కేట్ అదృశ్యం వేళ.. విలియం సంబంధంపై మళ్లీ కథనాలు
బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ కొద్దిరోజులుగా బాహ్య ప్రపంచంలో కనిపించడం లేదు.
లండన్: బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ కొద్దిరోజులుగా బాహ్య ప్రపంచంలో కనిపించడం లేదు. దాంతో ఆమె చుట్టూ ఎన్నో కథనాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కెన్సింగ్టన్ ప్యాలెస్ విడుదల చేసిన ఎడిటెడ్ ఫొటోతో ఆ ఊహాగానాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో విలియం వివాహేతర సంబంధం(అఫైర్)పై కథనాలు వైరల్గా మారాయి. తాజా కథనాల్లో వినిపిస్తోన్న పేరు సారా రోజ్ హాండ్బరీ. బ్రిటన్ రాజవర్గాలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న కుటుంబంలో ఆమె జన్మించారు. దాంతో ఆమెకు విలియం, కేట్తో సాన్నిహిత్యం ఉంది. చేరువలోనే వారి నివాసాలు కూడా ఉంటాయని మీడియా కథనాలు వెల్లడించాయి. విలియం, సారా మధ్య అఫైర్ ఉందని తొలిసారి 2019లో వదంతులొచ్చాయి. తాజాగా ఒక టాక్ షోలో కమెడియన్ స్టీఫెన్ కోల్బర్ట్ చేసిన జోక్తో వారి బంధం మరోసారి చర్చకు దారితీసింది. ‘కేట్ అదృశ్యంతో ఈ రాజ్యం అల్లకల్లోలమవుతోంది. కొందరు నెటిజన్లు ఇందుకు విలియం అఫైర్ కారణమని భావిస్తున్నారు. ఆ మహిళ ఎవరో మీ అందరికీ తెలుసనుకుంటున్నాను’ అంటూ గతంలో వచ్చిన వార్తలను స్టీఫెన్ కోల్బర్ట్ ప్రస్తావించారు. అనారోగ్యం వల్ల కేట్ శస్త్రచికిత్స చేయించుకున్నారని ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కార్యాలయం జనవరిలో వెల్లడించింది. ఆ తర్వాత నుంచి ఆమె బాహ్య ప్రపంచానికి కన్పించకపోవడంతో అనేక వదంతులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే బ్రిటన్లో మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని కెన్సింగ్టన్ ప్యాలెస్ ఓ ఫొటో విడుదల చేసింది. అది గందరగోళానికి దారితీసిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.