చారిత్రక తప్పులను సరిదిద్దుతున్నాం
స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది చేసిన త్యాగాలను తుడిచేసే ప్రయత్నం గతంలో జరిగిందని, ఇప్పుడు తాము ఆ తప్పులను సరిదిద్దుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆజాద్ హింద్ఫౌజ్ దళపతి సుభాష్ చంద్రబోస్
ఎంతో మంది త్యాగాలను గత ప్రభుత్వాలు విస్మరించాయి
నేతాజీ నివాస సందర్శన అనుభూతిని మాటల్లో చెప్పలేను
సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహావిష్కరణలో మోదీ
ఈనాడు, దిల్లీ: స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది చేసిన త్యాగాలను తుడిచేసే ప్రయత్నం గతంలో జరిగిందని, ఇప్పుడు తాము ఆ తప్పులను సరిదిద్దుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆజాద్ హింద్ఫౌజ్ దళపతి సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని ఇండియాగేట్ వద్ద 28 అడుగుల ఎత్తైన గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో ఆయన ఆదివారం సాయంత్రం దాని హాలోగ్రామ్ విగ్రహాన్ని డిజిటల్ రూపంలో ఆవిష్కరించి, ప్రసంగించారు.
విజయాలే మన సంకల్ప శక్తికి సాక్ష్యాలు
‘‘2047కి ముందే సరికొత్త భారత దేశాన్ని నిర్మించుకోవాలన్న లక్ష్యం మన ముందిప్పుడు ఉంది. ఈ లక్ష్యాన్ని చేరకుండా ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. మన విజయాలే మన సంకల్ప శక్తికి సాక్ష్యాలు. మన యాత్ర సుదీర్ఘమైంది. ఎన్నో శిఖరాలు అధిరోహించాల్సి ఉంది. భారత్కున్న గుర్తింపును, ప్రేరణలను పునరుజ్జీవింపజేయాలి. స్వాతంత్య్రం తర్వాత దేశ సంస్కృతితోపాటు, ఎంతోమంది మహానుభావులు చేసిన యోగదానాలను తుడిచేసే పని జరిగింది. దశాబ్దాల తర్వాత దేశం ఆ తప్పులను సరిదిద్దుతోంది. అంబేడ్కర్తో ముడిపడిన పంచతీర్థ్కున్న ప్రాధాన్యం ఆధారంగా ఈ ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేసింది. ఈ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐక్యతా విగ్రహ రూపంలో ప్రపంచం మొత్తం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కీర్తిని చూస్తోంది.
ఆయన ప్రతి అంకాన్ని దేశం గుర్తు చేసుకుంటోంది
సుభాష్ చంద్రబోస్తో ముడిపడిన ప్రతి అంకాన్ని దేశం పూర్తి గౌరవంతో గుర్తు చేసుకుంటోంది. నేతాజీ ద్వారా అండమాన్లో త్రివర్ణ పతాకం ఎగిరిన 75వ సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడి ఒక ద్వీపానికి ఆయన పేరు పెట్టాం. కోల్కతాలో నేతాజీ పుట్టిన ఇంటికి వెళ్లే భాగ్యం గత ఏడాది నాకు దక్కింది. ఆయన చదువుకున్న గది, ఆ ఇంటి గోడలు, మెట్లను దర్శించుకున్న అనుభవాన్ని మాటల్లో చెప్పలేను. ఎర్రకోటలోనూ ఆజాద్ హింద్ ఫౌజ్కు సంబంధించిన స్మారకం ఏర్పాటుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేతాజీ జీవితంతో ముడిపడిన దస్త్రాలను బహిర్గతం చేసే అవకాశం మా ప్రభుత్వానికి లభించింది. బోస్ ఏదైనా సంకల్పిస్తే దాన్ని ఎవ్వరూ ఆపలేకపోయేవారు. అందుకే మనం నేతాజీ నుంచి కెన్ డు, విల్ డూ స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్లాలి. నేతాజీ కలలుగన్న భారత్ను తీర్చిదిద్దడంలో మనం సఫలమవుతామన్న నమ్మకం నాకుంది’’ అని మోదీ పేర్కొన్నారు. సందర్శకుల కోసం ఇండియాగేట్ వద్ద డిజిటల్ తెర ఏర్పాటు చేశారు. డిజిటల్ దీపాల వెలుగులో రాత్రిళ్లు మాత్రమే దీనిపై విగ్రహం కనిపిస్తుంది. దీని ఎత్తు 28 అడుగులు. వెడల్పు ఆరు అడుగులు.
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి నివాళి
నేతాజీ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ ‘పరాక్రమ్ దివస్’ శుభాకాంక్షలు తెలిపారు. నేతాజీ ఆదర్శాలు, త్యాగాలు ప్రజల్లో స్ఫూర్తిని నింపుతాయని కోవింద్ చెప్పారు. బోస్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఫొటోను మోదీ ట్విటర్లో పంచుకున్నారు. ఆయనకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని ట్వీట్ చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులోని నేతాజీ చిత్రపటానికి ప్రధాని పుష్పాంజలి ఘటించారు. ప్రతి భారతీయుడి హృదయంలో స్వరాజ్య ఉద్యమంపై సరికొత్త ఉత్సాహాన్ని నింపిన మహోన్నత జాతీయవాది సుభాష్ చంద్రబోస్ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. స్వరాజ్య సంగ్రామంలో ఉన్నత పాత్రను పోషించిన వారికి దేశం రుణపడి ఉంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
-
సినీ నటుడు వెంకటేశ్ కూతురి ప్రచారం
-
హైదరాబాద్లో అభ్యర్థులకు ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయింపు
-
నీ పేరు పెట్టావ్.. ఒట్టు తీసి గట్టున పెట్టావ్
-
సన్ పిక్చర్స్కు ఇళయరాజా నోటీసు
-
ఏమైనా ఇచ్చేస్తాం.. ఎంతైనా కొనేస్తాం!.. ఓట్ల కొనుగోలుకు బరితెగించిన వైకాపా