే తమ చికిత్సను ఆరంభించామని కార్డీరో, వుడ్ చెబుతున్నారు. జన్యు మార్పిడి విషయంలో తక్కువ నిబంధనలు గల కొలంబియాలో వృద్ధాప్య ఛాయలు కనిపించిన ఒకరికి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతానికైతే చికిత్స బాగానే నడుస్తోందని, పెద్దగా దుష్ప్రభావాలేవీ కనిపించలేదని వివరిస్తున్నారు. ఆమె రక్తంలోని టెలోమేర్స్ పొడవు 20 ఏళ్ల కిందటి స్థాయికి చేరుకోవటం గమనార్హం. వృద్ధాప్యాన్ని ఆపే ఇలాంటి చికిత్సలు మొదట్లో ఖరీదే కావొచ్చు. కానీ అందరికీ అందుబాటులోకి వస్తే చవకగా అవుతాయి.
ప్రముఖ సంస్థలూ బరిలోకి
మరో పదేళ్లలో క్యాన్సర్ల వంటి జబ్బులు నయమయ్యే స్థితికి చేరుకోవచ్చని కార్డీరో భావిస్తున్నారు. ఎందుకంటే గూగుల్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలూ వైద్యరంగంలోకి అడుగిడుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పటికే క్రయోప్రిజర్వేషన్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో క్యాన్సర్ను పూర్తిగా నయం చేసే పద్ధతుల కోసం అన్వేషిస్తున్నారు.
జనాభా పెరగదా?
అమరత్వంతో భూమ్మీద జనాభా పెరుగుతుందని భయపడాల్సిన అవసరమేమీ లేదు. ఇంకా ఎక్కువమంది జీవించటానికి భూమ్మీద చోటు ఉంది. గత శతాబ్దాలతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ సంతానాన్ని ఎవరూ కనటం లేదు. పైగా భవిష్యత్తులో అంతరిక్షంలో జీవించే అవకాశమూ ఉండొచ్చు. సంతానాన్ని కనొద్దనే జపాన్, కొరియా ధోరణి ఇలాగే కొనసాగితే రెండు శతాబ్దాల్లో వారి జనాభా అంతరించటం ఖాయం. కానీ అదృష్టం కొద్దీ కొత్త పద్దతుల సాయంతో జపానీయులు, కొరియన్లు ‘శాశ్వతంగా’ జీవించే అవకాశం లేకపోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వచ్ఛ ఒలింపిక్స్
ఒలింపిక్ క్రీడలకు పారిస్ నగరం సమాయత్తమైంది. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులు, క్రీడాభిమానులతో విశ్వ నగరం కొత్త శోభలు సంతరించుకుంటోంది. -
వినూత్న ఫొటోనిక్స్
ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎలక్ట్రాన్ల పాత్ర కీలకం. ఇవి ఒక చోటు నుంచి మరో చోటుకు డేటాను చేరవేయటం వంటి దగ్గరి దారులకు బాగా ఉపయోగపడతాయి. -
1పాస్వర్డ్ మారింది
పలు కొత ఫీచర్లతో 1పాస్వర్డ్ భారీగా అప్డేట్ అయ్యింది. మాస్టర్ పాస్వర్డ్ను మరిచిపోయినా అకౌంట్ను రికవరీ చేసుకునే వెలుసుబాటూ కల్పించింది. -
నవ్వు శాస్త్రం
నవ్వటం ఒక భోగం! అతిశయోక్తిలా అనిపించినా ఇది నిజం. ఇప్పుడు చాలామంది జీవితాల్లో నవ్వటమనేది కనుమరుగవుతోంది. రోజుకు ఒక్కసారైనా నవ్వనివారు ఎందరో. -
ఎక్కువ సిమ్లు తీసుకున్నారా?
నేటి డిజిటల్ ప్రపంచంలో ఒక్క సిమ్ కార్డు సరిపోవటం లేదు. ఆఫీసు వ్యవహారాలకు ఒకటి, సొంత పనులకు ఒకటి, కుటుంబ పనులకు మరోటి.. ఇలా బోలెడన్ని సిమ్లు ఎడాపెడా తీసేసుకుంటున్నారు. -
ఆన్లైన్ నేరాల మీద చక్షువు
నేటి డిజిటల్ ప్రపంచంలో ఆన్లైన్ నేరాలు పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు రకరకాల పద్ధతుల్లో అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు దోచుకుంటున్నారు. -
మనిషిలా మరమనుషులు!
విచిత్రమైన రోబోల గురించి చాలానే విని ఉంటారు. ఇవి రోజురోజుకీ ఇంకా వినూత్నంగానూ మారుతున్నాయి. వీటికి మనిషి మెదడును జోడించాలని కొందరు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటే.. మనుషుల్లా కనిపించేలా సజీవ చర్మాన్ని జత చేయాలని ఇంకొందరు కృషి చేస్తున్నారు. -
సూపర్ పరిజ్ఞానాలు
సాంకేతిక పరిజ్ఞాన (టెక్నాలజీ) రంగం శరవేగంగా సాగుతోంది. నిన్నటి పద్ధతులు నేడు పాత పడిపోతున్నాయి. వాటి స్థానంలో వినూత్న పరిజ్ఞానాలు వచ్చి చేరుతున్నాయి. -
ఏఐ సాయంతో ఉద్యోగం!
కృత్రిమ మేధ (ఏఐ) మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తుందని, దీని మూలంగా ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వెల్లువెత్తటం చూస్తున్నదే. -
ఏఐ సోషల్ లోకం!
సామాజిక మాధ్యమ ప్రియులకు శుభవార్త. మరో వినూత్న సోషల్ మీడియా యాప్ ఆరంభమైంది. దీని పేరు బటర్ఫ్లయిస్. మామూలు యూజర్లతోనే కాకుండా కృత్రిమ మేధ(ఏఐ)తో సృష్టించుకున్న పాత్రలతోనూ సంభాషణలు జరపటానికి వీలు కల్పించటం దీని ప్రత్యేకత. -
గ్రహాంతర జీవులు మనమధ్యే!
గ్రహాంతర జీవుల మీద మన ఆసక్తి ఈనాటిది కాదు. వీరి కోసం చాలాకాలంగా అన్వేషిస్తున్నాం. కానీ ఇంతవరకూ కచ్చితమైన జాడేదీ కనిపించలేదు. విశ్వంలో మనలాంటి వాళ్లు ఉన్నారని కొందరు, లేరని మరికొందరు శాస్త్రవేత్తలు వాదిస్తూనే వస్తున్నారు. -
విద్యుత్తు మోటారు ఎలా తిరుగుతుంది?
విద్యుత్తుతో పనిచేసే ఫ్యాన్లు, మిక్సీల వంటి వాటిని రోజూ వాడుతూనే ఉంటాం. వీటిల్లోని మోటార్లు ఎలా పనిచేస్తాయో తెలుసా? ఈ మోటార్లు విద్యుత్తును చలనశక్తిగా మారుస్తాయి. -
యాపిల్ ఏఐ శకం
యాపిల్ సంస్థ కృత్రిమ మేధ (ఏఐ) దిశగా తొలి అడుగులు వేసింది. ఏటా నిర్వహించే వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో ఈసారి దీనికి పెద్ద పీట వేసింది. యాపిల్ ఇంటెలిజెన్స్ పేరిట సొంత ఏఐ పరిజ్ఞానాన్ని పరిచయం చేయటంతో పాటు డిజిటల్ అసిస్టెంట్ అయిన సిరికి సైతం ఏఐ సొబగులు అద్దింది. -
నవ మాయా దర్పణం
మీరు ఓ మాయా దర్పణాన్ని చూస్తున్నారని ఊహించుకోండి. అందులో ఎక్కడో దూరంగా ఉన్న తండ్రి ప్రత్యక్షమయ్యారు. ఆయనను ఆ గదిలోనే నిజంగా చూస్తున్నట్టే అనిపించింది. కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలక బోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో. -
పదార్థాలు చెడకుండా..
ఆహార పదార్థాలు ఇప్పుడు ఒక ప్రాంతానికే పరిమితం కావటం లేదు. సాగరాలు దాటుకొని దేశదేశాలకూ విస్తరిస్తున్నాయి. అయితే కూరగాయలు, పండ్లు, మాంసం వంటివి త్వరగా చెడిపోవటం పెద్ద సమస్య. దీన్ని అధిగమించటానికి ఆహార నిల్వ పద్ధతులు ఎంతగానో తోడ్పడు తున్నాయి. -
ఫైళ్ల అంశాలు ప్రివ్యూలో
డెస్క్టాపో, ల్యాప్టాపో.. ఏదైనా పీసీలో బోలెడన్ని ఫైళ్లు. రోజూ కొత్తవి ఎన్నో వచ్చి చేరుతుంటాయి. కొన్నిసార్లు పేర్లనూ మరచిపోతుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని వెతికి పట్టుకోవటమంటే మాటలు కాదు. -
వాతావరణ మార్పును వింటారా?
డేటా అనగానే అంకెలు, గ్రాఫ్లే గుర్తుకొస్తాయి. దీన్ని సంగీతంగా మారిస్తే? జపాన్ శాస్త్రవేత్త హిటోరీ నగాయ్ అలాంటి విచిత్రమే చేసి చూపించారు. అర్కిటిక్, అంటార్కిటికా నుంచి 30 ఏళ్లుగా ఉపగ్రహాలు సేకరించిన వాతావరణ సమాచారాన్ని ఆరు నిమిషాల పాటగా మార్చారు. -
ఫోన్ భద్రంగా..
స్మార్ట్ఫోన్లు ఇప్పుడు వ్యక్తిగత ఆస్తులు! పాస్వర్డ్లు, ఈమెయిళ్లు, బ్యాంకు వివరాల వంటి విలువైన సమాచారం మొత్తం వీటిల్లోనే స్టోర్ చేసుకుంటున్నాం మరి. ఇంతటి కీలకమైన ఫోన్లను భద్రంగా కాపాడుకోవద్దూ! -
కార్చిచ్చు కహానీ!
ప్రకృతి విపత్తులనగానే వరదలు, తుపాన్లు, కరవులు, సుడిగుండాల వంటివే గుర్తుకొస్తాయి. కానీ అడవులు మండటమూ తక్కువేమీ కాదు. ఇటీవల మన దగ్గర శేషాచలం అడవుల్లో, ఉత్తరాఖండ్లో కార్చిచ్చు రేగటం తెలిసిందే. -
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే