ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
యాజమాన్య కోటా సీట్ల అమ్మకాల నిరోధంపై దృష్టి
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. శనివారం ఎప్సెట్ ఫలితాల విడుదల సందర్భంగా విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ నడుస్తోందని చెప్పారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇచ్చిన గడువులోపు ప్రవేశాలు పూర్తి చేస్తామన్నారు. యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్లను ఇష్టారాజ్యంగా అమ్ముకోకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంబీబీఎస్ సీట్ల మాదిరిగా ఏ, బీ, సీ కేటగిరీలుగా చేసి ఫీజులు నిర్ణయించడం లేక ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా చదివి లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్ లేదా బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేలా చూస్తామని వెల్లడించారు. ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటుకు కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించలేదని, అయినా కొందరు దరఖాస్తులు ఇస్తున్నారని, నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తామని తెలిపారు. గత ఏడాది అనుమతులు లేకుండా ప్రవేశాలు నిర్వహించిన రెండు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులను ఇతర విద్యాసంస్థల్లో సర్దుబాటు చేశామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు.
పాఠశాల రుసుముల నియంత్రణకు చట్టం
ఈనాడు, హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తెస్తామని వెంకటేశం తెలిపారు. ఈసారికి అది వీలుకాకపోవచ్చని, 2025-26 విద్యా సంవత్సరంలో అమల్లోకి రావొచ్చని వెల్లడించారు. మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినా చట్టం కాలేదని, దానిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులు పెడతామని చెప్పారు.
ఉపకులపతుల నియామకం కొంత ఆలస్యం
ఈ నెల 21వ తేదీతో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీకాలం ముగుస్తుందని, ఆలోపు కొత్త వీసీలను నియమించాలని అనుకున్నా ఎన్నికల నియమావళి తదితర కారణాల వల్ల ఆలస్యమైందని చెప్పారు. స్వల్పకాలానికి ఇన్ఛార్జి ఉపకులపతులుగా ఐఏఎస్లనా? లేక వర్సిటీల్లో సీనియర్లను నియమించాలా? అనే విషయాన్ని ఒకటి రెండు రోజుల్లో నిర్ణయిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముందు సీఎస్ చూసి వెళ్లారు.. తర్వాత రౌడీ మూకలొచ్చాయి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, ఆయన కుమారుడు తాము సాగు చేసుకుంటున్న భూములను మే 20వ తేదీన పరిశీలించాక, త్రిలోక్ ముఠా వాటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిందని అన్నవరం, తూడెం గ్రామ రైతులు ఆరోపించారు. -
గుత్తేదార్లకు నిధుల ‘ధార’
వాటర్ గ్రిడ్ టెండర్ల వ్యవహారంలో రాష్ట్ర గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీర్లు అడ్డగోలుగా వ్యవహరించారు. జలజీవన్ మిషన్లో భాగమైన రూ.8,690 కోట్ల విలువైన వాటర్ గ్రిడ్ పనులను ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉండే గుత్తేదారు సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు. -
మధ్యాహ్నం బాధ్యతలు.. సాయంత్రం విరమణ
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, వేధింపులకు గురైన డైరెక్టర్ జనరల్ హోదా కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) చివరికి ఆయన కోరుకున్నట్లుగానే పోలీసు యూనిఫాంలో పదవీ విరమణ చేశారు. -
ప్రజారోగ్యంతో చెలగాటం!
ప్రజారోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. ప్రజలు కలుషిత నీరు తాగి.. ప్రాణాలు కోల్పోతున్న ఘటనలే అందుకు నిదర్శనం. విజయవాడ నగరంలో ప్రస్తుతం వరుస అతిసార మరణాలు కలవరానికి గురిచేస్తున్నాయి. -
మన గుడిలో పూజ.. దిల్లీ సంస్థ సేవ!
రాష్ట్రంలో దేవాదాయశాఖకు చెందిన ప్రధాన ఆలయాల్లో నిర్వహించే అన్ని రకాల వర్చువల్ (పరోక్ష) పూజలు, సేవలకు సంబంధించిన టికెట్లను విక్రయించడానికి దిల్లీకి చెందిన సంస్థకు సైతం అనుమతి ఇస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
న్యాయవ్యవస్థపై జస్టిస్ శేషసాయి ముద్ర ప్రస్ఫుటం
న్యాయవ్యవస్థపై జస్టిస్ ఏవీ శేషసాయి చెరగని ముద్ర వేశారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ అభినందించారు. -
శ్రీవారి సేవలో కేంద్ర హోంమంత్రి అమిత్షా
తిరుమల శ్రీవారిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న హోంమంత్రి అమిత్షా, సోనాల్షా దంపతులకు అర్చకులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఏమైందో ఏమో..! ఎప్పుడూ గలగలా మాట్లాడే మోదీ మౌనంగానూ, ఎల్లప్పుడూ మౌనంగా ఉండే మన్మోహన్ గట్టిగానూ మాట్లాడుతున్నారు..!! -
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి -
విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు
ఇకపై.. విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లనున్నారు. ఉపాధ్యాయులు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో బోధన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించాలంటూ రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
తాడిపత్రి అల్లర్ల కేసులో మరో 9 మంది అరెస్టు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన రాళ్లదాడి ఘటనలో శుక్రవారం తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్సై గౌస్బాషా తెలిపారు. -
కలుషిత నీటితో 8కి చేరిన మృతుల సంఖ్య
అతిసారంతో శుక్రవారం మరో మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిచెందారు. విజయవాడ నగరం 64వ డివిజన్కు చెందిన చౌదరి కనకమ్మ(60) వాంతులు విరేచనాలతో ఉదయం మరణించారు. -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీత రచన పోటీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర గీతంగా ఉన్న ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతాన్ని గౌరవిస్తూనే దాని స్థానంలో వర్తమాన ఆంధ్రప్రాంత వైభవ స్వాభిమాన గీతాన్ని రూపొందించేందుకు ఐదు నిమిషాల నిడివిగల గీత రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. -
రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ డిమాండ్
రోహిణీకార్తె నేపథ్యంలో మండిపోతున్న ఎండలతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. విద్యుత్ వినియోగం 258.34 మిలియన్ యూనిట్ (ఎంయూ)లకు చేరింది. -
పోస్టల్ బ్యాలట్పై నిబంధనల మేరకే ఆ ఉత్తర్వులు
పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు సమయంలో ఓటరు డిక్లరేషన్కు సంబంధించిన ‘ఫాం-13ఏ’పై అటెస్టింగ్ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా పర్వాలేదు, -
సంక్షిప్త వార్తలు (5)
తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన అక్షత్ గ్రీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వివేక్ కైలాష్, విక్రమ్ కైలాష్ కుటుంబసభ్యులు రూ.1.5 కోట్లను విరాళంగా అందించారు.
తాజా వార్తలు (Latest News)
-
అసైన్డ్ భూములు 20 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా అమ్ముకోవచ్చు: కలెక్టర్ మల్లికార్జున
-
హీరో- హీరోయిన్ తిట్టుకుంటే సినిమా హిట్టే: శర్వానంద్
-
92 ఏళ్లలో తొలిసారి ఓటు.. వృద్ధుడి ఆనందం!
-
సీఎంఆర్ అల్యూమినియం పరిశ్రమలో 50 మంది కార్మికులకు అస్వస్థత
-
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్లో నేడు ఓటింగ్..
-
రూ.10 కోట్లు ఇస్తామన్నా ఆ ప్రకటన చేయనన్న అల్లు అర్జున్