Dharani: ఉపశమనం దొరికేనా!
ఆన్లైన్లో తమ భూమి వివరాలు కనిపించక ఆందోళన చెందుతున్న రైతులు ధరణి ఉప సంఘం పైనే ఆశలు పెట్టుకున్నారు. తమ సమస్యల వినతి పత్రాలను ప్రత్యక్ష పద్ధతిలో స్వీకరించాలని కోరుతున్నారు. మీసేవ, ధరణిలో
ధరణి సమస్యలపై మంత్రివర్గ ఉప సంఘంపైనే ఆశలు
పాసుపుస్తకాల కోసం బాధితుల ప్రదక్షిణలు
భూమి హక్కులు దక్కక ఇక్కట్లు
సమస్యలపై దరఖాస్తులు నేరుగా స్వీకరించాలని వినతులు
ఈనాడు, హైదరాబాద్: ఆన్లైన్లో తమ భూమి వివరాలు కనిపించక ఆందోళన చెందుతున్న రైతులు ధరణి ఉప సంఘం పైనే ఆశలు పెట్టుకున్నారు. తమ సమస్యల వినతి పత్రాలను ప్రత్యక్ష పద్ధతిలో స్వీకరించాలని కోరుతున్నారు. మీసేవ, ధరణిలో దరఖాస్తు చేస్తే ఏం జరుగుతుందో అంతుపట్టడం లేదని అనేక గ్రామాల అన్నదాతలు చెబుతున్నారు. ఒక్కో గ్రామానికి పదికి పైగా సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన కొత్త పాసుపుస్తకం అందని వారు కొందరైతే.. పుస్తకం వచ్చినా పూర్తి విస్తీర్ణం నమోదు కాకపోవడం, తప్పులు దొర్లడంతో కొందరు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారం అయిందీ లేనిదీ తెలియజేసేలా ప్రభుత్వం ప్రత్యక్ష పద్ధతిని ఏర్పాటు చేయాలంటున్నారు. ఉప సంఘం ఈ సమస్యపై దృష్టి సారించాలని బాధితులు విన్నవిస్తున్నారు.
ఉప సంఘానికి అందిన సమస్యలివి
* మూల సర్వే నంబరును మించి విస్తీర్ణం నమోదు కావడంతో కొందరు పట్టాదారులకు పాసుపుస్తకాలు జారీకాలేదు.
* కొందరికి కొంత విస్తీర్ణం మాత్రమే నమోదు చేసి పుస్తకాలు జారీ చేశారు.
* జిల్లాల్లో కొన్ని ఖాతాలు, సర్వే నంబర్లు పూర్తిగా ధరణిలో నమోదు కాలేదు.
* ప్రభుత్వం సేకరించిన విస్తీర్ణం కన్నా ఎక్కువ భూమిని దస్త్రాల్లో నమోదు చేసి నిషేధిత జాబితాలో చేర్చారు.
* భూయజమాని మరణించిన సందర్భంలో వారసత్వ బదిలీకి కుటుంబ ధ్రువీకరణ పత్రం పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఇబ్బందులు.
* ఎసైన్డ్ భూములన్న రైతులకు డిజిటల్ సంతకం పూర్తికాకపోవడంతో ధరణిలోకి ఎక్కలేదు.
* రైతు బంధు సర్వే సమయంలో సాగులో లేని పట్టా భూములను నమోదు చేయలేదు.
* ఇద్దరు కలసి కొనుగోలు చేసిన భూమిని విక్రయించుకోవడానికి వీల్లేకుండా ఉంది.
* పదేళ్ల కాలానికి మించి సాగులో ఉన్న ఇనాం భూములకు అధీన ధ్రువపత్రం జారీచేసి (ఓఆర్సీ) హక్కులు కల్పించాల్సి ఉన్నా ఆన్లైన్లో వారి వివరాలు కనిపించడం లేదు.
* ధరణిలో సర్వే నంబర్ల వారీగా ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికెట్ రావడం లేదు.
* ధరణికి ముందు గజాల కొలతలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు ఇప్పుడు మ్యుటేషన్ కావడం లేదు.
* పిల్లల పేరుతో భూమిని గిఫ్ట్ డీడ్ చేస్తే మైనర్ల ఫొటోలు పాసుపుస్తకాల్లో రావడం లేదు.
కసరత్తు ముమ్మరం
రాష్ట్రంలో నెలకొన్న భూసమస్యల పరిష్కారానికి మంత్రి హరీశ్రావు నేతృత్వంలో నియమించిన మంత్రివర్గ ఉప సంఘం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఒక దఫా సమావేశమై సమస్యలను స్వీకరించింది.ఈనెల 20 తర్వాత మరోమారు భేటీకానుంది. ఈ లోగా సమస్యల గుర్తింపు, వాటి పరిష్కారానికి ధరణిలో ఏర్పాటు చేయాల్సిన ఐచ్ఛికాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు.
ఇక ఓపిక లేదు: రామయ్య
‘‘నాలుగేళ్ల నుంచి తిరుగుతున్నా.. ఇక ఓపిక లేదు. నా పట్టా భూమికి హక్కులు కల్పించండి. చేతిలో భూమున్నా అప్పు పుట్టడం లేదు. రైతుబంధు, బీమా రావడం లేదు. సమస్యను రాతపూర్వకంగా, ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అంటూ నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రాజుపేటకు చెందిన బి.రామయ్య అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాతల నాటినుంచి సాగు చేసుకుంటున్న పట్టా భూమి 2.20 ఎకరాలకు 2018 నుంచి హక్కులు పోయాయి. కొత్త పాసుపుస్తకం ఇవ్వడం లేదని వాపోతున్నారు. వాస్తవానికి రాజుపేట గ్రామంలోని సర్వే నంబరు 299లో 15 ఎకరాల భూమి ఉండగా 12 మంది రైతులు ఉన్నారు. 2017 దస్త్రాల ప్రక్షాళన సందర్భంగా కొందరు రైతులకు వారికున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణం నమోదు చేశారు. దీంతో సర్వే నంబరులో ఎక్కువ విస్తీర్ణం (ఆర్ఎస్ఆర్) చూపడంతో రామయ్య విస్తీర్ణం, ఖాతా తొలగించేశారు. సంగారెడ్డి జిల్లాలో మడెప్ప పాసుపుస్తకం.. భద్రాద్రిలో ఆన్లైన్లో కనిపించని లాలయ్య ఖాతా... యాదాద్రి జిల్లాలో నిషేధిత జాబితాలో విజయలక్ష్మి భూమి నమోదు.., ఇలా ఎంతలేదన్నా ఒక్కో గ్రామానికి పదికిపైగానే సమస్యలు కనిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
ఓ ఎయిర్లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్ర‘మే’
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానమైన స్కేల్ ఇవ్వాలి
విస్తృతమైన బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానంగా సవరించిన వేతన స్కేల్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. -
ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. -
పర్యావరణహిత ప్రజారవాణా మేలు
కాలుష్య ఉద్గారాలు లేని ప్రజారవాణా పర్యావరణానికి మేలు కలిగిస్తుందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్కు వచ్చారు. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. -
జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. -
భవన నిర్మాణ అనుమతుల వెనక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
కవిత బెయిల్పై తీర్పు 6కి వాయిదా
దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం వెలువరించాల్సిన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరింది. -
ఉద్యోగులకు వేతనాలివ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు
సరిపడా నిధులు లేక బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల కార్యదర్శికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు