Safer Internet Day: ఇంటర్నెట్ భద్రత.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా..?
సేఫర్ ఇంటర్నెట్ డేను పురస్కరించుకుని ఇంటర్నెట్ వినియోగంలో పాటించాల్సిన పది జాగ్రత్తలు ఏంటో చూద్దాం.
ఇంటర్నెట్డెస్క్: జైత్ర మార్కెట్కు వెళుతూ ఫోన్ను పిల్లలకు ఇచ్చి వెళ్లాడు. తిరిగి ఇంటికొచ్చి చూసేసరికి బ్యాంక్ ఖాతా నుంచి పదివేలు నగదు డ్రా అయినట్లు మెసేజ్ చూసి కంగుతిన్నాడు. తర్వాత తెలిసిందేమంటే పిల్లలు ఫోన్లో గేమ్స్ ఆడుతూ.. స్క్రీన్పై కనిపించిన లింక్లపై క్లిక్ చేశారు. దాంతో ఫోన్లోని వివరాలు హ్యాకర్లకు చేరిపోయాయి. చంద్రమౌళి బ్రౌజింగ్ చేస్తూ ఆఫర్ అని కనిపించడంతో లింక్పై క్లిక్ చేశాడు. అందులో పేరు, మొబైల్ నంబర్, ఆధార్ వంటి వివరాలు నమోదు చేయమని సూచించడంతో వాటిని నమోదు చేశాడు. కొద్దిసేపటికే తన బ్యాంక్ ఖాతా ద్వారా ₹ 50 వేలు ఆన్లైన్ షాపింగ్ చేసినట్లు మెసేజ్ చూసి విస్తుపోయాడు.
ఇలాంటి ఆన్లైన్ మోసాల గురించి తరచుగా మనం వింటూనే ఉంటాం. అత్యాశతో కొందరు, అవగాహన రాహిత్యంతో మరికొందరు ఇంటర్నెట్ వేదికగా జరిగే ఆన్లైన్ మోసాలకు బాధితులుగా మారుతున్నారు. దీనిపై యూజర్లకు అవగాహన కల్పించేందుకు ఫిబ్రవరి 8వ తేదీని ప్రతి ఏటా ‘సేఫర్ ఇంటర్నెట్ డే’గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇంటర్నెట్ వినియోగంలో తీసుకోవాల్సిన పది జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.
- ఇంటర్నెట్ వినియోగానికి ప్రధాన వేదిక బ్రౌజర్ అనే చెప్పుకోవాలి. డెస్క్టాప్/మొబైల్, ఎందులో అయినా సమాచారం వెతకాలంటే బ్రౌజర్ను ఆశ్రయించాల్సిందే. ఒకరకంగా మన ఆన్లైన్ విహారానికి బ్రౌజర్ గేట్వే లాంటిది. అందుకే బ్రౌజర్ల ద్వారా మన వివరాలు సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. అలానే బ్రౌజర్ భద్రతకు సంబంధించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఐసీఏఆర్టీ) జేఎస్గార్డ్ పేరుతో బ్రౌజర్ ఎక్స్టెక్షన్ను అందిస్తుంది. ఇది సైబర్ దాడుల నుంచి యూజర్ రక్షణ కల్పించడంతోపాటు, మాల్వేర్ వెబ్సైట్ల గురించి యూజర్ను అలర్ట్ చేస్తుంది.
- మొబైల్ చేతిలో ఉంటే చాలు అన్ని రకాల సేవలు మనకు అందుబాటులో ఉన్నట్లే. మరీ ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, ఫుడ్ డెలివరీ, షాపింగ్, టికెట్ బుకింగ్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్.. ఇలా ప్రతి అవసరానికి యాప్లు ఉన్నాయి. అయితే కొన్ని యాప్లలో భద్రత లోపంతో మాల్వేర్ ద్వారా యూజర్ వ్యక్తిగత డేటా హ్యాకర్స్కు చేరిపోతున్నాయి. అలాంటి వాటిని గుర్తించి ఏటా గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాల్వేర్ ఉన్న యాప్లను తొలగిస్తుంటాయి. అందుకే కొత్తగా యాప్లు డౌన్లోడ్ చేసే ముందు వాటికి ప్లేస్టోర్, యాప్ స్టోర్ ప్రొటెక్షన్ ఉందా, లేదా అనే సరిచూసుకోవాలి. యూజర్ రేటింగ్ తక్కువగా ఉండి, అనుమానస్పదంగా ఉన్న యాప్ల జోలికెళ్లపోవడం ఉత్తమం.
- ఆఫర్ల పేరుతో మెయిల్, మెసేజ్ల ద్వారా వచ్చే లింక్లపై క్లిక్ చేయొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిలో ఎక్కువ శాతం యూజర్స్ డేటాను దొంగిలించేందుకు హ్యాకర్స్ మాల్వేర్ కోడ్తో వాటిని యూజర్ మొబైల్ లేదా మెయిల్కు పంపుతారు. చూడగానే నమ్మశక్యంగా ఉండటంతో యూజర్స్ వాటిని క్లిక్ చేస్తారు. అందుకే ప్రముఖ ఈ-కామర్స్ లేదా ఇతరత్రా కంపెనీల నుంచి ఆఫర్ లేదా లాటరీ పేరుతో వచ్చే లింక్లను వెంటనే డిలీట్ చేయమని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. అలానే ఫలానా యాప్ ద్వారా నగదు పంపితే క్యాష్బ్యాక్ వస్తుందని సామాజిక మాధ్యమ గ్రూపుల్లో షేర్ అయ్యే లింక్లకు దూరంగా ఉండటం మేలంటున్నారు.
- ప్రతి మనిషి జీవితంలో గోప్యత ఎంతో ముఖ్యం. ఆన్లైన్ వినియోగం పెరిగాక ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్న మాట. అందుకే ఆన్లైన్ ఖాతాకు యూజర్ నేమ్, పాస్వర్డ్ తప్పనిసరి. అయితే చాలా మంది యూజర్స్ సులువుగా గుర్తుంచుకునేందుకు పేరు, పుట్టిన తేదీ, అంకెలను పాస్వర్డ్గా పెడుతుంటారు. దీంతో వాటిని బ్రేక్ చేయడం సైబర్ నేరగాళ్లకు మరింత సులువు. అందుకే పాస్వర్డ్ అక్షరాలు, అంకెలు, స్పెషల్ క్యారెక్టర్ల కలయికగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ సంస్థలు సూచిస్తున్నాయి. పాస్వర్డ్ బలంగా ఉంటేనే ఆన్లైన్ గోప్యతకు భంగం వాటిల్లదని చెబుతున్నాయి. అలానే పాస్వర్డ్ను తరచుగా మారుస్తుండాలని సూచిస్తున్నాయి. అదనపు భద్రత కోసం టెక్ కంపెనీలు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ను తీసుకొస్తున్నాయి. ఇందులో ప్రైమరీ పాస్వర్డ్తోపాటు పిన్, ఓటీపీ వంటి సెకండరీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే ఖాతా ఓపెన్ అవుతుంది.
- వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్), ఇది యూజర్లకు, ఇంటర్నెట్కు మధ్య సురక్షితమైన కనెక్షన్ను అందిస్తుంది. దీని ద్వారా ఆన్లైన్ బ్రౌజింగ్ చేస్తే మిమ్మల్ని ఎవరూ ట్రాక్ చేయలేరు. హ్యాకర్ల నుంచి డేటాను కాపాడుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు ఎక్కువగా ఈ నెట్వర్క్ను ఉపయోగిస్తుంటాయి. 2021లో సేకరించిన గణాంకాల ప్రకారం వీపీఎన్ నెట్వర్క్ ఉపయోగించే 85 దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటికే గూగుల్ వంటి సంస్థలు సబ్స్క్రిప్షన్ ద్వారా వీపీఎన్ సేవలను అందిస్తున్నాయి. సురక్షితమైన ఇంటర్నెట్ కోసం వీపీఎన్ ఉపయోగించవచ్చనేది నిపుణుల మాట.
- కొవిడ్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ విద్యకు ప్రాధాన్యం ఏర్పడటంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం పెరిగింది. అయితే ఇంటర్నెట్ వినియోగంలో అవగాహనలోపంతో చేసే పొరపాట్ల వల్ల యూజర్స్ సైబర్ దాడులకు గురవుతున్నారు. దీంతో బ్రాడ్బ్యాండ్ వినియోగంలో తప్పులు చేయొద్దని ఐసీఏఆర్టీ సూచిస్తుంది. ఇందులో భాగంగా ఓపెన్ వైఫై నెట్వర్క్లకు ఆటో-కనెక్ట్ ఆప్షన్ను, ఎస్ఎస్ఐడీని, రిమోట్ అడ్మినిస్ట్రేషన్, రీస్టోర్ ఫ్యాక్టరీ డీఫాల్ట్ సెట్టింగ్లను ఎనేబుల్ చేయొవద్దని చెబుతోంది. అలానే యూఎస్బీ బ్రాడ్బ్యాండ్ మోడెమ్ను సురక్షితంకానీ కంప్యూటర్/ల్యాప్టాప్లలో ఉపయోగించవద్దని చెబుతోంది.
- ప్రస్తుతం సోషల్ మీడియా ఖాతాలేని వ్యక్తులు అరుదు. వ్యక్తిగత జీవితంలోని సంతోషకరమైన సందర్భాలను ఇతరులతో షేర్ చేసుకోవడంతోపాటు, సమాజంలో జరిగే అంశాలపై వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకునే వేదికగా ఎంతో మంది వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు, వీడియోలను సేకరించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో సోషల్ మీడియా కంపెనీలు యూజర్లకు మెరుగైన భద్రత కల్పించడంలో భాగంగా ప్రొఫైల్ లాక్, ప్రైవసీ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వ్యక్తిగత గోప్యత, మెరుగైన ఆన్లైన్ భద్రత కోసం సోషల్ మీడియా ఖాతాల్లోని ప్రైవసీ ఫీచర్లు ఎనేబుల్ చేసుకోమని సోషల్ మీడియా సంస్థలు సూచిస్తున్నాయి.
- లాక్డౌన్ కాలంగా పాఠశాలలు మూతపడటంతో పిల్లలు ఇంటి నుంచే ఆన్లైన్ క్లాసులు వింటున్నారు. ఈ నేపథ్యంలో ల్యాప్టాప్/మొబైల్ వినియోగంచే అవకాశం దొరికింది. పిల్లలు ఆన్లైన్ క్లాసులు వింటున్నారనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉండిపోవడంతో వాటి వినియోగం శృతి మించుతోంది. దీంతో పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు? ఎంత సమయం గడుపుతున్నారో తల్లిదండ్రులు తెలుసుకునేందుకు వీలుగా పేరెంటల్ కంట్రోల్ ఫీచర్తో టెక్ కంపెనీలు డివైజ్లను పరిచయం చేస్తున్నాయి. అలానే ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సంస్థలు సైతం పేరెంటల్ కంట్రోల్ తరహాలో కొత్త ఫీచర్ను పరిచయం చేయనుంది. వీటి వల్ల పిల్లల ఆన్లైన్ వినియోగం సురక్షితంగా ఉంటుదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
- చాలా మంది యూజర్స్ బయటికి వెళ్లినప్పుడు మొబైల్ డేటా ఆదా చేసే ఉద్దేశంతో ఉచిత వైఫై సేవలను ఉపయోగిస్తుంటారు. అయితే వాటిలో అన్ని వైఫై నెట్వర్క్లు సురక్షితం కావని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రీ వైఫై కోసం ఆశపడితే మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్స్కు చేరిపోయే ప్రమాదం లేకపోలేదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా లభించే వైఫైని అత్యవసరమైతే తప్ప ఉపయోగించవద్దని సూచిస్తున్నారు.
- ఆర్థిక లావాదేవీల నిర్వహణ కోసం బ్రౌజర్లో మన బ్యాంక్ వెబ్సైట్ పేరును టైప్ చేస్తాం. అయితే ఇటీవలి కాలంలో నకిలీ వెబ్సైట్లతో యూజర్స్ మోసపోతున్నారు. అందుకే మీరు బ్రౌజర్లో బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అండ్రస్ బార్లో హెచ్టీపీపీఎస్ అని ఉండాలి. ఒకవేళ అడ్రస్ బార్లో హెచ్టీపీపీ అని ఉంటే ఆ పేజీని అనుమానించాల్సిందే. సదరు పేజీ ద్వారా ఆన్లైన్ లావాదేవీలు చేయడం మంచిది కాదు. ఇలాంటి వెబ్సైట్ల నుంచి ఐసీఏఆర్టీ సూచించే జేఎస్గార్డ్ బ్రౌజర్ ఎక్స్టెక్షన్ యూజర్లను హెచ్చరిస్తుంది. దానివల్ల యూజర్ డేటా ఎంతో సురక్షితంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వచ్ఛ ఒలింపిక్స్
ఒలింపిక్ క్రీడలకు పారిస్ నగరం సమాయత్తమైంది. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులు, క్రీడాభిమానులతో విశ్వ నగరం కొత్త శోభలు సంతరించుకుంటోంది. -
వినూత్న ఫొటోనిక్స్
ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎలక్ట్రాన్ల పాత్ర కీలకం. ఇవి ఒక చోటు నుంచి మరో చోటుకు డేటాను చేరవేయటం వంటి దగ్గరి దారులకు బాగా ఉపయోగపడతాయి. -
1పాస్వర్డ్ మారింది
పలు కొత ఫీచర్లతో 1పాస్వర్డ్ భారీగా అప్డేట్ అయ్యింది. మాస్టర్ పాస్వర్డ్ను మరిచిపోయినా అకౌంట్ను రికవరీ చేసుకునే వెలుసుబాటూ కల్పించింది. -
నవ్వు శాస్త్రం
నవ్వటం ఒక భోగం! అతిశయోక్తిలా అనిపించినా ఇది నిజం. ఇప్పుడు చాలామంది జీవితాల్లో నవ్వటమనేది కనుమరుగవుతోంది. రోజుకు ఒక్కసారైనా నవ్వనివారు ఎందరో. -
ఎక్కువ సిమ్లు తీసుకున్నారా?
నేటి డిజిటల్ ప్రపంచంలో ఒక్క సిమ్ కార్డు సరిపోవటం లేదు. ఆఫీసు వ్యవహారాలకు ఒకటి, సొంత పనులకు ఒకటి, కుటుంబ పనులకు మరోటి.. ఇలా బోలెడన్ని సిమ్లు ఎడాపెడా తీసేసుకుంటున్నారు. -
ఆన్లైన్ నేరాల మీద చక్షువు
నేటి డిజిటల్ ప్రపంచంలో ఆన్లైన్ నేరాలు పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు రకరకాల పద్ధతుల్లో అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు దోచుకుంటున్నారు. -
మనిషిలా మరమనుషులు!
విచిత్రమైన రోబోల గురించి చాలానే విని ఉంటారు. ఇవి రోజురోజుకీ ఇంకా వినూత్నంగానూ మారుతున్నాయి. వీటికి మనిషి మెదడును జోడించాలని కొందరు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటే.. మనుషుల్లా కనిపించేలా సజీవ చర్మాన్ని జత చేయాలని ఇంకొందరు కృషి చేస్తున్నారు. -
సూపర్ పరిజ్ఞానాలు
సాంకేతిక పరిజ్ఞాన (టెక్నాలజీ) రంగం శరవేగంగా సాగుతోంది. నిన్నటి పద్ధతులు నేడు పాత పడిపోతున్నాయి. వాటి స్థానంలో వినూత్న పరిజ్ఞానాలు వచ్చి చేరుతున్నాయి. -
ఏఐ సాయంతో ఉద్యోగం!
కృత్రిమ మేధ (ఏఐ) మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తుందని, దీని మూలంగా ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వెల్లువెత్తటం చూస్తున్నదే. -
ఏఐ సోషల్ లోకం!
సామాజిక మాధ్యమ ప్రియులకు శుభవార్త. మరో వినూత్న సోషల్ మీడియా యాప్ ఆరంభమైంది. దీని పేరు బటర్ఫ్లయిస్. మామూలు యూజర్లతోనే కాకుండా కృత్రిమ మేధ(ఏఐ)తో సృష్టించుకున్న పాత్రలతోనూ సంభాషణలు జరపటానికి వీలు కల్పించటం దీని ప్రత్యేకత. -
గ్రహాంతర జీవులు మనమధ్యే!
గ్రహాంతర జీవుల మీద మన ఆసక్తి ఈనాటిది కాదు. వీరి కోసం చాలాకాలంగా అన్వేషిస్తున్నాం. కానీ ఇంతవరకూ కచ్చితమైన జాడేదీ కనిపించలేదు. విశ్వంలో మనలాంటి వాళ్లు ఉన్నారని కొందరు, లేరని మరికొందరు శాస్త్రవేత్తలు వాదిస్తూనే వస్తున్నారు. -
విద్యుత్తు మోటారు ఎలా తిరుగుతుంది?
విద్యుత్తుతో పనిచేసే ఫ్యాన్లు, మిక్సీల వంటి వాటిని రోజూ వాడుతూనే ఉంటాం. వీటిల్లోని మోటార్లు ఎలా పనిచేస్తాయో తెలుసా? ఈ మోటార్లు విద్యుత్తును చలనశక్తిగా మారుస్తాయి. -
యాపిల్ ఏఐ శకం
యాపిల్ సంస్థ కృత్రిమ మేధ (ఏఐ) దిశగా తొలి అడుగులు వేసింది. ఏటా నిర్వహించే వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో ఈసారి దీనికి పెద్ద పీట వేసింది. యాపిల్ ఇంటెలిజెన్స్ పేరిట సొంత ఏఐ పరిజ్ఞానాన్ని పరిచయం చేయటంతో పాటు డిజిటల్ అసిస్టెంట్ అయిన సిరికి సైతం ఏఐ సొబగులు అద్దింది. -
నవ మాయా దర్పణం
మీరు ఓ మాయా దర్పణాన్ని చూస్తున్నారని ఊహించుకోండి. అందులో ఎక్కడో దూరంగా ఉన్న తండ్రి ప్రత్యక్షమయ్యారు. ఆయనను ఆ గదిలోనే నిజంగా చూస్తున్నట్టే అనిపించింది. కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలక బోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో. -
పదార్థాలు చెడకుండా..
ఆహార పదార్థాలు ఇప్పుడు ఒక ప్రాంతానికే పరిమితం కావటం లేదు. సాగరాలు దాటుకొని దేశదేశాలకూ విస్తరిస్తున్నాయి. అయితే కూరగాయలు, పండ్లు, మాంసం వంటివి త్వరగా చెడిపోవటం పెద్ద సమస్య. దీన్ని అధిగమించటానికి ఆహార నిల్వ పద్ధతులు ఎంతగానో తోడ్పడు తున్నాయి. -
ఫైళ్ల అంశాలు ప్రివ్యూలో
డెస్క్టాపో, ల్యాప్టాపో.. ఏదైనా పీసీలో బోలెడన్ని ఫైళ్లు. రోజూ కొత్తవి ఎన్నో వచ్చి చేరుతుంటాయి. కొన్నిసార్లు పేర్లనూ మరచిపోతుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని వెతికి పట్టుకోవటమంటే మాటలు కాదు. -
వాతావరణ మార్పును వింటారా?
డేటా అనగానే అంకెలు, గ్రాఫ్లే గుర్తుకొస్తాయి. దీన్ని సంగీతంగా మారిస్తే? జపాన్ శాస్త్రవేత్త హిటోరీ నగాయ్ అలాంటి విచిత్రమే చేసి చూపించారు. అర్కిటిక్, అంటార్కిటికా నుంచి 30 ఏళ్లుగా ఉపగ్రహాలు సేకరించిన వాతావరణ సమాచారాన్ని ఆరు నిమిషాల పాటగా మార్చారు. -
ఫోన్ భద్రంగా..
స్మార్ట్ఫోన్లు ఇప్పుడు వ్యక్తిగత ఆస్తులు! పాస్వర్డ్లు, ఈమెయిళ్లు, బ్యాంకు వివరాల వంటి విలువైన సమాచారం మొత్తం వీటిల్లోనే స్టోర్ చేసుకుంటున్నాం మరి. ఇంతటి కీలకమైన ఫోన్లను భద్రంగా కాపాడుకోవద్దూ! -
కార్చిచ్చు కహానీ!
ప్రకృతి విపత్తులనగానే వరదలు, తుపాన్లు, కరవులు, సుడిగుండాల వంటివే గుర్తుకొస్తాయి. కానీ అడవులు మండటమూ తక్కువేమీ కాదు. ఇటీవల మన దగ్గర శేషాచలం అడవుల్లో, ఉత్తరాఖండ్లో కార్చిచ్చు రేగటం తెలిసిందే. -
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?