E-Waste: ఈ-వ్యర్థాల నియంత్రణ దిశగా భారత్ అడుగులు!
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల నియంత్రణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లో అమ్ముడయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ఒకే విధమైన ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చేందుకు కంపెనీలు అంగీకారం తెలిపాయి. ఇది ఈ-వ్యర్థాల నియంత్రణ దిశగా భారత్ అడుగులు వేస్తుందనేందుకు నిదర్శనం.
ఇంటర్నెట్ డెస్క్: సాంకేతికతలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్ఫోన్, స్మార్ట్వాచ్, ఇయర్ఫోన్స్, స్మార్ట్ స్పీకర్స్, కంప్యూటర్లు, గేమింగ్ డివైజ్లు.. ఇలా ఎన్నో ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి. మరి, పాత ఉత్పత్తులను ఏం చేస్తున్నారనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఈ పరిస్థితిపై భారత్ సహా ఇతర ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకు మీ వద్ద స్మార్ట్ఫోన్, ట్యాబ్, స్మార్ట్వాచ్ ఉన్నాయి. వీటి మూడింటికి వేర్వేరు ఛార్జర్లు ఉంటాయి. వీటి స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేస్తే, పాత డివైజ్ల ఛార్జింగ్ కేబుల్, అడాప్టర్ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వేస్ట్)గా మారిపోయినట్లే. దాంతోపాటు పాత ఫోన్, ట్యాబ్ను ఎలా? ఎక్కడ? పారేస్తారనేది కూడా ఆందోళనకరం.
మొబైల్ వ్యర్థాలే అధికం
తాజా నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 50 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పోగవుతుండగా, భారత్లో రెండు మిలియన్ టన్నులు ఉన్నట్లు సమాచారం. వీటిలో అధికంగా మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లతోపాటు వాటి యాక్ససరీలు ఉంటున్నాయట. అందుకే భారత్ సహా యూరోపియన్ యూనియన్, ఫోన్, కంప్యూటర్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ఒకేరకమైన ఛార్జింగ్ పోర్ట్ను అమర్చాలని కంపెనీలకు సూచించాయి. ఈ క్రమంలో భారత వినియోగదారుల మంత్రిత్వ శాఖ కొద్దిరోజుల క్రితం ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఇందులో స్మార్ట్ఫోన్తోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ఒకే విధమైన ఛార్జర్ ఇచ్చేందుకు కంపెనీలు అంగీకరించినట్లు సమాచారం. దీనిని దశల వారీగా అమలుచేయనున్నారు.
యాపిల్, శాంసంగ్ బాటలోనే
ఎలక్ట్రానిక్ వ్యర్థాల నియంత్రణలో భాగంగా యాపిల్ భవిష్యత్తులో విడుదల చేయబోయే ఉత్పత్తులకు, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఛార్జింగ్ కోసం యాపిల్ లైటెనింగ్ పోర్ట్ను ఇస్తోంది. వచ్చే ఏడాది విడుదల చేయబోయే ఫోన్లలో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ను ఇవ్వనుందట. పర్యావరణ పరిరక్షణ కోసం యాపిల్, శాంసంగ్ వంటి కంపెనీలు కొత్త ఫోన్తో పాటు ఛార్జింగ్ అడాప్టర్ ఇవ్వడంలేదు. తాజాగా, వన్ప్లస్, ఒప్పో కంపెనీలు సైతం ఫోన్ బాక్స్లో ఛార్జింగ్ అడాప్టర్లు ఇవ్వకూడదని నిర్ణయించాయి. యూజర్లు తమ పాత ఫోన్లకు ఉండే అడాప్టర్లతోనే కొత్త ఫోన్లను ఛార్జ్ చేసుకోమని సూచిస్తున్నాయి.
భారత్ ఏమంటోంది
గతేడాది గ్లాస్గోలో జరిగిన జి20 దేశాల సదస్సులో ఎలక్ట్రానిక్ వ్యర్థాల కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. 2030 నాటికి భారత్ 50 శాతం ఈ-వేస్ట్, ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించుకుంటుందని ప్రకటించారు. తాజాగా బాలిలో జరిగిన జి20 సదస్సులో ప్రధాని మోదీ మరోసారి ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రానిక్ కంపెనీలు సైతం ఒకే రకమైన ఛార్జర్ ఇచ్చే విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మరోవైపు భారత్లో అమ్ముడయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ఒకే విధమైన ఛార్జింగ్ పోర్ట్ను ఇచ్చేందుకు కంపెనీలు అంగీకరించడం, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించుకునే దిశగా భారత్ అడుగులు వేస్తుందనేందుకు నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వచ్ఛ ఒలింపిక్స్
ఒలింపిక్ క్రీడలకు పారిస్ నగరం సమాయత్తమైంది. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులు, క్రీడాభిమానులతో విశ్వ నగరం కొత్త శోభలు సంతరించుకుంటోంది. -
వినూత్న ఫొటోనిక్స్
ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎలక్ట్రాన్ల పాత్ర కీలకం. ఇవి ఒక చోటు నుంచి మరో చోటుకు డేటాను చేరవేయటం వంటి దగ్గరి దారులకు బాగా ఉపయోగపడతాయి. -
1పాస్వర్డ్ మారింది
పలు కొత ఫీచర్లతో 1పాస్వర్డ్ భారీగా అప్డేట్ అయ్యింది. మాస్టర్ పాస్వర్డ్ను మరిచిపోయినా అకౌంట్ను రికవరీ చేసుకునే వెలుసుబాటూ కల్పించింది. -
నవ్వు శాస్త్రం
నవ్వటం ఒక భోగం! అతిశయోక్తిలా అనిపించినా ఇది నిజం. ఇప్పుడు చాలామంది జీవితాల్లో నవ్వటమనేది కనుమరుగవుతోంది. రోజుకు ఒక్కసారైనా నవ్వనివారు ఎందరో. -
ఎక్కువ సిమ్లు తీసుకున్నారా?
నేటి డిజిటల్ ప్రపంచంలో ఒక్క సిమ్ కార్డు సరిపోవటం లేదు. ఆఫీసు వ్యవహారాలకు ఒకటి, సొంత పనులకు ఒకటి, కుటుంబ పనులకు మరోటి.. ఇలా బోలెడన్ని సిమ్లు ఎడాపెడా తీసేసుకుంటున్నారు. -
ఆన్లైన్ నేరాల మీద చక్షువు
నేటి డిజిటల్ ప్రపంచంలో ఆన్లైన్ నేరాలు పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు రకరకాల పద్ధతుల్లో అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు దోచుకుంటున్నారు. -
మనిషిలా మరమనుషులు!
విచిత్రమైన రోబోల గురించి చాలానే విని ఉంటారు. ఇవి రోజురోజుకీ ఇంకా వినూత్నంగానూ మారుతున్నాయి. వీటికి మనిషి మెదడును జోడించాలని కొందరు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటే.. మనుషుల్లా కనిపించేలా సజీవ చర్మాన్ని జత చేయాలని ఇంకొందరు కృషి చేస్తున్నారు. -
సూపర్ పరిజ్ఞానాలు
సాంకేతిక పరిజ్ఞాన (టెక్నాలజీ) రంగం శరవేగంగా సాగుతోంది. నిన్నటి పద్ధతులు నేడు పాత పడిపోతున్నాయి. వాటి స్థానంలో వినూత్న పరిజ్ఞానాలు వచ్చి చేరుతున్నాయి. -
ఏఐ సాయంతో ఉద్యోగం!
కృత్రిమ మేధ (ఏఐ) మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తుందని, దీని మూలంగా ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వెల్లువెత్తటం చూస్తున్నదే. -
ఏఐ సోషల్ లోకం!
సామాజిక మాధ్యమ ప్రియులకు శుభవార్త. మరో వినూత్న సోషల్ మీడియా యాప్ ఆరంభమైంది. దీని పేరు బటర్ఫ్లయిస్. మామూలు యూజర్లతోనే కాకుండా కృత్రిమ మేధ(ఏఐ)తో సృష్టించుకున్న పాత్రలతోనూ సంభాషణలు జరపటానికి వీలు కల్పించటం దీని ప్రత్యేకత. -
గ్రహాంతర జీవులు మనమధ్యే!
గ్రహాంతర జీవుల మీద మన ఆసక్తి ఈనాటిది కాదు. వీరి కోసం చాలాకాలంగా అన్వేషిస్తున్నాం. కానీ ఇంతవరకూ కచ్చితమైన జాడేదీ కనిపించలేదు. విశ్వంలో మనలాంటి వాళ్లు ఉన్నారని కొందరు, లేరని మరికొందరు శాస్త్రవేత్తలు వాదిస్తూనే వస్తున్నారు. -
విద్యుత్తు మోటారు ఎలా తిరుగుతుంది?
విద్యుత్తుతో పనిచేసే ఫ్యాన్లు, మిక్సీల వంటి వాటిని రోజూ వాడుతూనే ఉంటాం. వీటిల్లోని మోటార్లు ఎలా పనిచేస్తాయో తెలుసా? ఈ మోటార్లు విద్యుత్తును చలనశక్తిగా మారుస్తాయి. -
యాపిల్ ఏఐ శకం
యాపిల్ సంస్థ కృత్రిమ మేధ (ఏఐ) దిశగా తొలి అడుగులు వేసింది. ఏటా నిర్వహించే వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో ఈసారి దీనికి పెద్ద పీట వేసింది. యాపిల్ ఇంటెలిజెన్స్ పేరిట సొంత ఏఐ పరిజ్ఞానాన్ని పరిచయం చేయటంతో పాటు డిజిటల్ అసిస్టెంట్ అయిన సిరికి సైతం ఏఐ సొబగులు అద్దింది. -
నవ మాయా దర్పణం
మీరు ఓ మాయా దర్పణాన్ని చూస్తున్నారని ఊహించుకోండి. అందులో ఎక్కడో దూరంగా ఉన్న తండ్రి ప్రత్యక్షమయ్యారు. ఆయనను ఆ గదిలోనే నిజంగా చూస్తున్నట్టే అనిపించింది. కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలక బోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో. -
పదార్థాలు చెడకుండా..
ఆహార పదార్థాలు ఇప్పుడు ఒక ప్రాంతానికే పరిమితం కావటం లేదు. సాగరాలు దాటుకొని దేశదేశాలకూ విస్తరిస్తున్నాయి. అయితే కూరగాయలు, పండ్లు, మాంసం వంటివి త్వరగా చెడిపోవటం పెద్ద సమస్య. దీన్ని అధిగమించటానికి ఆహార నిల్వ పద్ధతులు ఎంతగానో తోడ్పడు తున్నాయి. -
ఫైళ్ల అంశాలు ప్రివ్యూలో
డెస్క్టాపో, ల్యాప్టాపో.. ఏదైనా పీసీలో బోలెడన్ని ఫైళ్లు. రోజూ కొత్తవి ఎన్నో వచ్చి చేరుతుంటాయి. కొన్నిసార్లు పేర్లనూ మరచిపోతుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని వెతికి పట్టుకోవటమంటే మాటలు కాదు. -
వాతావరణ మార్పును వింటారా?
డేటా అనగానే అంకెలు, గ్రాఫ్లే గుర్తుకొస్తాయి. దీన్ని సంగీతంగా మారిస్తే? జపాన్ శాస్త్రవేత్త హిటోరీ నగాయ్ అలాంటి విచిత్రమే చేసి చూపించారు. అర్కిటిక్, అంటార్కిటికా నుంచి 30 ఏళ్లుగా ఉపగ్రహాలు సేకరించిన వాతావరణ సమాచారాన్ని ఆరు నిమిషాల పాటగా మార్చారు. -
ఫోన్ భద్రంగా..
స్మార్ట్ఫోన్లు ఇప్పుడు వ్యక్తిగత ఆస్తులు! పాస్వర్డ్లు, ఈమెయిళ్లు, బ్యాంకు వివరాల వంటి విలువైన సమాచారం మొత్తం వీటిల్లోనే స్టోర్ చేసుకుంటున్నాం మరి. ఇంతటి కీలకమైన ఫోన్లను భద్రంగా కాపాడుకోవద్దూ! -
కార్చిచ్చు కహానీ!
ప్రకృతి విపత్తులనగానే వరదలు, తుపాన్లు, కరవులు, సుడిగుండాల వంటివే గుర్తుకొస్తాయి. కానీ అడవులు మండటమూ తక్కువేమీ కాదు. ఇటీవల మన దగ్గర శేషాచలం అడవుల్లో, ఉత్తరాఖండ్లో కార్చిచ్చు రేగటం తెలిసిందే. -
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్