PM Modi Cabinet: భారీ ప్రక్షాళన
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర మంత్రివర్గాన్ని భారీగా ప్రక్షాళన చేశారు. ఇదివరకున్న 53 మంది మంత్రుల నుంచి 12 మందికి ఉద్వాసన పలికారు. ఏడుగురికి పదోన్నతి కల్పించారు. కొత్తగా 36 మందిని కొలువులోకి తీసుకున్నారు. దీంతో మొత్తం మంత్రుల సంఖ్య 77కి చేరింది. ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ఆయన 2019 మే 31న 57 మంది మంత్రులతో కేబినెట్ ఏర్పాటు చేశారు. ...
రెండేళ్ల తర్వాత కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులు
పాత మంత్రుల్లో డజను మందికి ఉద్వాసన
ఏడుగురికి పదోన్నతి..
కొత్తగా మరో 36 మంది
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా మార్పులు
ప్రతిభ, పనితీరు, సామాజిక వర్గాల ఆధారంగా అవకాశాలు
విద్యావంతులకు ప్రాధాన్యం
ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని దక్షిణాది రాష్ట్రాలకూ ప్రాతినిధ్యం
మంత్రివర్గంలో 25 రాష్ట్రాలకు చోటు
ఈనాడు - దిల్లీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర మంత్రివర్గాన్ని భారీగా ప్రక్షాళన చేశారు. ఇదివరకున్న 53 మంది మంత్రుల నుంచి 12 మందికి ఉద్వాసన పలికారు. ఏడుగురికి పదోన్నతి కల్పించారు. కొత్తగా 36 మందిని కొలువులోకి తీసుకున్నారు. దీంతో మొత్తం మంత్రుల సంఖ్య 77కి చేరింది. ప్రధానమంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ఆయన 2019 మే 31న 57 మంది మంత్రులతో కేబినెట్ ఏర్పాటు చేశారు. రాజీనామాలు, మరణాల కారణంగా ఆ సంఖ్య 53కి తగ్గిపోయింది. గత రెండేళ్లలో మంత్రుల పనితీరు, రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని బుధవారం భారీ మార్పులు చేశారు. పనితీరు సరిగా లేని, క్రియాశీలకంగా వ్యవహరించని డజను మంది మంత్రులను పక్కనపెట్టారు. సహాయ మంత్రులుగా ఉంటూనే పనితీరుతో మెప్పించినందుకు నలుగురు స్వతంత్ర మంత్రులు, ముగ్గురు సహాయ మంత్రులకు కేబినెట్లో స్థానం కల్పించి వారి శ్రమను గౌరవించారు. వీరిలో జి.కిషన్రెడ్డి, కిరణ్ రిజీజు, ఆర్.కె.సింగ్, హర్దీప్సింగ్ పురి, మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాలా, అనురాగ్ ఠాకుర్ ఉన్నారు. బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ 43 మందితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్న ఈ కార్యక్రమం.. కొవిడ్ నిబంధనల వల్ల పరిమిత అతిథుల మధ్య సుమారు గంటన్నరపాటు సాగింది. ఎక్కువ మంది మంత్రులు హిందీలో, కొద్దిమంది ఆంగ్లంలో ప్రమాణం చేశారు.
రవిశంకర్, జావడేకర్, నిశాంక్లకు నిరాశ
మంత్రివర్గ విస్తరణ వేళ పలువురు మంత్రులకు ప్రధాని ఉద్వాసన పలికారు. మొత్తం 12 మంది మంత్రులు రాజీనామాలు సమర్పించారు. ప్రధాని సిఫార్సు మేరకు వీరందరి రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాజీనామాలు చేసినవారిలో నలుగురు సీనియర్ మంత్రులు- రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావడేకర్, హర్షవర్ధన్, రమేశ్ పోఖ్రియాల్లతో పాటు సదానందగౌడ, సంతోష్ గంగ్వార్, దేబశ్రీ చౌధురి, బాబుల్ సుప్రియో, విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే, జల్శక్తి శాఖ సహాయ మంత్రి రతన్లాల్ కటారియా, ఉన్నారు. కర్ణాటక గవర్నర్గా నియమితులైన సామాజిక న్యాయం-సాధికారత శాఖ మంత్రి థావర్చంద్ గహ్లోత్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
పక్కాగా పనితీరు అంచనా
మంత్రుల పనితీరు అంచనాకు పక్కా చర్యలు చేపట్టారు. ప్రధాని కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక యూనిట్ ద్వారా అమాత్యుల కదలికలు, మాటలు, వాటి ద్వారా ఎదురైన పరిణామాలను అంచనావేశారని తెలిసింది. అతి దూకుడుగా వ్యవహరించినవారిని, అతి నెమ్మదిని ప్రదర్శించినవారిని బయటికి పంపించేశారు. సామాజిక మాధ్యమాల్లో మంత్రులు స్పందించిన తీరుకు ఎక్కువ మార్కులు వేసినట్లు ప్రస్తుత కూర్పును బట్టి అర్థమవుతోంది. దక్షిణాదిలో ఒక్క ఆంధ్రప్రదేశ్కు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలకూ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినట్లైంది. ఉత్తర్ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాలకు పెద్దపీట వేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఎన్నికలనూ దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గ కూర్పు పూర్తిచేశారు. ముందునుంచి వినిపిస్తున్న రీతిలోనే మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్యకు కేబినెట్ బెర్తు లభించింది. కొత్తగా మంత్రివర్గంలోకి ఏడుగురు మహిళలను తీసుకున్నారు.
ఓబీసీలే 27 మంది
మొత్తం 77 మంది మంత్రుల్లో ఓబీసీల సంఖ్య 27. ఎస్సీలు 12, ఎస్టీలు 8, మైనార్టీలు ఐదుగురు ఉన్నారు. మిగిలిన 25 మంది విభిన్న సామాజిక వర్గాలవారు. నలుగురికి సీఎంలుగా పనిచేసిన నేపథ్యం ఉంది. కేబినెట్లో 25 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం లభించినట్లయింది.
15 మంది కేబినెట్.. 28 మంది సహాయ మంత్రులు
ప్రమాణ స్వీకారం చేసినవారిలో 15 మందికి కేబినెట్ హోదా, మిగిలిన 28 మందికి సహాయ మంత్రుల హోదా అప్పగించారు. పాత, కొత్త కలిపితే మొత్తం కేబినెట్ మంత్రుల సంఖ్య 30కి చేరింది. కొత్త మంత్రుల్లో 33మంది లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, 8మంది రాజ్యసభ నుంచి వచ్చారు. అస్సాం మాజీ సీఎం సోనోవాల్, తమిళనాడు భాజపా అధ్యక్షుడు ఎల్.మురుగన్ ఇంకా ఏ సభలోనూ సభ్యులుగా లేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
ఓ ఎయిర్లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్ర‘మే’
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానమైన స్కేల్ ఇవ్వాలి
విస్తృతమైన బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానంగా సవరించిన వేతన స్కేల్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. -
ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. -
పర్యావరణహిత ప్రజారవాణా మేలు
కాలుష్య ఉద్గారాలు లేని ప్రజారవాణా పర్యావరణానికి మేలు కలిగిస్తుందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్కు వచ్చారు. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. -
జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. -
భవన నిర్మాణ అనుమతుల వెనక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
కవిత బెయిల్పై తీర్పు 6కి వాయిదా
దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం వెలువరించాల్సిన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరింది. -
ఉద్యోగులకు వేతనాలివ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు
సరిపడా నిధులు లేక బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల కార్యదర్శికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph