Pawan Kalyan: నేడు పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఇద్దరు పార్టీ క్రియాశీల కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం

Updated : 20 May 2022 07:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఇద్దరు పార్టీ క్రియాశీల కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు జనసేన మీడియా విభాగం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉదయం పది గంటలకు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. 10.30 గంటలకు హైదరాబాద్‌లోని మెట్టుగూడ అంబేద్కర్‌ చౌరస్తాలో, 11 గంటలకు ఎల్బీనగర్‌ అలకాపురి సెంటర్‌లో కొంత సమయం ఆగుతారు. చౌటుప్పల్‌ మండలం లక్కారంలో ఇటీవల మరణించిన పార్టీ క్రియాశీల కార్యకర్త కొంగరి సైదులు కుటుంబాన్ని మధ్యాహ్నం 12.30 గంటలకు పవన్‌ కల్యాణ్‌ పరామర్శించి రూ.5 లక్షల చెక్‌ అందజేస్తారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారు. రెండు గంటలకు కోదాడకు చేరుకుని ఇటీవల మరణించిన కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షల చెక్‌ అందజేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని