యాసంగిలో వరి సాగు నియంత్రణపై మిల్లర్ల ఆందోళన
యాసంగిలో వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడంతో దీర్ఘకాలంలో ఈ ప్రభావం తమపై ఏమేరకు ఉంటుందోనని రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు.
దీర్ఘకాలంలో ప్రభావం ఉంటుందంటున్న నిపుణులు
ఈనాడు, నల్గొండ: యాసంగిలో వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడంతో దీర్ఘకాలంలో ఈ ప్రభావం తమపై ఏమేరకు ఉంటుందోనని రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2627 రైస్మిల్లులు ఉన్నాయి. వీటిలో 991 పారాబాయిల్డ్వి కాగా 1636 రా రైస్ ఉత్పత్తిచేసేవి. రాష్ట్రం మొత్తం పారాబాయిల్డ్ మిల్లుల్లో సగానికి పైగా ఉమ్మడి నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లోనే ఉన్నాయి. రా రైస్ మిల్లుల్లో ఎక్కువ శాతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 400 వరకు మిల్లులుండగా 250 అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో పనిచేస్తున్నాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్ చేయించి బియ్యాన్ని ఎఫ్సీఐకి అందజేస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రా రైస్ను ఉత్పత్తి చేయడం తమకు ఆర్థికంగా భారమని మిల్లర్లు అభిప్రాయపడుతున్నారు. మిల్లుల్లో ఇప్పుడున్న సాంకేతికతను మార్చడానికి భారీగా ఖర్చవుతుందంటున్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడి రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది ఉపాధి పొందుతున్నారు. మూతపడితే వారి జీవితాలు దుర్భరమయ్యే పరిస్థితి పొంచి ఉంది.
ఎగుమతులకు స్పష్టమైన విధానం అవసరం
అరబ్ దేశాలతో పాటు బంగ్లాదేశ్, మలేసియా, నేపాల్, శ్రీలంకలలో ఇప్పటికీ ఉప్పుడు బియ్యానికి గిరాకీ ఉంది. మన దేశంలోనూ కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలోనూ గిరాకీ ఉన్నా మూడు నాలుగేళ్ల నుంచి అక్కడా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇక్కడి నుంచి ఎగుమతులు పడిపోయాయి. విదేశాలకు ఎగుమతులకు సంబంధించి ప్రభుత్వపరంగా స్పష్టమైన విధానం ఉంటే కొంతలో కొంత ధాన్యం సమస్య గట్టెక్కించవచ్చని మిల్లర్లు అభిప్రాయపడుతున్నారు. బహిరంగ మార్కెట్లో బియ్యం విక్రయాల్లోనూ నిబంధనలు మారిస్తే వినియోగదారులు, మిల్లర్లకు లాభసాటిగా ఉంటుందని అంటున్నారు.ప్రస్తుతం దొడ్డురకాలకు ప్రభుత్వం గరిష్ఠ మద్దతు ధర క్వింటాకు రూ.1960 చెల్లిస్తోంది. కొనుగోలు కేంద్రాలను మూసేస్తే రైతుల నుంచి తాము అంత ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే గిట్టుబాటు కాదని మిల్లర్లు చెబుతున్నారు. క్వింటాకు రూ.1500 వరకు కొంటేనే తమకు ఎంతో కొంత మిగులుతుందంటున్నారు. రెండేళ్ల నుంచి రాష్ట్రంలో వరి సాగు దృష్ట్యా మిల్లుల్లో సాంకేతికత, సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలని ప్రభుత్వం గతంలోనే మిల్లర్లకు సూచించింది. దీని కోసం నల్గొండ జిల్లాలోనే సుమారు రూ.150 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం వరి సాగు చేయద్దనడంతో పెట్టిన ఖర్చు వృథా అవుతుందని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గోదాములన్నీ ఫుల్
ప్రస్తుతం గత రబీ సీజన్లో వచ్చిన ధాన్యంతోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గోదాములన్నీ నిండిపోయాయి. ఇప్పుడు వానాకాలం పంట కొనుగోళ్లు సగం మేర పూర్తయ్యాయి. ఎఫ్సీఐ మిల్లింగ్ చేసిన బియ్యాన్ని తీసుకోవడంలో తాత్సారం చేస్తోందని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఇప్పటికీ గత యాసంగి సీజన్కు సంబంధించి ఇంకా 3.5లక్షల టన్నుల బియ్యం గోదాముల్లోనే మూలుగుతోంది. వీటిని త్వరితగతిన ఖాళీ చేస్తే వానాకాలం ధాన్యం మిల్లింగ్ చేసి ఆ బియ్యాన్ని గోదాముల్లో నింపుతారు. తగినన్ని ర్యాక్స్ (రైళ్లు) రాకపోవడంతోనే బియ్యం ఎఫ్సీఐకి పంపడంలో జాప్యమవుతోందని అధికారులు వెల్లడిస్తున్నారు.
దీర్ఘకాలంలో ఇబ్బందులే..
వరి సాగు నియంత్రణతో ఇప్పటికప్పుడు సమస్య లేకపోయినా ఈ పరిశ్రమ కింద పనిచేస్తున్న వారు దీర్ఘకాలంలో ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి.
- కర్నాటి రమేష్, రాష్ట్ర రైస్మిల్లర్ల సంఘం ఉపాధ్యక్షుడు, మిర్యాలగూడ
ప్రభుత్వం ఓ విధానం తేవాలి
ఇప్పుడున్న బాయిల్డ్ రైస్ ఉత్పత్తి సాంకేతికతను మార్చి రా రైస్ను ఉత్పత్తి చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మన రాష్ట్రంలో ఎక్కువగా బాయిల్డ్ మిల్లులే ఉన్నాయి. ప్రభుత్వ మద్దతు ధరకు కాకుండా అటు రైతులు, ఇటు మిల్లర్లు నష్టపోకుండా ఓ విధానం తీసుకొస్తే రైతులు పండించిన పంటను కొనడానికి మిల్లర్లు సిద్ధంగా ఉంటారు.
- చిట్టప్రోలు యాదగిరి, రైస్మిల్లర్ల సంఘం అధ్యక్షుడు, నల్గొండ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
-
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!